32 లిందుబింబము హసియించునెమ్మోము తెలిదమ్మికన్నులుఁ దిలనాసికంబుఁ దెలిమించునాణ్ముత్తియపునామంబు కనకపిప్పలదళ కలిత పట్టంబు ననుపమమణిమయం బగుకిరీటంబు గలుగు శ్రీవేంకటగ్రావాధినాథు." పరమయో 2అశ్వా పైయన్నింటను స్వామిముఖమున ముత్యాలనామ మున్నట్లు వర్ణన మున్నది, అది యాభరణరూపము. స్వామికి శుక్రవారమునాఁటి తిరుమజ్జనోత్సవమును అన్నమయయుఁ దత్పుత్రులును బదింబదిగా వర్ణించిరి. అది యినాఁట నిటు సాగుచున్నది:- పునుగుతైలపుటభ్యంజ నమును క్షీరఘటాభిషేకమును కుంకుమపూవు, కస్తురి, కప్రము, నూఱి బంగరు గిన్నెలనించిన యునుకుతో నలుఁగును న్వల్ప జలాభిషేకమును అనుకు నలుఁగుతో గలసిన యీతీర్ధము స్వామి పాదతీర్థముగా సేకరమయిన మీఁద విరివిగా జలాభిషేకమును జరుగును. తలకుఁ దడియారఁగాఁ బొడి వలువ పిడిచుట్టు చుట్టి దివ్యమంగళ విగ్రహము నెల్లఁ బొడివలువతో దుడిచి నీరు పూఁతగా ముఖమున దూమెఱుఁగుగా సర్వాంగమున పునుఁగు తైలముపూఁత ముఖమునఁ గర్పూర చూర్ణముతో నామము సాఁతుట యానామమునకు నడుమఁ గస్తూరీ తిలకము దిద్దుట అలమేల్మంగ హారము (మంగతాళి) మొదలగు దివ్యాభరణములను పీతకౌశేయములను ధరింపించుట జరగును. తాళ్లపాకవారినాఁట నిట్లు సాగెడిది: ఆపాద వున్నకవు వునుఁగు తైలవుటభ్యంజనముచేసి కుంకుమపూవు మొదలుగువాని యనుకుతో నలుఁగువెట్టి పన్నీటను శుద్దోదకమునను జలకమార్చి తుడిచి సర్వాంగములరదు నారఁగాఁ గర్పూరధూళిచల్లి మేదించి దానిపై నారఁగా బునుఁగు తైలమురాచి