Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33

ముత్యాలతిరునామము మంగతాళి మొదలగు దివ్యాభరణములను వస్త్రములను పుష్పహారములను నలంకరించు టయ్యెడిది.

అభిషేకసయువునఁ దాళ్ళపాక వారు దగ్గఱనుండి నలుఁగుపాటలు అభిషేకపుఁబాటలు మొదలుగునవి పాడుట, అభిషేకానంతరము వారి కొక యభిషేకవుఁబన్నీటి చెంబును తాంబూలచందనాదులను నొసగి సత్కరించుట జరిగెడిది. తిరుమజ్జ నోత్సవమిట్లు శాశ్వతముగా జరుగుటకుఁ దాళ్ళ పాకవారే స్వామి కగ్రహారముల నర్పించిరి.

శుక్రవారాభిషేకదర్శనము

కంటి శుక్రవారము గడియ లేడింట! అంటి అలమేల్మంగ అండనుండేస్వామిని ||పల్లవి||

సొమ్ములన్నీ కడఁబెట్టి సొంపుతో గోణముగట్టి! కమ్మని కదంబము కప్పు పన్నీరు! చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మొల చుట్టి! తుమ్మెద మైచాయతోన నెమ్మదినుండేస్వామిని ||కంటి|| 1

పచ్చకప్పురమె నూఱి పసిఁడిగిన్నెల నించి! తెచ్చి శిరసాదిగ దిగ నలఁది! అచ్చెరపడిచూడ అందరికన్నుల కింపై! నిచ్చమల్లెపూవు వలె నిటు తా నుండేస్వామిని ||కంటి|| 2

తట్టుపునుఁగె కూర్చి చట్టలు చేరిచి నిప్పు! పట్టి కరఁగించి వెండిపళ్యాల నించి! దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది! బిట్టువేడుక మురియుచుండే బిత్తరిస్వామిని ||కంటి|| 3

శేషాచార్యులవారి వ్రాఁతప్రతి.