పుట:AndhraRachaitaluVol1.djvu/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మ్మనఘా! యిదియ పణమ్ముగ

గొని నేవర్తకము జేసికొందు నటంచున్.

క. చచ్చిన యాయెలుకను నా

కిచ్చినయటు పద్దు వ్రాసి యిడి యతనికి, నే

దెచ్చితి దానిం గని యత

డచ్చెరుపడి నవ్వు కొనుచు నభినందింపన్.

ఈ తీరుగా మెత్తని నిర్దుష్ట శయ్యలో నీకృతి యున్నది. వారి చేతి మీదుగానే కృతి తుదముట్ట కుండుట దుర్విధి. 'నూటఏబదియార్లు' అనుపేర బరమేశ్వరుని గూర్చి వీరు సీసములు రచించిరి. అవి సువర్ణములు. ఈ కబ్బము తెనుగువారి డెందము లుబ్బింపగల గీతాంజలి. ప్రతిభాజన్య మయిన దీనికి దగినంత ప్రశస్తి దేశమున లేదు.

హృదయ పాత్రంబులో నేమియున్నదొ కాని

తొలకుచున్నది నిన్ను దలచినపుడు

ఈ మన:ఫలకమం దేమి యున్నదొ కాని

మ్రోగుచున్నది నిన్ను మ్రొక్కినపుడు

శీర్ష పేటిక నేమి చిత్రమున్నదొ కాని

మూయుచున్నది నిన్ను ముట్టినపుడు

ఈ భావవీథిలో నేమియున్నదొ కాని

తారుచున్నది నిన్ను గోరినపుడు

రమ్ము! నాతండ్రి! నను జేరరమ్ము! ప్రణతి

గొమ్ము! కరుణించి నన్నేలుకొమ్ము! చేర

నిమ్ము! నీదర్శనంబు నాకిమ్ము! నిన్నె

నమ్మినాడను శాశ్వతానందనిలయ!

                          __________