పుట:AndhraRachaitaluVol1.djvu/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేంకట పార్వతీశ్వర కవులు

(1) 1880

(2) 1882

నియోగి శాఖీయ బ్రాహ్మణులు. మొదటివారు బాలాంత్రపు వేంకటరావుగారు. వాధూలసగోత్రులు. తల్లి: సూరమ్మ. తండ్రి: వేంకట నరసింహము. జన్మస్థానము: మల్లాము (పిఠాపుర పరిసరము) జననము 1880 సం. విక్రమవత్సరము. రెండవరావు ఓలేటి పార్వతీశముగారు గౌతమగోత్రులు. తల్లి: వెంకమ్మ. తండ్రి: అచ్యుతరామయ్య. జన్మస్థానము: కొమరగిరి (పిఠాపుర ప్రాంతము) జననము: 1882 సం. చిత్రభాను వత్సరము.

గ్రంథములు : నవలలు : ఇందిర - అరణ్యక - ఉన్మాదిని - సీతారామము - సీతాదేవి వనవాసము- నిరద - నీలాంబరి - ప్రణయకోపము - ప్రతిజ్ఞా పాలనము - ప్రభావతి - ప్రమదావనము - శ్యామల - శకుంతల - చందమామ - రాజసింహ - వసుమతీ వసంతము - వీరపూజ - రాజభక్తి - వంగవిజేత - లక్షరూపాయలు - మనోరమ - మాతృ మందిరము - మాయావి - హారావళి - రజని - సాధన - కృష్ణకాంతుని మరణశాసనము - పరిమళ - సంతాపకుడు - చిత్రకథా సుధాలహరి - మున్నగునవి.

పద్యకావ్యములు:- 1. కావ్యకుసుమావళి [2 సంపుటములు 1924] 2.బృందావనము [1935 ముద్రి] 3. ఏకాంతసేవ [1922 ముద్రి] 4. ధనాభిరామము [నాటకము:వేంకటరావుగారు ప్రత్యేకముగ రచించిరి] 5. తారాశంకము. 6. సువర్ణమాల [ఈ రెండునాటకములు పార్వతీశ్వర కవిగారి ప్రత్యేకరచనములు] 7. శ్రీ రామాయణము [వాల్మీకి రామాయణమునకు జక్కని తెలుగుసేత: బాలకాండము పూర్తియై యిప్పుడయోధ్యకాండములో నున్నది రచన]

వేంకటపార్వతీశ్వరకవుల కీర్తిపతాకనెత్తినది 'ఆంధ్రప్రచారణీ గ్రందమాల. ఆంధ్రప్రచారణీ కట్టు పేరు బ్రతిష్ఠలు వచ్చుటకు వేంకట పార్వ