Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గోలకొండ సుల్తానులు

వికీసోర్స్ నుండి

గోలకొండ సుల్తానులు :

దక్షిణభారత చరిత్రలో గోలకొండ యుగ మొక ప్రత్యేక స్థానమును గడించుకొని యున్నది. ఇది ఒక విధముగ మహమ్మదీయ యుగముగ కీర్తింపబడుచున్నను, సమకాలిక సాంఘిక, రాజకీయ, సారస్వతాది ప్రభావ ముల వలనను, గోలకొండనవాబులు పాలించిన ప్రాంత మాంధ్ర దేశాంతర్గత మగుటవలనను, పాలిత ప్రజ లాంధ్రు లగుటవలనను, కొందరు మహమ్మదీయ ప్రభువుల ప్రాంతీయ దేశ భాషాభిమానము వలనను, గోలకొండ సుల్తానులు ఒక విధముగ ఆంధ్రప్రభువు నియే నిర్ణయించుట సమంజస మను విషయమున పలువురు చరిత్ర కారులు ఏకాభిప్రాయులై యున్నారు.

ఆంధ్రుల చరిత్రకును గోలకొండ చరిత్రకును విడరాని సంబంధము కలదు. కావున గోలకొండ స్థాపనోదంతమును వివరించు సందర్భమున సమకాలికాంధ్ర రాజకీయముల ప్రసక్తి అత్యవసరము. దక్షిణాపథ చరిత్రలో మహమ్మ దీయ యుగము కాకతీయుల కాలమునుండి ప్రారంభ మగుచున్నది. ఓరుగల్లు రాజధానిగా పండ్రెండవ శతాబ్ది నుండి పాలించుచున్న కాకతీయ ప్రభువుల ప్రాభవ వైభవములను క్షీణింపజేసి, దక్షిణాపథమును కైవస మొనర్చుకొనుటకై ఉత్తరమునుండి మహమ్మదీయుల దండయాత్రలు ప్రారంభమైనవి. క్రీ.శ. 14 వ శతాబ్ది ప్రారంభమున ఖిల్జీ, తుఘలకు దండయాత్రలు కాకతీ యుల పరిపాలనాంగమును ఛిన్నాభిన్న మొనర్చినవి. మొదటి దశయందు వారి దండయాత్రలు విఫలము లైనను తరువాత జయప్రదములై కాకతీయుల పతన మునకు దారితీసినవి (1828). వీరి విజయపరంపరయే బహమనీ రాజ్య స్థాపనకు నాంది యయ్యెను (1847). కాకతీయ సామ్రాజ్య పతనముతో దేశము నిర్జీవ మైనది. నిర్జీవమైనది. ప్రోలయనాయకుని అకుంఠిత దేశాభిమానము, వీరుల హృదయమున నుబికిన ప్రగాఢ స్వాతంత్ర్యేచ్ఛ, హైందవ మత ధర్మరక్షణకై పునాదులు వేసినవి. వాటి ఫలితమే విజయనగర సామ్రాజ్యావతరణము (1938). కాని నాటి కే సమయము మించిపోయినది. మహమ్మదీయుల కొక చిన్న రాజ్య మేర్పడినది. అదియే బహమనీ రాజ్యము (1847- 1512). బహమనీ రాజులు కొంత కాలమువరకు దేశీయ ప్రభువుల ధాటిని అడ్డగింపలేకపోయిరి. పరిస్థితుల ప్రోద్బ లమువలన బహమనీ రాజ్యము వివిధ రాజకీయ మండల చీలిపోయినది. క్రీ. శ. 1490 ప్రాంతమున మహమూదుషా కాలమున బిజాపూరు, అహమ్మద్ నగరు, బిరారు ప్రాంతము లేర్పడినవి. విజయనగర ప్రభువుల సామ్రాజ్యము బలిష్ఠముగా నుండినను. మహమ్మదీయ ములుగా మండలాధికారులు రాజకీయ చతురంగమున వివిధము

లయిన పన్నాగములను పన్ని తమ ఆటలు సాగించుకొను పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/531 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/532 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/533

చిత్రము - 130

పటము - 4

మోతీమహల్ సింహద్వార కవాటమునకుగల ఘనమైన గుబ్బర్దము కలదగుటచేత, మూసీతీరమున సుందర నగరముగా భాగ్యనగరమును నిర్మించిన తర్వాత గోలకొండ ప్రాభవము క్రమముగ సన్నగిల్లినది. మహమ్మద్ ఖులీ రసజ్ఞుడు, మహాకవి, పరిపాలనా దక్షుడు, భాగ్యనగర నిర్మాణ మను సుందర స్వప్నమును రూపొందించినవాడు. ప్రియాపరి రంభసౌఖ్యరసై కలోలుడయ్యు, ప్రజాహితై కాభిలాషిగా వరలినవాడు. ఈతని ఏకైక దుహిత హయాత్ బక్ బేగమ్. ఈ రాజకుమార్తె పట్టపురాణికి జన్మించినదని స్థానిక చరిత్రకారులు అభిప్రాయ పడుచున్నను, ఈమె భాగ్యమతి యొక్క కుమార్తె యనియే ప్రబలమైన జన శ్రుతి కలదు. ఈమెను సుల్తాన్ మహమ్మద్ అను నాతనికిచ్చి 1607 లో వివాహము గావించిరి.

మహమ్మదు ఖుతుబుషా : మహమ్మద్ ఖులీ త ర్వాత సుల్తాన్ మహమ్మద్ గోలకొండ ప్రభు వయ్యెను (1612- 1626). కాని అతడు తన 84 వ ఏటనే మరణించెను.

అబ్దుల్లా ఖుతుబుషా : ఇతడు బాలుడుగా నుండుటచే తల్లియగు హయాత్ బక్షీ బేగమ్ రాజ్యరక్షణ భారమును స్వీకరించి, కుమారుడగు అబ్దుల్లా ఖుతుబ్ షాకు (1626- 1672) చేదోడుగా నుండెను. గోలకొండ పట్టపు రాణు లలో హయాత్ బక్షీ బేగము గొప్ప అదృష్టవంతురాలని చెప్పవచ్చును. ఏల యన ఈమె తండ్రి, భర్త, కుమారుడు వరుసగ గోలకొండ సుల్తాను లగుటచేత ఈమె రాజ కుమార్తెగను, పట్టపురాణిగను, రాజమాతగను మూడు కాలాలపాటు సుఖముగా జీవించి మహోన్నత దశను అనుభవించిన భాగ్యమతి ఈమె.

అబుల్ హసన్ కుతుబుషా : కుతుబషాహి వంశ మున చివరి రాజు అబుల్ హసన్ కుతుబ్ షా (1672_1687). అక్కన్న మాదన్నల మూలమునను, భక్త రామదాసు మూలమునను తెలుగువారికి సుపరిచితుడైన భోగియు, విలాసజీవియు నైన తానాషా ఈతడే. మహోన్నత ప్రాభవ వై భవముల ననుభవించిన గోలకొండ రాజ్యము ఈతని కాలమున మొగలు సామ్రాజ్యాధిపతుల దృష్టి నాకర్షింప గలిగినది. స్వయముగ ప్రభువు భోగలాలసు డగుటచేతను, హిందూ మంత్రులగు అక్కన్న మాదన్నల ప్రాభవమును ద్వేషదృష్టితో చూచిన మొగలుల అగ్రహ మునకు గురియగుటచేతను, దురాశాపరులును, మూఢా త్ములు నైన మహమ్మదీయుల విద్రోహచర్యల ఫలితము గను, గోలకొండ రాజ్యము కొన్ని మాసములలో ఔరంగ జేబు వశమయ్యెను. క్రీ.శ. 1687 లో సుల్తానుల ధ్వజము గోలకొండదుర్గమునుండి తిరోధానము నొం దెను.

ఇక గోలకొండ యుగమునకు సంబంధించిన ఇతర విష యము లెన్ని యోకలవు. గోలకొండసుల్తానుల ప్రజాహిత కార్యములు, కట్టడములు, వాఙ్మయ పోషణము, నాటి సాంఘిక పరిస్థితులు, మున్నగునవి చరిత్రకారుల దృష్టి నాకర్షించినవి.

ప్రజాహితకార్యములు; కట్టడములు : గోలకొండ సుల్తా నులు పెక్కు ప్రజాహిత కార్యముల నొనర్చిరి. అందు హర్మ్య, ప్రాసాద, తటాకాది నిర్మాణములు ముఖ్య మైనవి. గోలకొండను స్మరించుసరికి మొదట మన మనః ఫలకమున ప్రతిబింబించునది గోలకొండ దుర్గము. ఆంధ్ర ప్రాంతమునగల సుప్రసిద్ధములైన దుర్గములలో నిది యొకటి. ఇది హైదరాబాదు నగరమునకు ఆరుమైళ్ళ దూరమున కలదు. ఇది మొదట మట్టికోటగ నుండినదట. ఇది 14 వ శతాబ్దమున బహమనీ సుల్తానుల వశమైనది. ఒకానొక కాలమున 'మానుగల్లుకోట' అను పేర ఈ దుర్గము ప్రసిద్ధమై యుండినటుల 'తేవనాట్' వ్రాతల వలన స్పష్టమగుచున్నది. ఈ దుర్గనిర్మాణమున గొల్ల వాని సహకారముండి యుం డెననుటకుకూడా తగిన ఆధార ములుక లవు. సుల్తాన్ కులీకుతుబ్ షా కాలమున ఈ దుర్గము బలిష్ఠ మొనర్పబడెను. భోనగిరి దుర్గమును నిర్మించిన ధనగరుకొండయ్యయొక్క ఆశీర్వాదమునొంది అహమ్మద్ నగరుగా పేర్కొనబడియున్న దుర్గమును గొల్లకొండగా సుల్తానులు మార్చిరి. గోలకొండ దుర్గము క్రీ. శ. 1651 ప్రాంతమున పునర్నిర్మితమైనది. ఈ దుర్గమున మూడు కోటగోడలు ఒకదాని నొకటి చుట్టుకొని యున్నవి. దుర్గముచుట్టును పర్వత ప్రాంత మొకటి కలదు. ప్రాకార కుడ్యముల కై వారము దాదాపు మూడు మైళ్ళుండును. 87 బురుజులతోను, ఎనిమిది ద్వారములతోను ఈదుర్గము బలిష్ఠముగా నుండినది. ఆనాటి కోటద్వారములలో ప్రస్తుతము ఫత్తేద ర్వాజా మాత్రమే నిలచియున్నది.

గోలకొండ దుర్గ శిఖరమున 'బాలాహిస్సారు' కలదు. ఇచట రాజప్రాసాదములు, అంతఃపురములు, ఉద్యాన వనములు, మసీదులు, దేవాలయములు, ఆయుధాగార ములు, అంగళ్ళు, భాగ్యమతియొక్కయు, తారామతి యొక్కయు వాసగృహములు, మాదన్న మంత్రి పూజా మందిరము మున్నగున వెన్నియో కలవు. గోలకొండ నుండి కొన్ని సొరంగములు గోషామహలు, చార్మినారుల వరకు భూగర్భమున కలవని జనశ్రుతి బలీయముగ నున్నది. గోలకొండ సుల్తానుల సమాధులు 'లంగర్ హౌసు' ప్రాంత మున కలవు. ఈ సమాధులు, దక్కనీమహమ్మదీయ శిల్ప మునకు చక్కని తార్కాణములు. భాగ్యమతి సమాధి కూడ ఇచ్చటనే కలదని తెలియుచున్నది. చక్కని పర్వత ప్రాంతమునుండి సుందర బలిష్ఠ ప్రాకారకుడ్యములతో నొప్పారిన గోలకొండ దుర్గమును ముట్టడించి వశపరుచు కొనుటకు ఔరంగజేబు సైన్యమునకు ఎనిమిది మాస ములు పట్టెననుటయే దీని ప్రతిష్ఠను చాటుచున్నది.

కేవలము దుర్గమేకాక, గోలకొండ ప్రాంతమునను, మూసీతీరమునను ఎన్నియో హర్మ్యములు, ప్రాసాద ములు గోలకొండ సుల్తానుల కాలమున నిర్మింపబడినవి. కొన్ని శిథిలావస్థలో నున్నవి. మరికొన్ని నేటికిని చెక్కు చెదరక హైదరాబాదును సందర్శించువారికి నేత్రపర్వ ముగ నున్నవి. అట్టివాటిలో చార్మినారు, మక్కా మశీదు ముఖ్యమైనవి. బారాదరి, గోషామహల్ మున్నగు భవనములు పెక్కులు భాగ్యనగర నిర్మాణానంతరము కట్టబడినవి. ఎటు చూచినను ఉద్యానవనములు, హర్మ్య ములు, ప్రాసాదములు ఉండెను. కావుననే విదేశయాత్రికు డొకడు “నగరమంతయు సుందరోద్యానము" గ నుండెనని వర్ణించెను. హుస్సేన్ సాగరు వంటి తటాకములుకూడ నిర్మింపబడినవి. యాత్రికులకు సత్రములు కట్టబడినవి. ప్రాసాదములయొక్కయు, సుందర భవనముల యొక్కయు శిథిలచిహ్నములు నేటికిని గోలకొండను దర్శించువారిని విస్మయమగ్నుల నొనర్చుచున్నవి. దుర్గమును బలపర్చు టయే గాక వివిధ నగర నిర్మాణ కార్యక్రమములయందు కూడ సుల్తానులు శ్రద్ధవహించిరి. ఇబ్రహీంపట్టణము, హయాత్ నగరమువంటివి నాడు వెలసినవే.

సాంఘికపరిస్థితులు : గోలకొండనగరము శతాబ్దముల వరకును వర్తక వ్యాపార కేంద్రముగ విలసిల్లినది. కోహినూర్ వజ్రముల వలననే గోలకొండ పేరు సర్వ ప్రపంచమునకును సుపరిచితమైనది. రత్నములకు, వజ్రములకు, కస్తూరీ మొదలగు సుగంధ ద్రవ్యములకు గోలకొండ వ్యాపార కేంద్రముగ నుండినది. విదేశములనుండి వర్తకులు వచ్చి సరకుల నమ్మి ధనరాసులను సంపాదించుకొను చుండిరి. కొన్ని సంవత్సరములు తప్ప తక్కిన కాలమును గోలకొండ సుభిక్షముగ నుండినది. కృషియందు కూడ గోలకొండ ఏ ప్రాంతమునకు వెనుకబడినది కాదు. గోధుమ, జొన్న, పప్పుధాన్యములు, ఆముదములు, తాటి బెల్లము, ఆమ్ల ఫలములు, నారింజ ఫలములు, మున్నగు నవి విరివిగ ఆర్థిక సంపత్తిని కూర్చినవి. దట్టమైన అడవుల వలన వంట చెరకు విరివిగా లభించెడిది. వన్యమృగములు కూడ ఎన్నియో యుండెను. అన్నిటివలన దేశమున కెంతయో ఆదాయము లభించెడిది. గోలకొండలో గల 23 గనుల వలన కూడ దేశమునందలి ఆర్థిక పరిస్థితులు పటిష్ఠముగ నుండెను. అందుచేత దేశమున ప్రజలు ఏదియో ఒక వృత్తియందు సిద్ధహస్తు లై యుండిరి. కరువు కాటకములు లేక ప్రజలు సుఖముగ జీవించుచుండిరి. గోల కొండ నేతపనికి కూడ ప్రసిద్ధమై యుండెను. ఇచ్చటి వస్త్రములు విదేశములకు గూడ ఎగుమతి యగుచుం డెను. నిర్మల, ఇందోల్ ప్రాంతమును ఇనుము, ఉక్కు పనిముట్లు తయారగుచుండెను. దారు శిల్పము కూడ ప్రసిద్ధమై యుండెను. నేటికిని కొండపల్లి బొమ్మలు ఆకర్షకములయి యున్నవి. కస్తూరి, చందనము, చైనా సిల్కు, పంచదార పోరస్ పాత్రలు, చైనా వస్త్రములు మున్నగునవి గోల కొండకు దిగుమతి యగుచుండెడివి. దేశమునగల ప్రశాంత పరిస్థితులవలన భాషా వాఙ్మయ పోషణ మొనర్చుటకు గోలకొండ సుల్తానులకు సదవకాశము లభించినది.

గోలకొండ వాఙ్మయపోషణము : గోలకొండ సుల్తా నులు సంస్కృతాంధ్ర వాఙ్మయములను, పారసీక, ఉర్దూ భాషావాఙ్మయములను చక్కగా పోషించిరి. సంస్కృత మున శృంగారమంజరి యను అలంకార గ్రంథము ఈయుగ మున రచింపబడినదే. ఆంధ్రభాషా వాఙ్మయ పోషణము నను, కవిపండితాదరణమునను గోలకొండ సుల్తానులు చూపిన అభిరుచి ప్రశస్తమైనది. మహమ్మదీయ ప్రభువులలో సుల్తాను ఇబ్రహీం కుతుబుషా ఏడు సంవత్సరములవరకు విజయనగరమున నుండి తెలుగు భాషా పాండిత్యమును సంపాదించుకొని గోలకొండసింహాసనము నధిష్ఠించిన తరు వాత తెలుగుపండితులను, కవులను ఆదరించి తదచిత కావ్యములకు కృతిభ ర్తయై స్థిరకీర్తి విరాజితుడయ్యెను. నాటినుండియు విద్యానగరముతోపాటు గోలకొండకూడ ప్రధాన విద్యారంగమయ్యెను. అద్దంకి గంగాధరకవి 'తపతీసంవరణోపాఖ్యానము', పొన్నగంటి తెలగనార్యుని 'యయాతి చరిత్ర', రుద్రకవి 'నిరంకుశోపాఖ్యానము',

  • సుగ్రీవవిజయ యక్షగానము', మట్ల అనంతభూపాలుని

'కకుత్సవిజయము', సారంగు తమ్మయ 'వైజయంతీ విలా సము', భద్రాచల రామదాసు 'భద్రాద్రిశతకము', 'రామ దాసు కీర్తనలు' మున్నగు వివిధ ఆంధ్రవాఙ్మయ ప్రక్రి యలు గోలకొండ సుల్తానుల కాలమున వెలువడినవే. ప్రప్ర ధమముగ అచ్చతెనుగు కబ్బమగు యయాతి చరిత్రము 'ఈ కాలమున రచితమగుట గమనించదగిన విశేషము.

పై కావ్యపీఠికల వలన గోలకొండ సుల్తానుల యొక్కయు, తత్ప్రధానాధికారుల యొక్క యు వాఙ్మ యాభిరుచి తేటపడుచున్నది. అంతియేకాక మహమ్మ దీయ చరిత్రకారులకు తెలియని విశేషాంశము లెన్ని యో బయల్పడినవి. భాగ్యనగర నిర్మాతయగు మహమ్మద్ కులీ స్వయముగ తెలుగులో పద్యరచన గావించినటుల స్థానిక చరిత్రకారుల వ్రాతలవలన రుజువగుచున్నది. కాని నేటికిని అట్టి పద్యములు లభింపకుండుట దురదృష్టము. తండ్రి వారసత్వమునను, భాగ్యమతి పరిచయ భాగ్య మునను మహమ్మద్ కులీ తెలుగునేర్చి పద్యరచన గావించి యుండుటలో ఆశ్చర్యము కాని, సందేహము కాని, ఉండ బోదు. మహమ్మద్ కులీ వ్రాసిన ఉర్దూగీతములందు భ్రష్ట రూపమున తెలుగుపదము లెన్ని యో ఉపయోగింపబడినవి.

గోలకొండ సుల్తానులు పారశీక ఉర్దూ భాషా వాఙ్మయముల కొనర్చిన సేవను ప్రత్యేక ముగ ప్రశంసింప నవసరము లేదు. ప్రభువుల భాషాభిమానమును పురస్కరించుకొని వి దేశములనుండియు, మొగలు దర్బారునుండియు ఏ తెంచిన ఎందరో పారశీక కవులు గోలకొండ దర్బారు నలంక రించిరి. వీరు సుల్తానుల చరిత్రను, గోలకొండయందలి తమ అనుభవములను గ్రంథరూపమున ప్రకటించిరి చరిత్ర కారుల కాగ్రంథము లెంతయు నమూల్యములు.

కులీకుతుబుషా కాలమున నొక సాహితీసమితి ఏర్ప డెను. జమీదు కాలమునుండి సుల్తానుల దర్బారు సుప్రసిద్ధి కెక్కెను. జమీదు ఉర్దూ కవిత్వమున సిద్ధహస్తుడు. అతడు ఒక్కొకసారి ఆవేశమునకు లోనై ఆశుకవిత చెప్పెడి వాడట. ఇబ్రహీంకాలము పారశీక ఉర్దూ వాఙ్మయము లకు స్వర్ణయుగమని చెప్పవచ్చును. అమీనా, మహమ్మద్ అంజూ, అమీర్ ఇమాముద్దీన్, కాసిం బేగ్, హుస్సేన్ కులీమీర్జా మొదలగువారెందరో ఈతని దర్బారు నలంక రించిరి. “శారీఖె ఖుతుబ్ షాహి” (కుతుబ్ షా చరిత్ర) ఈ కాలమున రచింపబడినదే. రసికాగ్రేసరుడగు మహమ్మద్ కులీకాలమున ఉర్దూభాషావాఙ్మయములకు మహోన్నత స్థానము లభించినది. ఈతని పేష్వా 'మీర్ మోమిన్' పారశీక పండితుడు. మీర్జామహమ్మదు అమీన్ వంటి పండితు లెందరో ఉండిరి. సుప్రసిద్ధకవి, మహమ్మదు కులీఖుతు బుషా సమకాలికుడు 'ముల్లావజీ' యనువాడు 'కుతుబ్ ముష్తరి' యనుకావ్యమును రచించెను. ఈ కావ్యము అలా భాగ్యమతి నుద్దేశించి వ్రాయబడినదని పండితులు చెప్పు చున్నారు. మహమ్మద్ కులీ స్వయముగ గొప్పకవి. ఇతడు తన ప్రియురాండ్ర నుద్దేశించి వ్రాసిన ప్రేమగీతి కలు నేటికిని సహృదయుల నాకర్షించుచున్నవి. మహమ్మ దీయులయొక్కయు, హిందువులయొక్కయు పండుగ లపై కూడ ఇతడు కొన్ని గీతికలు రచించెను. కాలమున కూడ ఎన్ని యో చారిత్రక గ్రంథములు రచింప బడినవి. ఈతని సోదరి ఉత్తమకవయిత్రి. గోలకొండ సుల్తానులు 'దక్కనీ ఉర్దూ' అను ఉర్దూమాండలిక మును అభివృద్ధి పరచి పోషించినందున ఉర్దూ వాఙ్మయచరిత్రలో వారికి ప్రత్యేక స్థానము లభించినది. దక్కనీ ఉర్దూ కూడ కావ్యరచనా స్థాయి నందుకొనజాలెనని బీజాపురము, గోలకొండవారు సోదాహరణముగ నిరూపించిరి. ఈ కాల మున ప్రణయగాథా కావ్యములు, వీరగాథలు, మస్నవీ, గజల్, ద్విపద, పద్యసంకలనములు, ప్రణయగీతికలు. మర్సియా మున్నగు కావ్యప్రక్రియలకు అధిక మైన ఆద రము లభించినది. కావుననే ఉర్దూ వాఙ్మయమున కిది స్వర్ణయుగమని చెప్పవచ్చును.

గోలకొండ కథలు - గాథలు : విజయనగర సామ్రాజ్య సంపదకును, తదితర రాజ్యవై భవములకును సంబంధించిన గాథలు జనబాహుళ్యమున ప్రచారము నొందినట్లే, గోల కొండకు సంబంధించిన గాథలును నేటికిని హైదరా బాదులో పెద్దలలో వ్యాప్తిలో నున్నవి. ఇట్టి గాథలలో చారిత్రికాధారములు కలవి కొన్నియు శ్రుతి ఆధార ములు గలవి కొన్నియు, కేవల కల్పితములు మరికొన్నియు కలవు. ఇట్టి గాథలలో, భాగ్యమతి ప్రణయగాథ, గోల కొండ కోహినూరు వృత్తాంతము, అబ్దుల్ రజాక్ లారి వీరరసాత్మక గాథ, గోలకొండ సుల్తానులకును, ప్రధానాధి కారులకును సంబంధించిన గాధలు, చార్మినారు మక్కా మసీదు, గోషామహలు, బారాదరి, మిల్క్ మహల్, పురానాపూల్ మున్నగువాటి నిర్మాణమునకు సంబంధిం చిన వింతగాథలు, ఆంధ్ర మంత్రులగు అక్కన్న మాదన్న వృత్తాంతములు, రాజకుమారులకు, రాణివాసములకు, రాజకుమా ర్తెలకు, ప్రియురాండ్రకు, మతగురువులకు సంబం ధించిన చిత్రవిచిత్రములైన గాథలు ఎన్నియో కలవు.

గోలకొండ పరిపాలనా యంత్రము: గోలకొండ ప్రభువులు నిరంకుశులై వర్తించినను, తగిన అధికారవర్గమును నియమించి వారి సలహా ననుసరించి దేశమును పాలించిరి. అన్ని విషయములందును సుల్తానుల మాటయే వేదవా క్కుగా భాసిల్లెను. అయినను రాజ్యనిర్వహణమునకు సంబంధించిన ప్రధానాధికారులు కొందరుండిరి. ప్రధాన మంత్రి పదవిని అలంకరించువానిని ' వేష్వా' అనుచుండిరి. ముస్తఫాఖాన్, మీర్ మోమిన్ అనువారు పేష్వాలై. సింహాసనమునకు ఎడమ వైపుననున్న గౌరవస్థానమును అలంకరించిరి. రెవిన్యూ, ఆర్థిక శాఖల ఆధిపత్యమును వహించువారిని 'మీర్ జుంలా' అనుచుండిరి. ముల్లాతఖీ, మీర్జా మహమ్మద్ మున్నగువారు ఈ పదవి నలంకరించిన వారు. సై న్యాధికారిని 'ఆయిన్ ఉల్ ముల్క్' అని పేర్చొను చుండిరి. అకౌంట్సు, ఆడిట్ శాఖలను నిర్వహించిన ఉప మంత్రిని 'మజుందార్ ' అనుచుండిరి. 'నాజిర్ ' అనగా ఇన స్పెక్టరు. ఇప్పటికిని విద్యాశాఖలో కొందరు నాజిర్ అను పదవిని నిర్వహించుచున్నారు. రాజకీయవ్యవహారములు, ఉత్తర ప్రత్యుత్తరములు నిర్వహించుట, శాసనములు, ఉర్దూలోను, తెలుగునందును వ్రాయించుట మున్నగు పనులు చేయువారిని 'దబీరు' అని పేర్కొనిరి. పోలీస్ కమీ షనరును 'కొత్వాలు’అని పిలుచుచుండిరి. ఈ పదవికూడ మొన్న మొన్నటి వరకును అమలులో నుండెను. వీరు కాక హవల్దారు, జమేదారు మున్నగు ఇతర అధికారు లెందరో ఉండిరి. గోలకొండ ప్రధానాధికారవర్గమును గూర్చి వాయునపుడు ఆంధ్రమంత్రు లగు అక్కన్న మాదన్న మహా భాగులను గూర్చియు, భద్రాచలము తహసీల్దారుగ నున్న కంచర్ల గోపన్న మహాశయుని గూర్చియు విస్మ రింపజాలము. సుల్తానుల అత్యాదరణము నొంది ప్రధా నాధికారులై వరలిన వీరు ఆంధ్రులై యుండుట గర్వ కారణము. వీరు తమ మేధా సంపన్నతచేతను, పరిపా లనా దక్షతచేతను, దూరదృష్టి చేతను, మహమ్మదీయ సుల్తానుల అనుగ్రహమునకు పాత్రులై, అపర యుగంధ రులుగా కీర్తి నొందిరి. వీరు పారశీక వాఙ్మయమునందు పాండిత్యము కలిగి ప్రఖ్యాతులైనవారు. వీరి పాండితీ గరిమను, పరిపాలనా దక్షతను గుర్తించక అసూయా పరులై వీరిని పదవీభ్రష్టులను చేసినందున అచిర కాలము ననే దేశము అన్యాక్రాంత మైనది.

ఈ విధముగ గోలకొండ రాజకీయ చతురతకు, వివిధ

భాషావాఙ్మయ పోషణమునకు, దేశీయ విదేశీయ వర్తక వ్యాపారములకు, తదితర అభ్యుదయ కార్యములకు దాదాపు మూడు శతాబ్దములు ప్రధాన కేంద్రముగ మహోన్నత వైభవము ననుభవించినది.

కో. గో.


గౌతమబుద్ధుడు :

భారత దేశ మునకు ఉత్తరమున నేపాళమునందు శాక్య నామక క్షత్రియవంశమున శుద్దోదనుడను రాజు ఉండెను. అతని రాజధాని కపిలవస్తునగరము. అతనిభార్య మాయా దేవి. ఆమె గర్భవతియై కపిలవస్తు పట్టణమునుండి పురిటికై పుట్టింటికి ప్రయాణము చేయుచుండెను. మార్గ మధ్యమున లుంబిని యను ఆరామమునందు ఆమెకు ఒక మగశిశువు జనించెను. ఆ శిశువు నకు సిద్ధార్థుడని నామక రణము చేయబడెను. ఈ శిశువే అనంత రము గౌతమ బుద్ధుడుగా ప్రసి దు డయ్యెను. గౌతమబుద్ధుని జన్మసంవత్స రమును గూర్చి చారిత్రకులలో అభిప్రాయ భేదము కలదు. కాని క్రీ. పూ. 563 సం. ప్రాంతమున అతడు జన్మించినట్లు పెక్కురు అంగీకరించిరి. అతడుపుట్టినపుడు వచ్చిన జ్యోతిష్కులు పరిపా లింప దలచినచో అతడు చక్ర వర్తి కాగలడనియు, సన్యసించి జ్ఞానసిద్ధిని పొందగల డనియు తెలిపిరి. సిద్ధార్థుడు నచో జన్మించిన వారమురోజుల కే అతని జనని మాయాదేవి మర ణించెను. అందుచేత శుద్దోదనుని రెండవ భార్యయగు మహా ప్రజా పతి గౌతమి ఈ శిశువును వాత్స ల్యముతో పెంచెను. సిద్ధార్థుడు యౌవనమునందు 62 52 గౌతమబుద్ధుడు యశోధర యను కన్యను వివాహమాడి, ఆ మెయందు రాహులుడను పుత్రుని బడసెను. సిద్ధార్థుడు చిన్న నాటి నుండియు ఇతర క్షత్రియ బాలురవలె క్రీడాసక్తుడుగాక నిరంతరము దీర్ఘాలోచనా నిమగ్నుడై యుండెడి వాడు. అతని అట్టి విచిత్ర ప్రవర్తనమును గాంచి, అతడు విరాగి యగునేమో యని భీతిల్లి తండ్రియగు శుద్దోదనుడు అతని మనస్సును ప్రాపంచిక విషయములపై మరల్చుటకయి అనేకవిధముల యత్నించెను. అయినను, కారణజన్ముడైన సిద్ధార్థుని విషయ సుఖములు ఆకర్షింపజాలకుండెను. సిద్ధార్థు డొక నాటి సాయంకాలము వాహ్యాళి కై పుర బాహ్య ప్రదేశమునకు వెడలెను. అచ్చటచ్చట త్రోవలో మున్ముందు కనిపించిన వృద్ధ, రోగి, శవ దృశ్యములవలన అతని హృదయము దుఃఖావిష్టమయ్యెను. పిదప నొక చిత్రము - 131 సన్యాసి కనిపించెను. సిద్ధార్థుడు సన్యాసిని పిలిచి పటము - 1 గౌతమబుద్దుడు 489 ఆ యడుగగా సన్యాసి తాను మోక్షము కొరకు సన్యసించితి ననియు, ఆసన్యాసమే తన నిత్యతృప్తికి, నిత్య సంతోషమునకు కారణ మైన దనియు చెప్పెను. సన్యాసి వృత్తాంతమును వినిన తోడ నే సిద్ధార్థుడు దీర్ఘాలోచనా నిమగ్నుడై రథమును మరలించి స్వీయనగరము చేరెను. ఆ సిద్ధార్థునకు ప్రపంచమున సర్వత్ర దుఃఖమే కనిపించెను. ప్రజల దుఃఖమును నివారించి వారు శాశ్వత మైన ఆనందమును పొందుటకై మార్గమును అన్వే షించుటకు అతడు నిశ్చయించు కొ నెను. తోడ నేఅతనికి ఇంద్రియ భోగముల పై ఏవగింపును, ప్రాణి వర్గముపై అపారమైన దయ యు, సంసారమును పరిత్యజింప తలంపును కలిగెను. ఆ పరిత్యా గము స్వీయ మోక్షమున కై