Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గతితార్కిక భౌతికవాదము

వికీసోర్స్ నుండి

గతితార్కిక భౌతికవాదము :

కారల్ మార్, ఫ్రెడెరిక్ ఎంగెల్స్ అనువారు సుప్రసిద్ధమైన తమ ఆర్థిక శాస్త్ర గ్రంథములలో వివరించిన రాజకీయ తత్త్వ సిద్దాంతమునకు గతితార్కిక భౌతిక వాదమని పేరు. 1917 వ సంవత్సరమున రష్యా దేశ మందు కమ్యూనిస్టు వ్యవస్థ నెలకొనినప్పటినుండి, ఆ దేశ మందును, ప్రపంచమందలి ఇతర సామ్యవాద దేశము ఈ గతితార్కిక వాదము అధికారిక సిద్ధాంత మైనది.

గతితార్కిక భౌతిక వాద మనగా నేమి ? భౌతిక వాద మొక శాస్త్రీయమైన తాత్త్విక సిద్ధాంతము. భౌతిక వాదము బహుభంగుల నిర్వచింపబడి వివరింపబడి ఉన్నది. అన్ని దృక్పథములందును ఒక అంశము సర్వసాధారణ మైనది (common) గా నున్నది. ఈ విశ్వమున మనస్సు నకు స్వతంత్రమైన, ఐచ్ఛికమైన ప్రవృత్తిలేదు. దాని ప్రవృత్తి మాన సేతర విషయముల యొక్క (non-mental entity) చలనముచే తుదకు నిర్ణయింపబడును. ఆ చలనములను మనస్సు తనయం దిముడ్చుకొని పర్యా లోచన చేయును. ఇట్టి మానసేతర విషయము సామా న్యముగా భౌతిక పదార్థమని భావింపబడుచున్నది. కొందరు భౌతిక వాదులు మనస్సు యొక్క అ స్తిత్వమును పూర్తిగా నిరాకరింతురు. కాని స్వతంత్రమైన చొరవ (Initiative) మనస్సునకు లేదను విషయమున మాత్రము భౌతిక వాదు లందరును ఏకీభావము ప్రకటిం చెదరు. ప్రకటించెదరు. కారల్ మార్క్స్ రెండవ బృందమునకు చెందినవాడు. ప్రాచీన, ఆధునిక తత్త్వశాస్త్రములను మార్క్స్ రెండు తరగతులుగా వర్గీకరించెను : (1) పదార్థము (Matter) మనస్సుకం టె తార్కిక ముగను (logical), కాలక్రమాను గతముగను (chronological), ముందరిదే (prior) నని విశ్వసించెడి భౌతిక వాదులు. (2) మనస్సు పదార్థము కంటె తార్కికముగను, కాలక్రమానుగతముగను పూర్వ పుదేనని భావించెడి ఆత్మవాదులు. వీరిలో మార్క్స్ మొదటి తరగతికి చెందినవాడు. కాని 18, 19 వ శతా బుల నాటి భౌతిక వాదులకంటె మార్క్స్ భిన్నాభిప్రా యము గలవాడు. ఈ శతాబ్దులనాటి భౌతిక వాదులు ప్రతిపాదించిన సిద్ధాంతము ప్రకారము మనస్సు మైనము వంటి పదార్థమని తెలియుచున్నది. బాహ్య ప్రపంచము నుండి ఈ పదార్థముపై ఇంద్రియ గ్రహణముల (sensa- ్కన గతితార్కిక భౌతికవాదము tions) వలె భావముద్రలు (impressions) ప్రసరించును. ఇట్టి భౌతిక వాద సిద్ధాంతము నెడల మార్క్స్ తన ఆడే పణము ప్రకటించెను. కారణమేమన, బాహ్య ప్రపంచ మును గూర్చి 'తెలియుట' (Knowing=మననము లేక ధ్యానము చేయుట) అను భావము లేదనియే అతడు వాదించును. తద్విరుద్ధముగా, బాహ్యప్రపంచము నుండి బయలు వెడలు భావ పరంపరల నుండియు, సంఘటనల నుండియు కలుగు మానసిక పరివర్తనలచేత సే మానవుడు ఏ ఆలోచన నైనను, కార్యమునైనను చేయనారంభించు నని మార్క్స్ అభిప్రాయము. బాహ్య ప్రపంచమును తెలిసికొనుటయే గాక, దానిని పరివర్తనము చేయుట మానవ ప్రవృత్తిలో గల సార్థక్యము. బాహ్య ప్రపంచ మును గూర్చి తెలిసికొనుట వలననే మనము తృప్తిపడుట లేదన్న అంశమును కాదనలేము. కాని బాహ్య ప్రపంచ మును తెలిసికొనుట మాత్రమే మానవుని ధ్యేయము కాగూడదు. ఏదేని యొక మాచరించుట కే మన కార్య మొక విషయమును తెలిసికొందుము. ఆచరణకు అన్వ . యింపబడని ఎట్టి జ్ఞానమైనను స్వతంత్రముగ మానవునకు సంక్రమింపజాలదు . సిద్ధించిన జ్ఞానముతో తెలిసికొనిన పదార్థమును మార్చుట వలననే, అట్టి జ్ఞానము సార్థక మగును. కార్యాచరణము వలననే పరిసరముల ప్రభా వము మారును. ఆ కార్యాచరణము వలననే కర్తగూడ మారగలడు. ఈ విధముగ మానవ ప్రకృతి గాని, లేక విశ్వము గాని, చలనరహితముగ నుండదని మార్ ) యొక్క విశ్వాసము. మానవుడును, ఆతని ప్రకృతియు నిరంతరముగ పరివర్తనము చెందుచు, అతనితో పాటు నిర్విరామముగ మారెడు విశ్వమును గూర్చి మార్జించుచు, తనకు సిద్ధించిన జ్ఞానముచే ఇతోధిక ముగ మార్పును కలుగ జేయుటకై ఆతడు ఉత్సాహముతో ఉద్యమించును. 277 • ఇట్టి భౌతిక వాదరూపమునకు 'గతితార్కికము' అను విశేషణపదమును చేర్చుటచే, సామాజిక పరిణామమునకు గతితార్కిక సిద్ధాంతములను అన్వయము చేయు పునాది ఏర్పడుచున్నది. గ్రీసు దేశములో ప్రప్రథమముగా 'గతి తార్కికము' అను పదము ప్రయోగింపబడెను. ప్రత్యర్థుల నడుమ చర్చలమూలమున వా స్తవవిషయమును తెలిసి కొనుటయే 'గతితార్కికము' అను పదమున కర్ణము . హెగెల్ అభిప్రాయమును బట్టి, మానవజీవితానుభవ ముల యొక్కయు, చారిత్రకానుభవముల యొక్క యు సంఘర్షణమే గతితార్కిక వాదమున కర్ణము. భావ ములు, అనుభవములు, సంఘటనలు సంఘర్షించి ఒక దానిపై మరొకటి ఆధిపత్యము వహించు క్రమవిధాన ములో నొక సంయోగీకరణము (Synthesis) ఉద్భవించును. సంఘర్షించు ఇరుపక్షములందలి కొన్ని సత్యములు సం యోగీక రణమందు ప్రవేశము కల్పించుకొనును. ఇట్లు సాధింపబడిన సంయోగీక రణము మరల నొక నూతన సంయోగీకరణ మగును. ఇట్లీ విధానము నిర్వి రామముగను,, చర్వితచర్వణముగను కొనసాగుచు, ఒక సం యోగీక రణము కంటె, దాని తరువాతి సంయోగీకర ణము నిర్మల మైనదిగను, ఉన్నతమైనదిగను రూపొందును. తార్కిక చర్చలను ప్రతిబింబింపజేయు ' ఈ విధానమునకు మార్క్స్ 'గతితార్కిక ' మని పేరిడెను. క్రమమును క్రమపద్ధతిలో కొనసాగించినచో, తుట్టతుదకు, సచ్చిదానందమయ మగు సత్యమును గ్రహింపనగును. కాని మార్క్స్, ఎంగెల్సులు ఈ భావమును నిరాక రించిరి. మానవ మేధస్సును ప్రతిబింబించుచు, విభిన్నము లయిన భావనారీతులలో పరివర్తన నొందు ఆదర్శవంత మైన విశ్వము తప్ప, మార్క్, ఎంగెల్స్ ఇద్దరును ఎంగెల్స్-ఇద్దరును మరొక విషయము భావన చేయలేదు. ఈ విధాన

మార్క్స్, గతితార్కిక భౌతికవాద సూత్రమును చారిత్రక, సామాజిక గతుల యొక్క వివరణపరముగా అన్వయించెను. దీని ఫలితముగా, మార్క్సిస్టు తత్త్వశాస్త్ర మనునది పరిణామ మొందెను. ఎంగెల్స్ ఈ తత్త్వశాస్త్ర మును గూర్చి ఇట్లు వ్యాఖ్యానించెను. “మానవ జీవితా ధారములైన పదార్థముల ఉత్పత్తి, ఉత్పత్తియయిన పరార్థముల వినిమయము (exchange) మాత్ర మే సామా జిక నిర్మాణమునకు పునాది యగును. ఈ ప్రతిపాదనము నుండియే చరిత్ర యొక్క భౌతిక వాద భావన ప్రారంభ మగును. మానవచరిత్రలో గత సామాజిక వ్యవస్థలయందు ధనము పంపకము జరిగిన విధానము, సమాజము వర్గ ములుగా విభజింపబడిన తీరు- ఈ రెండును ఉత్పత్తి యైన పదార్థముల పైనను, ఉత్పత్తివిధానము మీదను, సరకులు వినిమయ మయ్యెడి క్రమముపై నను ఆధారపడి యుండెను. ఈ దృక్పథము ననుసరించి, సాంఘిక పరివర్త నములకును, రాజకీయ విప్లవములకును గల కారణములు మానవుల మనస్సులయందును, బాహిరములైన సత్యము లందును, న్యాయములందును గాక, ఉత్పత్తి, వినిమయ విధానములందు మాత్రమే కాననగును. అనగా, ఆ కారణ ములు త త్త్వశాస్త్రమందుగాక, ఆయా ప్రత్యేక సామా జిక వ్యవస్థల యొక్క ఆర్థికవిధానములందు మాత్రమే గోచరించును. ఈనాటి సాంఘిక సంస్థలు అక్రమమైన వనియు, అన్యాయమైనవనియు, న్యాయము అన్యాయ ముగను, ధర్మము అధర్మముగను పరిణమించిన స్థితి కల వనియును స్పష్టమగుచున్నది. ఉత్పత్తి, వినిమయ విధా నములలో పరివర్తనములు శాంతముగను, సౌమ్యముగను జరుగుటవలననే పైని పేర్కొన్న సత్యము ధ్రువపడు చున్నది. ప్రాచీన పరిస్థితులతో ముడివడిన సాంఘిక వ్యవస్థ ఆధునిక పరిస్థితులకు సరిపడదు. ఆకాలపు వ్యవస్థలయందు పొడసూపిన అసంబద్ధములే అనంతర కాలములో మారిన ఉత్ప త్తివిధానములందును మరొక రూపములో ప్రత్యక్ష మైనవని పై అంశములవలన తేటపడుచున్నది."

కారల్ మార్ ) ్క, ఎంగెల్స్ చే ప్రతిపాదింపబడిన సిద్ధాంతము యొక్క వివరణమునుబట్టి ముఖ్యమైన రెండు విషయములు ఉత్పన్న మగుచున్నవి. (1) సంఘర్షణము లచే సమాజములో పరివర్తనము లేర్పడును. ఈ సంఘ ర్షణములు ఏ మానవుని మనస్సునుండి బయలు దేరునవి కావు. అవి మానవుని వాంఛలయందుగాని, లేక భావముల యందుగాని పొడచూపవు. కాగా, ఆ సంఘర్షణములు ఉత్ప త్తి క్రమములందే ఉద్భవించును. ఈ ఉత్పత్తి విధానములందే సామాజిక పరివర్తన క్రమము గూడ గోచరమగును. (2) సాంస్కృతిక జీవితమునకు రూపము కల్పించు వివిధ విషయములు నైతిక, మత, న్యాయ, కళాత్మక సంస్థలన్నియు ప్రాథమిక ఆర్థిక నిర్మాణము యొక్క ఉపఫలములు (Bye-Products).

ఈ సిద్ధాంతమునే ఇంకను విపులీకరించినచో ఈ క్రింది అంశములు విదితములగును.

మానవులకు, పదార్థములకు ఎల్లపుడును పరస్పర సంబంధము కలదు ఈ సంబంధము కారణముగా మాన వులకు మానవులకు నడుమ అన్యోన్య సంబంధము లేర్పడుచున్నవి. దీని ఫలితముగా కార్మిక లోక ములో పని విభజనము (Division), శ్రామికులలో ప్రత్యేక నై పుణ్యము (Specialization of Labour), కార్మి కుల హక్కులు, వారిని పీడించుట (Exploit) కు తోడ్పడు చట్టములు, అ దేసమయములో శ్రామికులపీడను (Exploitation) నివారించుటకై కొన్ని ఉత్తరువులు తయారగును. ఇట్టి పరిణామములన్నియు మానవునకు మానవునకు నడుమ పరస్పర సంబంధములుగా మారును.

ఇట్టి సంబంధములు మానవ చరిత్ర మొదలై ననాటి నుండి నేటివరకు కొనసాగుచునే ఉన్నవి. వివిధ సామా జిక వ్యవస్థల చారిత్రక పరిణామ దశలలో శ్రామికుల పీడన విధానము పెక్కు రూపములు ధరించెను. బానిస సమాజము, ఫ్యూడల్ (జమీందారీ సమాజము, పెట్టు బడిదారీ సమాజము పరిణామము చెందిన దశ లన్నిటిలో ఒక వర్గము మరియొక వర్గమును పీడించినట్లు మనకు బోధ పడగలదు.

మానవుల పరస్పర సంబంధములలో కలుగు మార్పుల వలన, సాంకేతిక విధానములలో సంభవించు పరిణామ ముల వలన, శాస్త్ర పరిశోధనల వలన, నూతనావిష్కరణ ముల వలన మానవుని విజ్ఞానము, నైపుణ్యము అభివృద్ధి కాగలవు. వాని మూలమున ఉత్ప త్తిస్థానములను నిర్మించు నూతన మార్గములను అవలంబించుటకు అవకాశ మేర్పడు చున్నది. ఈ నూతన నిర్మాణములు, నూతన ఆర్థిక నిర్మాణ రూపములను నిర్ణయించును. ఈ నూతన ఆర్థిక నిర్మాణ ములు మరల సమాజమును ఒక దశ నుండి మరొకదశకు అభివృద్ధిపరచుటకు మార్గమును సుకరముచేయును.

సమాజము యొక్క ఏ అభివృద్ధి దశయందైనను, ఆ సమాజము యొక్క నైతిక, న్యాయజీవిత విధానము, దాని యొక్క మౌలిక ఆర్థిక నిర్మాణము ప్రతిబింబించును. ఉదాహరణమునకు బానిసదశ యందు ఆనాటి సమాజము నైతికముగను, న్యాయశాస్త్ర ప్రకారముగను బానిస వ్యవస్థనే సమర్థించెను. అందుచే రాజకీయ విధానములు, ప్రభుత్వ చట్టములు, మతము, కళలు, నైతిక నియమ ములు ఆయా కాలములనాటి ఆర్థిక నిర్మాణమును నిర్థరించును.

వివిధ సామాజిక వ్యవస్థల యొక్క గర్భాశయములం దే ఆ వ్యవస్థలు అంతరించెడి బీజములు ఇమిడియున్నవని మార్క్స్, ఎంగెల్స్ స్సలు సిద్ధాంతీ= రించిరి. ఈ కారణము వలననే సమాజము ఒకదశ నుండి వేరొకదశకు మారుచు అభివృద్ధినొందుచున్నది. ఈ మార్పులు శాంతముగను, నెమ్మదిగను, క్రమానుగతముగను కాక. వేగముగను, ఉగ్రముగను జరుగుచున్నవి. దీనికి కారణములు గలవు. ఆర్థిక నిర్మాణ ప్రాతిపదిక పై పెరిగి, పెంపొందు రాజ కీయ, న్యాయ, నైతిక సంస్థలు వాటికి అనువగు జీవిత విధానమును సృష్టించుకొనును. ఆర్థిక విధానము తల క్రిందై విచ్ఛిన్న మగుచున్నను, ఈ సంస్థలు జలగల వలె తమ స్థానములను అంటి పెట్టుకొని చిరకాలము బ్రతుకు టకు ప్రయత్నించును. ఇట్లే స్వప్రయోజనములను పరి రక్షించుకొనుటకై పాలకవర్గము (Governing Class) గూడ తన ప్రత్యేక హక్కులను (privileges) వద లక పట్టుకొని వ్రేలాడును. ఇట్టి పాలక వర్గము సంఘర్షణము, పోరాటము లేకయే తన అధికారమును పరిత్యజింపదు. శా స్త్రీయ పరిశోధనముల వలన, ఉత్పత్తి రంగములో, నూతనమైన సాంకేతిక ఆవిష్కరణముల వలన జరుగు పరివ ర్తనములు క్రమానుగతము లగుచుండగా, రాజకీయ జీవిత విధానములో జరుగు మార్పులు ఉద్రేకపూరితము లగుచున్నవి.

మార్క్స్, ఎం గెల్స్లు ప్రతిపాదించిన ఈ గతితార్ధిక సిద్ధాంతము కొందరిచే తీవ్రముగా విమర్శింపబడెను. వీటిలో వేదాంత శాస్త్రము నెడల భక్తి ప్రపత్తులు ప్రకటించని సిద్ధాంతము ప్రధానమైనది. పెక్కు సామాజిక సంఘ టనలను మనము చరిత్ర యని పిలిచెదము. ఈ చారిత్రక సంఘటనలను వ్యక్తీకరించుటలో వేదాంతమునకు కొంత స్థానము కలదు. మార్క్స్ ఈ విషయమును ఊహించెను. కాని తత్త్వమీమాంసకు వాస్తవ విషయములతో గల సంబంధము నిస్సారమైన వ్యాసంగమని అతని అభి ప్రాయము. సిద్ధాంతమునకును, దాని ఆచరణమునకును నడుమగల సమైక్యముయొక్క ఆవశ్యకమును గూర్చి మార్క్స్ నొక్కి చె ప్పెను. ఆలోచన (భావన) మానవుని కార్యవాదిగా చేయును. కార్యము లేనిదే ఆలోచన నిష్ప్రయోజన మగును. ఈ రెండింటికిని అవినాభావ సంబంధము కలదు. ఒకటి మరొకటి ఉండదు. ఈ కారణముచే, మార్క్ తన గతితార్కిక భౌతిక వాద సిద్ధాంతమును ఇతరములై న తాత్విక భావములతో మిళితము చేయలేదు. వేదాంత విషయములకును, వాస్త ఒక విషయములకును ఎట్టి సంబంధము లేదని గూడ ఆతడు వాదించెను. ప్రపంచమన నెట్టిదో తెలిసికొను టకై వేదాంతము సంప్రదాయముగ ఒక సాధనముగ మాత్రమే ఉపయోగపడుచున్నదని ఆత డెరుగును. కాగా, వా స్తవమును తెలిసికొనుట యనగా, విధిగా పరివర్తనము చేయుటగూడయని మార్క్స్ దానిని పరివర్తనము సిద్ధాంతము బోధించును.

మార్క్స్ సిద్ధాంతములకు వ్యతిరేకముగా మరికొన్ని విమర్శనములు బయలు దేరినవి. చారిత్రక పరిణామ దశలో విభిన్నాంశములు ఇమిడియున్నవి. మార్క్స్ నుడివినట్లు, ఆర్థిక కారణములచే బ్రహ్మాండమైన శక్తులు ఉద్భవమగునను విషయమును అంగీకరించినను, బెర్ట్రాండ్ రస్సెల్ చెప్పినట్లు, అవన్నియు ఒక్కొక్కప్పుడు దురదృష్ట కరములైన స్వల్పసంఘటనలమీద ఆధారపడియుండును. ఈ సంఘటనలే చారిత్రక సంఘటనలను నిర్ధరించును. ఒక సంఘటన జరుగుటకు పెక్కు పరిస్థితులు కారణభూతము లగును. మానవుడు అవన్నియు తెలిసికొనజాలడు. అందుచే ఆర్థిక కారణములు మాత్రమే బ్రహ్మాండమైన శక్తులను సృష్టింపగలవని చెప్పుట సరియైనది కాదు.

ఇదియేగాక, లిఖితపూర్వక మైన చారిత్ర కాంశము లకు ఒక్కొక్క సమయములో గతితార్కిక సిద్ధాంతము అన్వయమగునట్లు కన్పింపదు. పెట్టుబడిదారీ విధానము నకు కమ్యూనిస్టు విధానము ప్రత్యర్థియని గతితార్కిక వాదము ఒక వంక సిద్ధాంతీకరించుచునే, మరొక వంక పెట్టుబడిదారీ విధానములో గల సద్విషయములను కమ్యూనిస్టు విధానము తనలో ఇముడ్చుకొనగ లద ని వాదించును. కాగా, ఉదాహరణమునకు, అంతర్జాతీయ ఉద్రిక్తత యుద్ధమునకు త్రోవతీసి, నాగరికతయంతయు నశింపగా, ఆ తర్వాత కమ్యూనిజము కాక, అనాగరికత మాత్రమే విలయతాండవము చేయగలదుకదా ! అణు, ఉదజనిబాంబులు ఈనాడు కలిగింపగల వినాశమును మార్క్స్ తన కాలములో ఊహింపలేదు. అందుచే అతడు ప్రతిపాదించిన గతితార్కిక భౌతిక వాదము అన్ని విధముల అప్రామాణ్యమైనది.

శ్రీ. శ్రీ.