Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/క్రికెట్

వికీసోర్స్ నుండి

క్రి

క్రికెట్ :

ప్రప్రథమమున క్రికెట్ ఆట ఇంగ్లండులో గిల్ఫర్డ్ నగరమందలి ఫ్రీస్కూల్ విద్యాసంస్థలోని బాలుర చే 1550 వ సంవత్సరమున ప్రారంభింప బడినట్లు తెలియు చున్నది. 1666 వ సంవత్సర ప్రాంతమందే సెయింట్ ఆల్బన్స్వద్ద నొక క్రికెట్ క్లబ్ గూడ వెలసినట్లు చెప్పబడు చున్నది. మొట్టమొదటిసారిగా ఇంగ్లండ్ లో సస్సెక్స్ నగరమున 1697 లో క్రికెట్ పందెము జరిగినట్లును, ఒక్కొక్క పక్షమున పదునొకండుగురు ఆటగాండ్రు పాల్గొనినట్లును లిఖితపూర్వకమయిన ఆధారము కలదు. లండన్ నగరము ఈ యాటకు పుట్టినిల్లుగ ప్రసిద్ధి చెంది నది. ఇక్కడి ఆబగాండ్రు ఈ ఆటయందు విశేషమయిన ప్రతిభా నై పుణ్యములు ప్రదర్శించినట్లు తెలియుచున్నది. ప్రారంభదశయందు లండన్ సమీపముననున్న గ్రామ సీమలలో బాలురు క్రమబద్ధముకాని క్రికెట్ ఆటను చెట్ల కొమ్మలను క్రీడా పరికరములుగా నొనర్చుకొని అప్పు డప్పుడు ఆడుచువచ్చిరి. క్రమముగా ఈ యాట అభి వృద్ధియై సుశిక్షితమైనదిగా రూపొందినది.

17 వ శతాబ్దిలో క్రికెట్ ఆటను కొన్ని వర్గముల వారు చిన్న చూపుతో చూచిరి. ఆది వారములందును, చర్చి ఆవరణములందును ఈయాట ఆడిన వారిపై జరిమానాలు విధింపబడెను. 1656 సం. లో క్రాంవెల్ యొక్క అధి కారులు క్రికెటును నిషేధించిరి. కాని అనతి కాలములో ధనిక వర్గమునకును, కులీన వర్గమునకును చెందిన యువ కులు ఈ యాటయందు ఆసక్తి కలిగించుకొనిరి. అధిక ధనమును పణముగ పెట్టి వీరు క్రికెట్ పందెములాడు చుండిరి. ఈ పందెములు వేలకొలది ప్రేక్షకులను ఆకర్షిం చెడివి.

ఇంగ్లండు యువకులు తాము మెట్టిన నూతన ప్రదేశ ములకెల్ల క్రికెట్ ఆటను కొంపోయి దానిని అధిక ముగ ప్రచారములోనికి తెచ్చిరి. 1747 వ సంవత్సరములో జరిగిన క్రికెట్ పందెమున స్త్రీలజట్లు పాల్గొనినట్లు లిఖిత పూర్వకమయిన ఆధారము కలదు. 19 వ శతాబ్ధియం దంతటను ముఖ్యముగ ఉత్సాహముగల స్థానిక యువకులు ఈ ఆటలలో పాల్గొనుచుండిరి. 1890 లో ఒక్కొక్క జట్టునందు 11 మందిగల స్త్రీలు క్రీడా ప్రదర్శన పం దెము లలో పాల్గొనుచుండిరి. ఈ యాటయందు ప్రావీణ్యము గడించినవారు యువతులను తర్ఫీదు చేసెడివారు. ఈ శతాబ్ది మధ్యభాగము నాటికి ఆధునికమయిన క్రీడా కారిణు లగు క్రీడా స్త్రీ సంఘ మొకటి ఏర్పడినటుల తెలియుచున్నది. ఈ సంఘమునకు క్రమముగా 200 అనుబంధ సంఘము లేర్పడెను.

కనీసము 18 వ శతాబ్ది ప్రారంభము నుండియైనను నిర్ణీ తములయిన నియమములకు లోబడి క్రికెట్ ఆడబడు చుండెను. క్రికెట్ ఆట ప్రారంభమయిన తొలిదినములలో సాంప్రదాయికమయిన అలవాట్ల ననుసరించి మాత్రమే నియమములు, నిబంధనలు నిస్సందేహముగ అమలునం దుండెను. కాని 1744 వ సంవత్సరములో లిఖితపూర్వక మైన నిబంధనావళి రూపొందెను. 1788 వ సంవతర్సము నుండి లండన్ నగరమందలి 'మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్' సాధికారమయిన క్రికెట్ నిబంధనావళీ కేంద్రముగ ప్రపంచమంతట పరిగణింపబడెను. 20 వ శతాబ్ది మధ్య భాగమున జరిగిన క్రికెట్ ఆటలన్నియు 1947 వ సంవత్స రపుక్రికెట్ నియమావళి ననుసరించి యే నిర్వహింపబడెను. పై నుదాహరించిన మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్బు ఈనియమా వళిని ప్రకటించెను. ఈ నియమావళి పెక్కు వివరణ ములతో నిర్వచింపబడెను.

మొట్టమొదటిసారిగా భారతదేశమున క్రికెట్ ఆట ఏనగరమున ఎప్పుడు జరిగినదియు ఇదమిత్థముగా చెప్పుట కష్టసాధ్యము. అస లీ ఆట భారతదేశమునకు అపరిచిత మైనదియా, కాదా అని చెప్పుటకూడ కష్టమే. శతాబ్ద ములకు పూర్వము మొదటయిన క్రికెట్ ఆటను పోలిన దేశవాళీ ఆట యొకటి మనదేశమున ఆచరణములో నుండి నట్లు బలమయిన కొన్ని ఆధారములు చాటుచున్నవి. ఈ ఆట యొక్క పుట్టు పూర్వోత్తరములను గూర్చి చరిత్ర కారులు ఊహాగానము చేయుచునే యున్నారు. టర్కి స్తాన్ లో మారుమూలనున్న 'హుంజా' అను ప్రదేశమున, ప్రప్రథమమున పర్షియాలో ఉద్భవించిన 'పోలో' అను ప్రాచీనమైన ఒక ఆట ఇప్పటికిని వాడుకయందున్నది. గ్రీసుదేశములో లభ్యమయిన పురాతత్త్వ శిథిలముల ఆధారమున, ప్రాచీన కాలమందు హాకీ - క్రికెట్ మిశ్రిత మగు ఒక విచిత్రమైన ఆట ఆడబడుచుండెడిదని తెలియు చున్నది. ఆనాడు ప్రపంచము ఇంత అభివృద్ధికి రాక, ప్రాథమికదశయందే యుండెను. కర్రకు (Bat) బంతికి (Ball) సంబంధించిన ఇట్టి ఆటలను గ్రీసుదేశమునుండి అలెగ్జాండర్ తనవెంట భారత దేశమునకు కొని వచ్చి నటుల మన మూహింపవచ్చును. ఇందులు కాధారములు గూడ కొన్నిగలవు.

బ్రిటిష్ వారు భారతభూమి మీద అడుగిడిన వెంట నే, క్రికెట్ కూడ వారితో ఇచట ప్రవేశమొనర్చిరి. బ్రిటిష్ యువసైనికులు తాము ప్రవేశించిన ప్రతి దేశమునకు తమ క్రీడా పరికరములను తమవెంట తీసుకొని వెళ్ళుట వారికి పరిపాటియయ్యెను. ఏ చెట్లయినను క్రికెట్ ఆట మొట్టమొదటిసారిగా భారత దేశమున 1751 వ సం॥ననే ప్రారంభమయినది. గ్రేట్ బ్రిటన్ వెలుపలనున్న దేశము లన్నిటిలో కలకత్తాలో స్థాపింపబడిన క్రికెట్ క్లబ్ అత్యంత ప్రాచీనమైనదని తెలియుచున్నది. ఈ క్లబ్బు 1792 లో నెలకొల్పబడినది. కలకత్తా క్రికెట్ క్లబ్బు, బారక్ పూర్ క్లబ్బుల మధ్య నొక ఆటయు, కలకత్తా క్రికెట్ క్లబ్, డండం క్లబ్బుల మధ్య మరియొక ఆటయు జరిగినది. కలకత్తా క్రికెట్ క్లబ్బును టి. సి. లాంగ్ ఫీల్డ్ అను నాతడు అభి వృద్ధిపరచెను. ఈస్ట్ ఇండియా కంపెనీయందు పనిచేసిన ఉద్యోగులే ఈ క్లబ్బులయందును పాల్గొనెడివారు.

అయినను క్రికెట్ ఆటకు బొంబాయి నగరము పుట్టి నిల్ల ని విశిష్టమయిన ప్రఖ్యాతికలదు.. ఇందుకు కారణ ములు రెండు : ఈ ఆట బొంబాయినగరములో అత్యంత మైన ప్రజాదరణ గడించుట; మరి ఏ ఇతర నగరము నందునులేని ఉద్దండులయిన క్రికెట్ ఆటగాండ్రు ఈ నగర మందే వన్నె కెక్కియుండుట. క్రికెట్ ఆటను చేపట్టి, దానిని అభివృద్ధిపరచి ప్రథమస్థాన మాక్రమించుటలో ఇతర జాతులవారికం టే పార్శీజాతివారు అత్యంత గౌరవ స్థాన మలంక రించియున్నారు. వారు 'ఓరియంటల్ క్రికెట్ క్లబ్బు'ను 1848 లో మొట్టమొదటిసారిగా స్థాపించిరి. ఆ దినములలో క్రికెట్ 'ను 'బాట్బాల్' (Bat ball) ఆట యని సామాన్యులు పిలిచెడివారు. అటుపిమ్మట 1859లో 'జొరాష్ట్రియన్ క్రికెట్ క్లబ్బు' ఏర్పడెను.

1867 సం॥ ప్రాంతములో 'రౌండ్ ఆరమ్ బౌలింగ్' (Round arm bowling) అను సాంకేతిక విధానము క్రికెట్ ఆటలో అమలునందుండెను. ఇంగ్లండులోని 'సరే' (Surrey) నగరము నుండి రాబర్ట్ హెండర్సన్ అను నతడు బొంబాయికివచ్చి, పార్శీ క్రికెట్ ఆటగాండ్రకు శిక్షణ నిచ్చెను. క్రికెట్ అటగాండ్రు ఇప్పటికిని అతని నామమును స్మరించుచు, అతనియెడల కృతజ్ఞ తాభిమాన ములు వెలిబుచ్చుచుందురు. ఈ సంఘటనమువలన నే ప్రథమముగా పార్శీ ఆటగాండ్ర జట్టు 1888లో ఇంగ్లండు నకు ప్రయాణమై వెళ్ళుట సంభవించెను. ఇంగ్లండులో వీరు కొన్ని క్రికెట్ పం దెములలో గెల్చుటయు, కొన్నిటి యందోడుటయు, మరికొన్నిటియందు ప్రత్యర్థులతో సమ ఉజ్జీలగుటయు సంభవించినది. విక్టోరియా రాణి ఆహ్వా నముపై 'కంబర్ లాండ్ లాడ్జి' వద్ద 'క్రిస్టియన్ విక్టర్స్' అను పదునొకండు మందిగల ఆటజట్టుతో పం మాడు భాగ్యము వీరి కబ్బినది. రెండేండ్ల అనంతరము, ఈ పార్శీ జట్టువారు రెండవసారి ఇంగ్లండునందు సంచారము చేసి కొన్ని పందెములలో ఘనమైన విజయములు సాధించిరి. ఈ క్రికెట్ ఆటలయాత్రలను ఏర్పాటు చేయుటయందును, వీటిని నిర్వహించుటయందును ఎ. బి. పటేల్, బారియా, ప్రేమ పటేల్ ప్రభృతులు ప్రధానమయిన పాత్రము వహించిరి.

హిందూయువకులుగూడ ఈ యాటయందు అభి రుచిని, అభిని వేళమును సంపాదించి 1878 వ సం॥లో హిందూ క్రికెట్ క్లబ్బును స్థాపించుకొనిరి. అట్లే మహమ్మ దీయులు గూడ తమ క్లబ్బును 1893 సం॥లో ఏర్పరచు కొనిరి. తరువాత కొలది సంవత్సరములలో వేర్వేరు 'జింఖానాలు' (క్రీడాసంస్థలు) వెలసినవి. 20వ శతాబ్ది ప్రారంభమున క్రికెట్ ఆట చెన్నరాష్ట్రములో గణనీయ మైన ప్రజాదరము పొందెను. ఐరోపియనులు, పార్శీలు, హిందువులు అను త్రివర్గములమధ్య(Triangular Tour- naments) జరిగిన ఆట పందెములవలనను, అటుపిమ్మట వీరిని మహమ్మదీయుల జట్టు కలియగా అప్పుడు చతుర్వర్గ ములమధ్య జరిగిన ఆటల (Quadrangular Tournament)వలనను, క్రికెట్ ఆటకు ఇతోధికమయిన ప్రోత్సాహ మేర్పడెను. 'రెస్ట్' అను అయిదవజట్టు (Pehtangular) 1938 వ సంవత్సరమునుండి పై ఉదాహరించిన నాలుగు జట్టులతో కలసి ఆటలలో పాల్గొనెను. కాని ఈ టూర్న మెంటు సంస్థవారు 1944 వ సంవత్సరములో తమ కార్య కలాపములకు స్వస్తిచెప్పిరి. అయినను వీరు సాధింప దలచిన ప్రయోజనములను అప్పటికే సాధించిరి.

క్రికెట్ ఆట ఇంగ్లీషువారి వెనువెంటనే మన దేశమున ప్రవేశించుటచే, దక్షిణభారతమునకు తరలివచ్చిన ఇంగ్లీషు యువకులు 1848 సం. లో మద్రాసు క్రికెట్ క్లబ్బును స్థాపించిరి. మద్రాసునందలి 'ఐలెండ్ గ్రౌండ్స్'లో ప్రప్రథమముగ క్రికెట్ 'బాట్', 'బంతి'యు ప్రత్యక్ష మయ్యెను. 1865 వ సం. లో ఈ క్లబ్బు చేపాక్ ప్రాంత మునకు మార్చబడెను. 1864 వ సంవత్సరములో మద్రాసు క్రికెట్ క్లబ్బువారు మొట్టమొదటిసారిగా కలకత్తాజట్టుతో పం దెమున పాల్గొనిరి. స్థానిక ముగనున్న కొందరు భారత యువకులు ఈ ఆటచే ఆకర్షింపబడి అనతి కాలములో దీని యందు ప్రావీణ్యము సాధించిరి. యూరపియన్ - భారత జట్టుల నడుమ ఏటేటా క్రికెట్ పం దెములు జరుగునట్లుగ ఒడంబడిక జరిగి, 1908 సం. లో ప్రారంభోత్సవము గావింపబడెను. అర్ధశతాబ్ది కాలములో పటిష్ఠమైన కృషి జరిగినఫలిత ముగ, క్రికెట్ ఆటకు దక్షిణ భారత దేశములో సుస్థిరత్వ మేర్పడెను.

క్రికెట్ ఆట యొక్క అభివృద్ధి కేవలము కలకత్తా, బొంబాయి, మద్రాసువంటి నగరములవరకే పరిమితమై యుండక, మహారాజులయొకయు, నవాబుల యొక్కయు పోషణము మూలమున స్వదేశీయ సంస్థానములయందు గూడ వ్యాపించెను. ఇట్టి షోషకులలో పాటియాలా మహారాజు ప్రథములు. భారతీయ క్రికెట్ ఆటగాండ్రను తర్ఫీదు చేయించుటకై, ఇతడు ప్రఖ్యాతినందిన ఇంగ్లీషు ఆటగాండ్రను మనదేశమునకు తోడి తెచ్చెను. ఇట్లెందరో ఉత్సాహవంతులు ఈ ఆటను భారత దేశమున అభివృద్ధికి తెచ్చిరి. అయినను 'రంజి' అని పిలువబడెడి నవనగర్ 'జామాహెబ్' ఇంగ్లండునందలి క్రికెట్ క్రీడారంగ ములో ప్రదర్శించిన అపూర్వ నైపుణ్యమువలన ఈ యాటకు అఖండమయిన విశిష్టత, ప్రోత్సాహము చేకూరెను. కాకున్నచో, క్రికెట్ ఆట భారత దేశమున ఇంత గాఢముగ వ్రేళ్లూనియుం డెడిది కాదు.

1911 సం.లో పాటియాలా మహారాజు యొక్క నాయకత్వమున అఖిలభారత క్రికెటు జట్టు ఇంగ్లండు దేశ మంతట సంచారము గావించెను. ఈ జట్టులో పార్శీలు, హిందువులు, సిక్కులు, మహమ్మదీయులు పాల్గొనిరి. మొత్తముమీద భారతజట్టు జరిపిన సంచారము ఆశా భంగకరముగా పరిణమించినను, బాలూ, మిస్ట్రీ, కంగా, మెహరోంజీ అను ఆటగాండ్రు వ్యక్తిగతముగ ఇంగ్లీషు వారి మన్ననలనందుకొని క్రికెట్ ఆటలో మేటిమగలని పేర్గాంచిరి.

1889వ సం॥లో ఇంగ్లండునందలి జి. యఫ్. వర్నర్ జట్టు, పిమ్మట 1893 లో లార్డ్ హాక్స్ జట్టు, అనంతరము 1902 లో ఆక్స్ఫర్డ్ అథెంటిక్స్ జట్టు భారత దేశమును దర్శించిన ఫలితముగ, మన దేశములో క్రికెట్ ఆట చిరస్థాయిగా పాదుకొనెను. అయినను, 1926 సం. లో శ క్తిమంతమయిన 'జిల్లిగన్' నాయకత్వమున భారత దేశమునకు వచ్చిన యం. సి. సి. జట్టు వలననే ఇచ్చట నిర్మాణాత్మక మైన క్రికెట్ ఆట అభివృద్ధికి వచ్చెను. జిల్లి గన్ సూచనపై భారత దేశములో “క్రికెట్ కంట్రోలు బోర్డు" 1927 లో ఏర్పడెను.

1932 జూన్ 25వ తేదీ భారతదేశము యొక్క క్రికెట్ చరిత్రలో మహత్తరమయిన పర్వదినముగా పరిగణింప బడుచున్నది. ఆ దినమున ప్రప్రథమముగ భారతజట్టు ' టెస్ట్ పందెము'లో ఇంగ్లండును ఎదుర్కొనెను. మన జట్టుకు శ్రీ సి.కె. నాయడు నాయకత్వము వహించెను. ఇంగ్లండు జట్టును జార్డిన్ నడిపిం చెను. ఈ పందెములో మన జట్టు ఓటమి చెందినను, ఇట్టి పందెములలో పాల్గొనుటకు మన ఆటగాండ్రు అన్ని విధముల అర్హులని ఇంగ్లీషువారిచే ప్రశంసలనందుకొనిరి. ఈ టెస్ట్పం దెములో నిస్సార్, అమరసింగ్ లు జరిపిన 'బౌలింగ్' (Bowling), సి. కె. నాయడు ప్రదర్శించిన 'డాటింగ్' (Batting) ప్రతిభా విలసితములని పేరు కాంచెను.

ఆనాటినుండి భారతదేశము అంతర్జాతీయ క్రికెట్ రంగములో ఘనవిజయములు సాధింప నారంభించెను. మొట్టమొదటిసారిగా 1950-51 లో జరిగిన టెస్టం దె ములలో భారత దేశము ఇంగ్లండును ఓడించెను. ఇదిచాలా గొప్ప విజయముగా వర్ణింపబడి యున్నది.

పిమ్మట 1952 లో భారతజట్టు పాకిస్తాన్ మీదను, అనంతరము న్యూజి రెండుమీదను విజయములు గాంచెను. అటుపిమ్మట ‘వెస్టు ఇండీస్ ' జట్టుతో భారత దేశ మందును, వారి సుందర మయిన మాతృదేశమందును (కార్రిబియన్ దీవులు) మన జట్టు తలపడి క్రికెట్ పం దెము లాడెను. ఇట్లే 1947 లో గూడమనజట్టు ఆ స్ట్రేలియాకు ప్రయాణమై పోవుట సంభ వించెను. లో ఇట్లు భారత దేశపు జట్టు ఆదినుండి పెక్కురు క్రికెట్ ఆటగాండ్రు తమ పాత్రను ప్రశంసనీయముగ నిర్వహించిరి. వీరి కృషి లేని, భారత దేశములో క్రికెట్ ఆటకు ఇంతటి ఘనత చేకూరెడిది కాదు. వీరిలో పూర్వతరమునకు 'మిస్ట్రీ' చెందిన ఈ తరమునకు చిత్రము - 30 సంగ్రహ ఆంధ్ర చెందిన 'మం కాడ్ ' అను క్రికెట్ యోధులును, వీరి సహ చరులును, అనుచరులును గూడ అఖండ కీర్తి నార్జించిరి. చిత్రము - 29 మిస్ట్రీ ఎడమచేతితో అతి నైపుణ్యముతో 'బౌలింగ్ ' చేయగలిగిన ఆటగాడు. ఇతడు 1910-1920 సం. నడుమ తక్కిన యాటగాండ్రలో అందరికంటె అధికమైన కీర్తి ప్రతిష్ఠలనార్జించెను. మిస్ట్రీ సమకాలికుడైన 'బాలూ' కూడ ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేయు తన ఎడమచేతి 'బౌలింగ్' వలన తన సహచరులైన ఆట గాండ్రమీద మిస్ట్రీవ లె సమా నమయిన ప్రభావము కలుగ జేసెను. ఇదే కాలమున డా. కంగా, జయరామ్ మెహ రోంజీ ప్రభృతులు ప్రద ర్శించిన నైపుణ్యము, మి స్త్రీ, బాలూలు ప్రదర్శించిన నై పుణ్యమునకు తీసిపోవునది A తరువాతి E చిత్రము - 31 చిత్రము - 32 విజయనగరం మహారాజ కుమార్ తరమునకు చెందిన క్రి కెట్ ఆటగాండ్రలో మేజర్ సి. కె. నాయుడు సి. యస్. నాయుడు వెంకటగిరి కుమారరాజా 132 సి. కె. నాయడు ప్రముఖుడు. ఇతడు ప్రతిభావంతుడై న క్రికెట్ కెప్టెన్. బాటను చాకచక్యముగ ప్రయోగించి, బంతిని విసరికొట్టుటలో ఇతడు కడు గడుసరి. భారత క్రికెట్ ఆటగాండ్రలో ఇతడు అద్వితీయుడైన యోధుడు. దేవధర్, జయ్, రామ్, వజీరాలీ, నజీరాలి, నెవెలీ అను ఆటగాండ్రు క్రికెట్ యందలి అన్ని అంశ ములలో ను ఆరితేరిన దిట్టలు. వీరిలో నెవెలీ అను నతడు ఇంగ్లీషు ఆటగాండ్రను సహితము 'వికెట్ కీపింగ్' (Wicket- keeping) లో భయచకితులను చేసెను. ఇదేశరుణములో ఇంగ్లీషు క్రికెట్ చరిత్రలో దిలీప్ సింగ్, పట్వాడీ నవాబుల నామములు సువర్ణాక్షరములలో లిఖింపబడెను.

1930 నుండి 1946 సం, నడుమ విజయ్ మర్చంట్ అను ఆటగాడు బాటును ప్రయోగించుటలో ఇతరుల కంటె మిన్న యని పేరుగాంచెను. ఇతడి బాటింగ్ ప్రదర్శనమును వర్ణించుటకు ఒక గ్రంథము సరిపోవును. హజారే యను నతడు మర్చంటునకు కొలదిగ మాత్రమే తక్కువస్థాయిలో నుండెడి వాడు. అమరనాథ్ అను మరి యొక ఆటగాడు క్రికెట్ ఆటయందలి కళాకౌశలమును ప్రదర్శించుట యందును, ముస్తాఖ్ అలీ అను నతడు బాటును లాఘవముగ ప్రయోగించుటయందును ఆరి తేరినవారు. బౌలింగ్ చేయుటలో నిస్సార్, అమరనాథ్, అమరసింగ్ వ్యక్తిగతముగను, సమష్టిగను సమకాలిక ప్రపంచములో ఏ ఇతర బౌలర్లకును తీసిపోవువారు కారు.

'మంకాడ్ ' అను మరియొక ప్రసిద్ధికెక్కిన క్రికెట్ క్రీడాయోధుడు భారత దేశమునకు అఖండమైన కీర్తి నార్జించి పెట్టెను. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్, పాకిస్థాన్, న్యూజిలెండ్ దేశముల జట్టులతో ఆడిన అట లలో ఇతడు సర్వతోముఖమైన ప్రతిభను ప్రదర్శించి వేక్షకులను ఆశ్చర్యచకితులనుగా చేసి పై చెను. 'రోడ్స్' (Rhodes) దేశ పుజట్టును మినహాయించినచో, ఇతర జట్టు లతో ఆడిన క్రికెట్ టెస్ట్ పం దెములలో 2000 పై గా పరుగులు, 100 వికెట్లు సాధించిన మొనగాడు ఇత డొక్కడే.

భారత దేశము లో క్రికెట్ అభివృద్ధి చెందుటకు 1934 వ సంవత్సరములో 'రంజీట్రోఫీ ఛాంపియన్ షిప్ 'ను స్థాపించుట మరియొక కారణమైయున్నది. ఈ టూర్న మెంట్లో ఉమ్రిగర్, గుప్త, రాయ్, కృపాల్ సింగ్, కాంట్రాక్టర్, వంటివారు సుప్రసిద్దులయిన మేటి క్రికెట్ ఆటగాండ్రుగా సర్వత్ర గణుతికెక్కిరి. క్రికెట్ ఆట ఆర్జించుకొన్న సుసంప్రదాయములకు ఈ భారతీయ ఆటగాండ్రు అర్హతగల వారసులుగా ప్రశంసల నందుకొనిరి.

'గుంటూరు రిక్రియేషన్ క్లబ్' వారి దోహదముతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పడెను. ప్రసిద్ధికెక్కిన 'రంజీ ట్రోఫీ టోర్న మెంటు'లో పాల్గొనుటకై ఈ అసోసియేషన్ సమర్థు లైన క్రికెట్ ఆటగాండ్రను ఏటేటా ఎన్నుకొని పంపు చుండును. క్రికెట్ క్రీడారంగమున అద్వితీయమైన ప్రతిభ నార్జించి ప్రపంచ విఖ్యాతి గడించిన మేజర్ సి. కె. నాయుడును, చాల కాలము అఖిల భారత క్రికెట్ కంట్రోలు బోర్డుకు అధ్యక్షులుగా నుండిన విజయనగరం మహారాజ గుంటూరు నగరమునందు 1953 లో ఆం కుమారుడును, వెంకటగిరి కుమార రాజాయును, మరి యొక తెలుగు క్రికెట్ యోధుడైన సి. యస్. నాయు డును ఆంధ్ర క్రికెట్ అసోసియేషనుకు సర్వవిధములు సహాయపడి, దాని అభ్యున్నతికి ప్రధాన కారకులై 8.

క్రికెట్ నియమావళి :

1. క్రికెట్ పందెమున ఒక్కొక్క పక్షమందు పదు నొకండుగురు ఆటగాండ్రు పాల్గొందురు. ప్రతి పక్షము వారు తమ కెప్టెన్ నాయకత్వము క్రింద ఆడుదురు.

2. ఆట (Innings) ప్రారంభించుటకు పూర్వము, బాటింగ్ లేక ఫీల్డింగ్ ను ఎవరు ముందుగా ప్రారంభింప వలయునో కోరుకొనుటకు ఒక నాణెమును ఎగుర వేసి (Toss) నిర్ణయింతురు. దీనికి ముందుగా, ఆటను పర్య వేక్షించి న్యాయము నిర్ణయించు ఇద్దరు అధి కారులు (Umpires)నియమింపబడుదురు. నియమము ననుసరించి ఈ అధికారులు రెండు వికెట్లవద్ద స్థానముల నేర్పరచు కొని న్యాయము పాలింతురు.

3. చేసిన పరుగులను లెక్కించు లేఖకులు (Scorers) ఈ కార్యక్రమమునకై ప్రత్యేకముగ నియమింపబడు దురు. బంతిని కొట్టువాడు (Batsman) బంతిని కొట్టిన పిదపగాని లేక ఆటయందు అవకాశము చిక్కినప్పుడు గాని, (స్వపక్షీయులు) తన కెదురుగా తనను దాటుచు ఒక వికెట్ నుండి మరియొక వికెటునకు పరుగిడి దానిని చేరి నచో అట్టిదానిని ఒక పరుగు (Run) గా నిర్ణయింతురు.

4 బంతి కాని బంతి కొట్టువాని బాట్ కాని లేదా అతడేగాని 'స్టంపుల' మీదనుండు రెండు అడ్డుపుల్లలను (Bails) తొలగునట్లు చేసినను, లేదా స్టంపును భూమి పై పడునట్లుకొట్టినను, వికెట్ పడిపోయినట్లే నిర్ణయింపు బడును.

5. బంతిని కొట్టువాడు తన చేతియందలి బాట్, లేదా తన శరీరమందలి ఏ భాగముకాని 'పాపింగ్ క్రీజ్ (Poping Crease-నిర్ణీతపు హద్దు లోపల లేరున్నచో, అతడు తన స్థానమును తప్పినట్లుగా (Out of the ground) నిర్ణయింపబడును.

6. బాట్స్మన్ యొక్క చేతిలోని బాట్ ను గాని, లేదా అతనినేగాని తాకకుండ, బంతి వికెట్కు తగిలి, దానిని పడగొట్టినచో ఆ బాట్స్మన్ 'బౌల్డ్ అవుట్ ' (Bowled out) అయినట్లుగా నిర్ణయింతురు.

7. బాట్స్మన్ బంతిని కొట్టినపిదప (ఆ బంతి వాని బాట్ కు తగిలివచ్చినదైనను, లేదా, మణిబంధము లేక ముంజేతికి తగిలి వచ్చినదై నను) ఆ బంతి భూమికి తాకక పూర్వము, ప్రత్యర్థి చే పట్టుకొనబడినచో, ఆ కొట్టినయతడు 'పట్టుబడి అవుట్' (Caught out) అయినట్లు నిర్ణ యింతురు.

8. ఆటలో బాట్స్మన్ బంతిని కొట్టబోయి తన బాట్ తోగాని, లేదా తన శరీరమందలి ఏ అవయవముతో గాని, తన వికెట్ కొట్టుకొనినచో అతడు 'అవుట్' (Out) అయినట్లుగా నిర్ణయింపబడును.

9. బంతిని కొట్టువాడు, ప్రత్యర్థి బంతిని పట్టబోవు సమయమున వానికి ఉద్దేశపూర్వకముగా అడ్డుతగిలినచో, ఆ బంతిని కొట్టినయతడు 'అవుట్ 'అయినట్లునిర్ణయంతురు.

10. నిర్ణ యాధి కారి దృష్టిలో, బంతి కొట్టువాడు వికెట్ ను తనకాళ్లతో కప్పియుంచగా, బంతి వానికాలికి తగిలినచో అతడు 'లెగ్ బిఫోర్ ది వికెట్' (Leg before the Wicket) అయి, 'అవుటు' అయినట్లుగా నిర్ణయించ బడును. క్రికెట్ బం

11. బంతి : బంతి 54 నుండి 52 ఔన్సులవరకు బరువు కలిగియుండును. ఆట సమయమున బంతి పోయి నను, లేదా అది ఆడుటకు పనికిరాకపోయిన దయినను, నిర్ణయాధికారి క్రొత్తబంతిని ఉపయోగించుటకు అనుమ తించును.

12. బాట్ : క్రికెట్ బాట్ 44 అంగుళములకు మించని వెడల్పును, 38 అంగుళములకు మించని పొడవును కలిగి యుండును.

13. క్రికెట్ Jంగస్థలము (Pitch) : ఇది 5 అడుగుల వెడల్పున రెండు వికెట్లనడుమ ఏర్పరుపబడి యుండును.

14. సెకెట్లు : ఇవి ఒకదాని కొకటి ఎదు రెదురుగా 22 గజముల దూరమున పాతి యుంచబడును. ప్రతివి కెట్టు మూడు నిలువుపుల్లలు (Stumps) కలిగి, తొమ్మిది అంగుళ ముల వెడల్పున నుండును. ఆ నిలువు పుల్లలపై రెండు అడ్డు పుల్లలు (Bails) ఉండును. నిలువుపుల్లలు వాటినడునుండి బంతి దూరిపోకుండునంతటి దగ్గరగా పుష్టితో నుండును.

15. ఓవర్ (Over); బంతిని విసరు వాడు (Bowler) వరుసగా ఆరుపర్యాయములు బంతిని విసరినచో, అది 'ఓవర్ ' అనబడును. అట్లు రెండువికెట్ల నుండియు ఒక దాని పిదప మరియొక టి (Alternatively) చొప్పునవిసరుదురు. అట్లు ఆరుబంతులు విసరబడిన పిమ్మట, నిర్ణయాధి కారి 'ఓవర్' అని తన నిర్ణయము నిచ్చును.

16. తుది నిర్ణయము : ఉభయపక్షములలో, ఒకరిని మించి ఎక్కువ పరుగులు చేసిన రెండవపక్షమువారు గెలుపొందినట్లు తుది నిర్ణయము చేయబడును.

ప్ర, సి.