శుకసప్తతి/ఏఁబదిమూఁడవకథ

వికీసోర్స్ నుండి

చలపట్టి దురితావళులె వ్రాయుచిత్రగు
ప్తులలెక్క హంసపాదులు ఘటించి
మున్నుగా నమరించి యున్నదండనదాడి
యాతనసాధనం బవల ద్రోచి
దండనోత్సుకవృత్తి దరిజేసియున్నట్టి
పాశకోశము పటాపంచఁజేసి
గీ. నన్ను రక్షింప వచ్చి తెంతటిమహామ
హుండవొగాని యిది యేల నుర్విమీఁద
మిమ్మువంటి మహాత్ములు మెలఁగుటెల్ల
కూర్మి దీనుల రక్షించుకొఱకుగాదె? 164

క. అని చిలుక బలుకుచుండగ
నినుఁడు పూర్వాద్రిమీఁద నెక్కుట గనుచున్
జనియె ప్రభావతి నిద్రా
ఘనపరవశనిమీలితాక్షికైరవి యగుచున్. 165

గీ. చారుకేళీనిశాంతంబుఁ జేరి నాఁటి
రేయి రాజిల్కరౌతు గారించి రాజు
వలపుతో వచ్చు నాప్రభావతినిఁ జూచి
“తేమనోభీష్టమస్త”ని తేనెలొలుక
బలికె తక్కటికథ విన జిలుక యపుడు. 166

ఏఁబదిమూఁడవకథ

వ. అని యిట్లు గుణశాలి సన్నుతించి నీవెంట వత్తు ననిన. 167

చ. అనిన నతండు మేకొన కరాబ్జగృహీతతదీయపాణియై
జనభయకారిఘోరవనశైవలిని పురవక్కణంబులె

ల్లను గనుసించికొంచు నచలత్వరమించఁగఁబోయిపోయి నూ
తనతరహర్షగద్గదవిధంబున నాతనిఁ జూచి యిట్లనెన్. 163

క. చెంగట గంటివె దక్షిణ
గంగాద్వారము గిరీంద్రకన్యాసదయా
పాంగత్రిలోకము కాముక
శృంగారమధ్యమై బుధివింధ్యంబున్.(?) 169

మ. తనరన్ గంటిరె వృద్ధశైల మిదిగాదా! కంతువిద్విణ్ణికే
తనమౌ దక్షిణకాశి ముష్ణపురభూదారేశవాత్సల్యసం
జనితానందత నిచ్చటన్ శివుఁడు లాస్యప్రౌఢి గన్పించు నీ
తని సేవించకయున్న తన్నగరియాత్రాసిద్ధి లే దేరికిన్. 170

క. మీరు చతుశ్శృంగములప్ర
కారమున గయాప్రయాగకాశీగంగా
ద్వారము లచ్చట నొక్కొక
వారణమున వచ్చి నిల్చె వరవినయవిధీ. 171

మ. అని విన్పించి యతండు దాను వెస వృద్ధాప్రస్థలిం జేరి తె
ల్ప నశక్యంబగుసంతసంబు వొడయన్ పాతాళగంగానదిన్
దనువుల్ ద్రోచి తదగ్రగర్భగృహవాస్తవ్యున్ సురస్తవ్యుశ
ర్వుని సేవించి నుతించి వెల్వడి మనోరమ్యోక్తులై పోవుచున్. 172

క. ధీనిధి హరిశర్మ మహా
జ్ఞానున్ గుణశాలిఁ జూచి సరసం గంటే
యానందభవన మనియెడి
కానన మిది బరగు ఝల్లికావన మనఁగన్. 173

మ. సకలర్తుస్ఫుటమానసత్ఫలసమాజం బివ్వనం బక్కర
శ్మికిజోటీయమి మధ్యపక్కణజనశ్రేణుల్ తటాకోత్కరా

బ్జకులంబుల్ ముకుళించుటన్ విరియుటన్ జేయున్ ప్రక్రియా
నికరాదాయపరాయణంబులను వింటే! వరాణ్నందనా! 174

సీ. వనరాశి యని డాగవచ్చినమైనాక
ధరముకైవడి గజోత్కరము దసర
నతులసాలసమూహమగు టనంతర చర
తురగాళియై మృగస్తోమ మలర
పుండరీకాననంబుగదా యని వసించు
నంచలరీతి సింహములుఁ బొసఁగ
సత్పథత్వం బిచ్చి చలియించుకరిమ్రబ్బు
తుటుములగతి కిటిసటలు వెలయ
గీ. కదసి చెలఁగె లతాడోలికావిహారి
సౌరి బాలాంఘ్రినఖకాంతిచంద్రికాలి
కసితకాసారగంభీరగంధకలిత
పవననవనేయ మానందభవనచయము. 175

క. ఆనందభవనవని కెన
యానందనవనము నెన్న నర్హం బగునే?
కానం దలపఁగరాదని
కానందగు సకలఫలనికాయాస్పదమై. 176

క. ఈవల కృష్ణయు నావల
కావేరియుఁ గొలువఁ బలువగలఁ జెలఁగెడు నా
శైవలి నీవల్లభుక్రియ
నీవనతల్లజము గంటివే! విలసిల్లెన్. 177

క. అదె కంటివె శ్రీముష్ణము
నదెపో యక్కాంతి గోపురాగ్రనిరీక్షా
విదళితదూరాగతకో
విదజనసంసారఘోరవిధతృష్ణంబున్. 178

సీ. ఈవనంబుల వెట్టి యింద్రపట్టణసీమ
హవణించు నందనం బయ్యె నేమొ?
యీమేడలప్రమాణ మింతని పద్మజుం
డమరింప సురశైల మయ్యె నేమొ?
యీయంగజులవస్తు లేమైన గిలుబాడ
యక్షేశునకు నిధు లయ్యె నేమొ?
యీసరస్థితిఁ జూచి యెవ్వరో యీరీతి
నడరింప మానసం బయ్యె నేమొ?
గీ. యీపురముతోడ జోడుగా నెన్నిమారు
లైన గావింప వైకుంఠ మయ్యె నేమొ
నంతపయిలేక నిది సేర నబ్బుటెల్ల
మన మొనర్చినభాగ్యంబు మంత్రితనయ! 179

క. ఏతన్మాత్రమె విభవస
మాతత మిది దక్షిణప్రయాగ యనఁగ వి
ఖ్యాతం బీశ్రీముష్ణం
బీతరి సేవింపఁగలిగె నీశ్వరుకరుణన్. 180

మ. కనుఁగొంటిన్ ఘనమార్గలంబితచణాగ్రస్వర్ణకుంభంబుతో
వనము న్నర్కవిమాన మచ్చటఁ జుమీ వారాహదేహంబుఁ జెం

దిన నాతండ్రి ముకుందుఁ డాఢ్యుఁడు రమాదేవీసహా యుండు స

జ్జనులన్ బ్రోచుచునున్నవాఁడు కరుణాచాతుర్యధుర్యంబుగన్. 181

చ. కనఁబడురంగుబంగరుతగళ్ళధగధ్ధగితప్రభానిగుం
భనమున మించె బావనసమాజము జూచితె యచ్చటన్ వరా
హుని భజియింప సత్త్వదివిజోత్కరమున్ వసియింపఁ దన్నికే
తనమగు మేరుభూధర ముతానతదర్థము నిల్చెనోయనన్. 182

ఉ. అన్నియు నారయన్ బహుపురాగతతైర్థికసంకులంబులై
యున్నది వీథు లేమిగతమో? యిది మాఘముగాదె? రేపుగాఁ
బున్నమ నేఁడు సుమ్ము మనపోత్రిశరీరునకున్ రథోత్సవం
బెన్నగ నిప్డు పుష్కరణి కేఁగుట యుక్తము గాదె యిత్తరిన్. 183

క. అని పలికి యతని దోడ్కొని
చని యాతాయాతవివిధజనసమ్మర్దం
బునకున్ లోఁగుచు మదిఁ బ
ర్విన నివ్వెర నిత్యపుష్కరిణియున్ గనియెన్. 184

సీ. దూరాగతాత్మబంధువులు డాశిన వంశ
జేతలవావులు సెప్పువారు
నడయాడుచును భయం బడర నొండొరుకరం
బులు గట్టిగాఁబట్టి నిలుచువారు
చేపట్టు వదలుటఁ జెదరినతమవారిఁ
బేర్కొని బెట్టుగాఁ బిలుచువారు
నితరజనాహ్వాననుతికి తన్నామకు
లగుటనే నేమేమని యనెడువారు

గీ. స్నానతటగతజనపటాంచలవిగళిత
నీరసంకేశనికటవనీతలమునఁ
గడగి మునివేళ్ళ బట్టూఁది నడచువారు
గలిగి తన రారు నిత్యపుష్కరిణి గంటె! 185

సీ. పూర్వభాగమున నద్భుతలీల జాహ్నవీ
గోదావరీనదుల్ గొండ్లి సలుప
నగ్నికోణంబున యమునాసరస్వతీ
ఝురీణులు నిండుగాపురముఁ జేయ
దక్షిణంబున సముత్కంఠతో నర్మదా
సింధుస్రవంతులు సిరులు గాంచ
నిరుతిదిక్కున నిందితతామ్రపర్ణీక
వేరనదులు వేర్వేరఁ బొసగ
గీ. పశ్చిమంబున తుంగయు భద్రయును స
మీరునెడ కృష్ణవేణి కుబేరదిశమ
లాపహయు, భీమరథియు, హరాశ, రసయు
నెలమి భవనాశనియు నిల్వనిది సెలంగు. 186

చ. తటమహిజాతనూతనలతాగళితసవాశితోడి యు
త్కటమకరందబృందములు దాల్చిన యర్ధవికస్వరాంబురు
ట్పటలము పద్మతోయములు బర్వగఁ బుణ్యసరఃకదంబమే కడా
పట నరుదెంచి యిందు మునుగన్ వలకొన్నవిధంబు దెల్పెడున్. 187

సీ. ముసుకులతో వచ్చి మునిగెడు శుద్ధాంత
కాంతలకస్తూరికమ్మవలపు
బలుబరాబరులు బోల్పడవచ్చి గ్రుంకు భా
మినుల చొక్కపుఁదట్టుపునుగుతావి

గములుగా వచ్చి తానములాడు కర్ణాట
సతులపాటీరంపుసౌరభంబు
హితులతోడుగవచ్చి యీఁదెడి ద్రావెడ
పంక్తి మంజలికాపుపరిమళంబు
గీ. తగులుకొని మించుకరులగంధములచేత
తైర్థికావళి బడలికల్ తలగఁజేసి
తనశ్రమాపహనామంబు ధన్యతమము
గా మిటారించె నిత్యపుష్కరిణి వింటె! 188

గీ. కమలమకరందరసమధ్యకన్యకాపు
కారము వసించి నిత్యపుష్కరిణిజలము
నడుమ నందంబునొందె కుందనపుతగుడు
లంటి దాపిన నవరత్నమంటపంబు. 189

సీ. ఎవ్వరి నని దాల్తు నే నటంచు విహంగ
విభుఁడు చింతించి నావెనక కొదుగు
దొర యెవ్వఁడని బరాబరి సేయుదు నటంచు
సైన్యనాథుండు నిశ్చలతనొందు
నధిపుఁ డౌ సతండు రమ్మనిన జేరెదు నంచు
బలవైరి దవ్వుదవ్వులనె వచ్చు
నాయకనిర్దారణాశక్తి జాలమి
నెత్తమ్మిచూలి నోరెత్త వెఱచు
గీ. నెఱయు నీనిత్యపుష్కరిణీజలమ్ము
మునిగి గ్రక్కున లేచినజనులశంఖ
చక్రపీతాంబరాదిలక్షణవిరాజ
మానవిష్ణుసామాప్యు లైనకతన. 190

క. ఈనిత్యపుష్కరిణికిఁ గృ
శానుదెసంగంటె దిగ్గజప్రవరాశా
ధీనత్వశరణచణశా
ఖానీకనిబద్ధమైన యశ్వద్ధంబున్. 191

క. ఈరావిఁ జూడు సాక్షా
న్నారాయణమూర్తిసేవ నామాత్రశ్రీ
పారంపరప్రియదంబు వి
చారింపఁగ దీనిఁ బొగడ శక్యమె మనకున్. 192

క. అని దెల్పిన తదనంతర
మున నయ్యిరువురును నిత్యపుష్కరిణిన్ గ్రుం
కినవారై కోవెలకున్
జని గరుడస్తంభనికటజగతి న్నేఁగన్. 193

క. సాష్టాంగనతులు సేసి ప్ర
హృష్టులజయవిజయుల న్నిరీక్షించి నిజా
భీష్టము లొనగూడగఁ జని
యష్టపురాగర్భగృహధరాంతరగతులై. 194

సీ. సపవిత్రనందతిత్ప్రపారితోహ్యంభోజు
మహితపాదాబ్దు నమద్బిడౌజు
దండెకఖండనోద్యద్బూరినిశ్వాసు
కమనీయరుచిరసత్కనకవాసు
శారదచంద్రికాచారుకాంతిశరీరు
నిగమాంతకేళీవనవిహారు
విమలకటీతటీవిన్యస్తమృదుహస్తు
నతభక్తలోకావనప్రశస్తు

గీ. రుచిరవక్షోభిలక్ష్యసరోజగేహు
ధరణిసంభరణాసముద్ధరణదేహు
నవ్వరాహుని సేవించి యధికభక్తి
నతులవాచానిరూఢి సన్నుతు లొనర్చి. 195

శా. సుస్మేరంబగు నీముఖాంబురుహ మిట్లుం జూడగల్గెన్ మనో
భస్మారంబులుఁ జెందనీయక పురాపర్యాప్తపాపౌఘముల్
భస్మంబై చనఁజేసి భూరికరుణాపారీణతారూఢిమై
యస్మద్ఘోరభవంబు బాపు మిక సర్వాంగీణపాండుద్యుతుల్. 196

క. అని వినుతించి రథోత్సవ
మును గన్గొని తద్వ్రతం బమోఘాదృతి చే
సినవారై దమదేశము
జనుచో నిరువురు దినాంతసమయమునందున్. 197

గీ. అనుచు కీరంబుఁ దెల్పఁగా నంతలోన
ప్రాగ్ధరాధరశృంగంబుపై సరోజ
బంధుబింబంబు జూచి ప్రభావతీర
మణియు కేళీనిశాంతంబుఁ దనరఁజేరె. 198

ఉ. చేరి ప్రభావతీసుదతి చెల్వుగ నాటిదినాంతవేళ సిం
గారముమీఱ చారుకనకద్యుతు లంగమునందుగల్గ యొ
య్యారముతోడ రాజసము నారయఁబోయెడు నాప్రభావతీ
సారసగంధిఁ జూచి రసచాతురిమీర శుకం బ దిట్లనెన్. 199

గీ. భళిరె! శేబాసు! యోవైశ్యపంకజాక్షి!
యింత వేగిర మొంద నీ వేగుదెంచు
టే నెఱుంగుదు తక్కటియైనకథయు
వినవలెనటంచు వచ్చితి వింతె వినుము.200

వ. ఇవ్విధంబున నవ్విప్రవరులు మఱలి నిజపురంబున కరుగు దేరునంత సంధ్యాసమయంబున. 201

క. ఒకపల్లెఁ జేరఁ జని యం
తిక నటి తత్కాలవిధులు దీరిచి యెకశూ
ద్రకు నడువన్ శయనించిరి
శకకృతపురగమనమార్గజనితశ్రములై. 202

గీ. అప్పు డాయింట గేస్తురాలంగవిజితరంభ
రంభచతురిక యనుపేర ప్రబలుమగఁడు
తాను పొరుగూరి కరుగ నితరు బిలిచి
కొని మనోజాతసంక్రీడఁ బెనఁగుచుండ. 203

ఉ. అత్తరి వచ్చె తత్పతిధరామరు లిద్దఱు దీనికౌశలో
దాత్తతఁజూత మంచు సభయంబుగ నుండిరి లెస్స వింటివా
బిత్తరి యప్పు డాహిమగబింబముఖీమణి బొంకు టెట్లు నీ
యుత్తమచాతురీగుణసమున్నతి నెంచెద దెల్పుమా యనన్. 204

గీ. అన ప్రభావతి శుకకులాధ్యక్ష! యింత
గనగఁగల్గిన నేర్పరిగాను యేను
జాలు నులుకుట్టుమాటలజోలి యేల
నవలికథ దెల్పు మనిన నిట్లనియె చిలుక. 205

క. చతురిక పతి వచ్చుట గని
వెత గల్పించుకొని క్రూరవృశ్చికదష్టా
స్థితి మాన్పెడుమంత్రజ్ఞుని
గతి మంత్రింపుచు వసింపగా జేసి వెసన్. 206

క. ఇలు దెఱచివచ్చి నిలిచిన
చెలువునిపై వ్రాలి యేమి చెప్పుదు నీము

ద్దులమోము జూడఁగానక
పొలుబాపుచు నుంటి తేలు బుడుకుటకతనన్. 207

ఉ. నాయతిఘోరవేదననినాదములన్ దయవుట్టి వీథిలో
బోయెడునట్టి యీపరమపుణ్యుఁడు గ్రక్కున మంత్రశక్తిచే
నాయువు నిల్పె నీతని మహాద్భుతసద్గుణ మెంచగాఁ దరం
బే యిక నేల బిడ్డఁగని పేరిడఁగావలయున్ మనోహరా! 208

సీ. పడకఁ దెఱువరు లిద్దఱు బాపనయ్య
లదిగొ చావడి బవళించి నిదురలేక
యన్నియును చూచుచున్నవా రడిగి జూడు
యెన్నిపాటులు పడితినో యిటకు మునుపు. 209

మ. అనినం దత్పతి జారునిం బొగడి నాప్రాణంబు రక్షించి తం
చును పైపచ్చడ మిచ్చి వీడ్కొలిపె నచ్చోతద్వధూచాతురీ
జనితాశ్చర్యులు భూసురుల్ నిజనివాసప్రాప్తులై రంచు మె
త్తనివాక్యంబుల చిల్క బల్కునెడ ప్రాతర్వేళ గావచ్చినన్. 210

గీ. కోమటి మెఱుంగు సిబ్బెపుగుబ్బలాడి
యంతిపురమున కరిగి సాయంత నాప్తి
గాచి గైచేసికొని మహీకాంతుసంగ
మాభిలాషంబుతోఁ జేర నరుగదేర. 211

క. కనుగొని గుణసారుం డో
వనితా జనియెదవె ధరణీవల్లభుకడకున్
జను మిక నొకకథగల దది
విను మనుచుం బలుకఁదొడఁగె వేడుకబొడమన్. 212

శా. కావేరీతటిద్రావిడీనినదశంగాకాళికీకీచకీ
రావంబై యొకయగ్రహార మురువారం బందు నుద్యల్లస

ద్భావుల్ మిత్రుడు దేవదత్తుఁడును విద్యాశాలియాద్యుండనన్
గా విఖ్యాతి వహించి భూదివిజలోకశ్రేష్ఠులై నల్గుర
ర్ధావేళ స్పృహతం జరింతురుగకియ్యత్వంబు శూన్యంబుగాన్. 213

గీ. తద్ద్రవిణమెల్లగిలు బాడఁ దలఁచి ధూర్త
విప్రుఁ డొక్కండు వారల వెంటవెంటఁ
దిరిగి తన్మైత్రి వడసె విధేయనామ
ధేయుఁ డరివంచనాపరాత్మీయబుద్ధి. 214

ఉ. అంతట పాండ్యమండలమునందు ద్రువాఖ్య నెసంగు మేదినీ
శాంతుఁడు భూరిదాన మొసగన్ సమకట్టిన విన్నవారలై
సంతసమంది నల్గురు ద్విజన్ములు గూడి విధేయుతోడ న
త్యంతరయంబుమై నరిగి రాదొరయున్నపురంబు సేరఁగన్. 215

వ. ఇవ్విధంబునఁ జేరి. 216

సీ. మంత్రీంద్రులకు వేదమంత్రపూర్వాశీర్వ
భాసురోక్తుల నిమ్మపండ్ల నొసఁగి
యధికారిచెంత వేదాంతభాష్యాది
మాంసాదిసంవాదమహిమఁ జూపి
హితపురోహితు లున్నయిండ్లకుఁ బసపుపం
డ్లును గొనిపోయి బంధుతలు నెఱపి
వాకిట గొల్లల కేకతంబున ధర్మ
తత్త్వమార్గమును బోధన మొనర్చి
గీ. యుడిగములవారికెల్ల మే మున్నవార
మునుచు మంత్రాక్షతల నిచ్చి యనుసరించి
వారు సముఃఖంబు సేర్ప భూవరునిచేతఁ
గైకొనిరి నాల్గువేలరొక్కంబువారు. 217

గీ. ఇట్లు గైకొని తమయూరి కేఁగఁదలచి
త్రోవ సరిగొట్టి దొంగలు ద్రోచికొనుట
వింత మరిగొనిపోవ సువేళగామి
హితుఁ డనెడిపేర నొకబచ్చుయింటి కరిగి. 218

క. ఈయెనిమిదిజాలలధన
మీయెడ మీయింట నుండనిమ్ము పురంబున్
డాయగఁ జని నేగనుగొని
పోయెద మిటు వచ్చి యనుచుఁ బొసగించి వెసన్. 219

గీ. ఇప్పుడు వచ్చిన యేగురు నిందువచ్చి
యడుగునప్పుడు గాని యీయర్థ మొసఁగ
వలదనుచు రొక్క మాబచ్చువానిచేతి
కచ్చి వానిల్లు వెలువడి యవలి కరిగి. 220

గీ. తెఱువుబత్యంబుసకు లేక యరుగఁదరమె
యనుచు మిత్రాదులగునల్గు రాత్మఁదలఁచి
యలవిధేయుని బిలిచి నాల్గైదుమాడ
లడిగి తెమ్మని యడుగఁగా నతఁడు వోయి. 221

క. హితుఁ జేరి రొక్కమంతయు
నతిరయమునఁ దెమ్మటంచు ననిపిరి మావా
రతులితశూరసహాయులు
జతగూడిరి పయనమునకుఁ జనియెద మనినన్. 222

గీ. అతఁడు గేహంబు వెడలి యయ్యవనిసురుల
నందఱిని జూచి యిత్తున యనుచు నడిగి
వార లిమ్మని పలుక నివాసమునకు
నరిగి యాతనిచేతికి నర్థ మొసఁగె. 223

ఉ. ఇచ్చుటయున్ విధేయుఁడు సుదీప్సితముల్ ఫలియించె నంచు లో
హెచ్చినసంభ్రమం బురల నెప్పటినల్గురిగూడి కొంతద
వ్వచ్చెడురీతి వెంటఁజని యంతట వారల కన్మొఱంగి తా
నిచ్ఛకువచ్చుతావునకు నేఁగె మహాజవ ముప్పతిల్లగన్. 224

ఉ. అంతట వానిగాన కపు డంపిననాలుగువేలరొక్క మా
ద్యంతము దెచ్చెనో జరిగెనోయని మిత్రముఖుల్ దలంచి య
త్యంతరయంబునన్ మఱలి యాహితునింటికిఁ బోయి మాధనం
బంతయు నిమ్మటన్న విని యాతఁడు వారలఁ జూచి నవ్వుచున్. 225

సీ. అపుడు మీ రంపఁగా వచ్చినట్టియతని
చేతికే మీఱ లిమ్మని సెలవొసంగ
ధన మొసంగుట యెఱుఁగనిదారి బలుక
దగునె యీసుద్దు లెల్లవర్తకులతోడ. 226

గీ. అనిన వారు రొక్కమంతయుఁ దెమ్మని
యనుప లే దనంగ నతఁడు మీర
లిమనంగ విత్త మిచ్చితినొ లేదొ
యస్య పెద్దమాట లయ్యె నపుడు. 227

వ. తదీయవాక్యోపవాక్యంబు లాకర్ణించి యందంద సందడిగా మూఁగిన యాధార్మికులు గొంద ఱిఱుదెఱంగులవారి వారించి మహీసురోత్తములు విత్తంబంతయుఁ బోనాడుకొని పోదురె యనియును, హితుండు ఘంటికామంత్రంబు తనయింట నునుచికొనుట కాని లాభంబుగానని వాఁ డర్థంబంతయు నిచ్చునే యనియుం దలపోసి చెడినసొమ్ము చెరిసగంబుగా వగదెంచి యాబచ్చువానిం బిలిచి వీరు నీయధీనంబు బెట్టినధనంబునం దొక్కపా లిమ్మనిన సమ్మతించక యతండు నలువురిం దోడ్కొని పాండ్యమహీమండలాఖండలు సముఖంబునకు నరిగె. యో ప్రభావతీ! యవ్వసుమతీపతి యేగతి తదీయవివాదం బుడుపవలయు నిది యెఱుంగకున్న ననన్యసామాన్యుండగు రాజన్యమూర్ధన్యుపాలికింబోవ నూహింతువే తెలుపు మని పలికిన యంకురితమనఃస్సంకోచన యగునప్పంకజాక్షి నీరీక్షించి యప్పక్షికులాధ్యక్షుం డిట్లనియె. 228

క. మగువా! తిర్యక్కులజుం
డగుట న్నుతిలేక మించనాడితి నేరం
బగు సైరించుట భవదీ
యగుణంబుగదా శమించి యవ్వలవినుమా! 229

క. ఆపాండ్యనృపతి విప్రా
లాపంబులు హితునిమాటలున్ విని నరుగన్
ప్రాపితముఖుఁడై కరుణా
శ్రీపటిమన్ బచ్చువాని చేరన్ బిలిచెన్. 230

క. పిలిచి చెవులోన నేమో
పలికిన నతం డలరుమొగము భాసిల్లగ రా
జులదేవ యనుచు ధరణీ
తలనాయకుఁ బొగడి జనితదరహాసమునన్. 231

గీ. బ్రాహ్మణులఁ బిలచి నాయింటఁ బదిలపరచి
యున్నయది విత్తమెల్ల నాయొద్ద ననుచు
నపుడు మీచిన్నగతి నేఁగు రరుగుదెంచి
యడుగుఁ డిచ్చెద మాఱుమాటాడవలదు. 232

క. అన వారు మొగమొగంబులు
కనుగొనుచు న్నిలువ ధరణికాంతుఁడు కరుణా

వననిధిగాఁ గాపునవారల
ననిచెన్ బహుధన మొసంగి యంభోజముఖీ. 233

క. ఆరాజవరునకుఁ గల
నేరుపు నీకబ్బెనేని నృపలోకమణిన్
జేరుమని చిలుక యనునెడ
వారిజహితుఁ డెక్కి పూర్వవసుధాధరమున్. 234

క. అపుడు ప్రభావతి తనయం
తిపురమునకు నరిగి తమ్మితెగ నెవ్వగలన్
తపియించువేళ వచ్చిన
నపరిమితానందమానసాంభోరుహయై. 235

శా. పన్నీటం జలకంబులాడి తొగలుం బాలాభిరేఖావళీ
చిన్నెల్ వ్రాసినచీర గట్టి యపరంజింజిమ్ము నెమ్మేనిపై
మిన్నుల్ గ్రమ్మెడి సొమ్ము దాల్చి మహిభృన్మీనాంకజన్యక్రియా
సన్నద్ధత్వము నొంది యందము రహించన్ జార నే తెంచినన్. 236

చ. కనుగొని పచ్చరెక్కపసగల్గినఫుల్గులరాయఁ డో కన
త్కనకఛటాఛటాచకచకత్తనువల్లిక నేఁడు దెల్ప నీ
యనుమతిమీఁదగాని కథయంచు దలంకుచు విన్నవింతునా
యని తదుదారకౌతుకకటాక్షనిరీక్షలు గాంచి యిట్లనున్. 237

ఉ. అంగవసుంధరాభరణమై యొకపట్టణ మంద మొందు మా
తంగతురంగసద్భటకదంబశతాంగతతుల్ సెలంగఁగా
మాంగళికాభిధాన మసమానముగా వహియించి యప్పురం
బంగదనామధేయ వసుధాధిపుఁ డేలును తేలుసంపదన్. 238

ఉ. ఆనరపాలమౌళికి వరాంగముకైవడి నొక్కమంత్రి మే
థానిధినాముఁడై తగునతఁడు నిజాంగనజాయమానశో

భానుతశాంతపేరి యొకబాలికె గాంచి దివంబు సెంద సం
తానము గోరి లోలయనుత న్వివరించి రమించె నంతటన్. 239

ఉ. ఆలలితాంగికంటికి ప్రియంబగుసొమ్ము ధరించి సేవక
శ్రీల మఱంగి జిహ్వకు రుచించుపదార్థము లాహరింప నే
వేళ ప్రసూనతల్పమున వేడుకమై బవళింపుగల్గుటన్
చాల మదించి జారజనసంగతికై తివురుబ్బిగల్వగాన్. 240

సీ. రేయిదాల్చినవిరుల్ వ్రేలుగొప్పున జాఱ
నగుమోము జిగిమించ నదికి నరుగు
పుక్కిటివీడె మబ్బురపునీటు ఘటింప
కులుకు నెన్నడలతో గుడికి నరుగు
పయ్యెద వీడ గుబ్బలనిగ్గు గనుపట్ట
నెమ్మితోఁ జుట్టము లిండ్ల కరుగు
పావడపై వ్రాఁతపని జీర రాణింప
కొమరుతో వనభోజనముల కరుగు
గీ. నరుగుచో మంచిమగవాఁ డెదురనుపడగ
వనిత తగవాని నటు బిగాబగలఁజూచు
సోగకడకంటి నెఱవాఁడి సొలపుఁదళుకు
బెళుకుచూపుల నయ్యిందుబింబవదన. 241

గీ. ఇంట నేతెంచుచుట్టంపు టెమ్మకాండ్ర
తరచుగాఁ బిల్చితేర ద్రస్తరులు బలికి
తన్మనంబుల రాగకందళము లునిచి
యతిభయాతతమున వాఁడ నడలుపడతి. 242

సీ. దూతికపట్ల నెంతోమైత్రి పాటించి
దానికి మన సిచ్చి తగులు నెఱపి

సఖియెడాటమున నిచ్చకముగా వర్తించి
ధాత్రియుఁగూడి మంతనములాడి
ప్రాతివేశిని దనప్రాణంబుగాఁ జూచి
లెంకలతోడ మాలిమి యొనర్చి
శిల్పినీరుదికి మచ్చికబుట్ట నడపించి
తనకు దాసాహాయ్యమును భజించి
గీ. యత్తికామాతులసుతాదు లైనబంధు
గంధసింధురగమనల గారవించి
యేయుపాయంబులను గోర్కె యెనయనేని
తన మహాంతఃపురాధివాసనకుఁ గనలు. 243

సీ. తనివిదీఱఁగ నందతనయుతో రతికేళిఁ
బెనఁగిన గొల్లగుచ్చెతలమనువు
చంద్రునంతటి నిండుజాణ కౌఁగిటఁ జొక్కి
తమిఁగడఁదేర్చిన తారబ్రతుకు
నేమగమిని యైనదేవేంద్రు నన్యునిగూడి
కాంక్షఁజెందు నహల్యకాపురంబు
శివుగూడి తనివిఁగాంచినయట్టి దారుకా
వనమౌనికాంతలవర్తనంబు
గీ. మెచ్చుగాక మఱేమి యీమేనియందు
యనుభవించనిసౌఖ్య మే లనుచు వనిత
యింటిలోనుండి చావడి నెవ్వరైన
సరసరీతిప్రబంధముల్ చదివిరేని. 244

ఉ. ఏవురతోడఁగూడి రమియించగ భాగ్యముఁ జేసెఁ గావునన్
ద్రౌపది మెచ్చవచ్చునని తొయ్యలి సంతసమందునంతలో

నావిభుఁ డామృగాక్షికి నిజాధిపుతోడ సుఖంబుగల్గ ది
చ్ఛావిధిఁ జేయు జారజనసంగతిగాకని యెంచు నిచ్చలున్. 245

గీ. ఇవ్విధంబున నప్పూర్ణిమేందువదన
యన్యసంభోగసుఖలేశ మబ్బెనేని
యాకసంబైన బేధించి యవలబోవు
నంతకుఁ దెగించియున్న యయ్యవసరమున. 246

క. వారింటిదేవపూజా
కారిత్వము బూని వేదఖనియై వినుతా
చారుండై సుగుణనిధీ
చారణుఁడన నొక్కబ్రహ్మచారి చెలంగున్. 247

గీ. గున్నయేనుంగు మదరేఖగూడినట్లు
తావియామని కెనసి దారి ధవళ
శరుఁడు పదియాఱుకళలతోఁ గదియుకరణి
వాఁడు నానాట నిండుజవ్వనముఁ గాంచె. 248

గీ. అపుడు జారగవేషణాయత్తమైన
లోలహృదయంబు వానియుద్వేలకాంతి
కవయవో లక్ష్యదేహంబు గాంచి నిలిచి
త్రిమ్మటలు బట్టు బడలికల్ దీర్చుకొనియె. 249

సీ. మునుపటివలె నుండజనదుగా యికనొక్క
చెలి బెండ్లియాడంగవలదె యనుచు
నితని కిత్తరి బెండ్లి యేటికి యింకభో
గముచెల్వ లున్నారుగద యటంచు
పఱచులేవారిచిత్తరముభావించి చూ
డగ క్రొత్తకోడెకాఁ డౌట యనుచు

వెఱవనేటికి నట్టివిద్యలచవియెఱుం
గఁడుగాని చొరబారగలఁడటంచు
గీ. నొంటిపాటునఁ బలికి యాయువిదయమ్మ
చెల్ల యీమాట లెవ్వరిచెవులఁ బడెనొ
యనుచు నాలుగుదిక్కులు నరిసిఁ జేరి
వాని నెమ్మది నొకవింతవలపు నెఱపు. 250

క. ఈరీతి నవ్వధూమణి
చారణు లోఁబఱచి యొకనిశావేళ తమః
పూరితమగు నొకయింటన్
చేరిచికొని యిష్టకార్యసిద్ధింగొనియెన్. 251

క. కని యదిమొదలుగఁ ద
త్యనుపమసౌఖ్యాబ్ధి నోలలాడుచు మరునిం
దనబంటుగాఁ దలంపుచు
ఘనతరగర్భమున కన్నుఁగానక మెలఁగెన్. 252

క. అంతట బాలామణియగు
శాంతం బోషింప మఱచి చారణనిమగ్న
స్వాంతత్వము జెందిన త
త్కాంతామణినడక లెల్ల గాంచిన యదియై. 253

గీ. శాంతయును బాలయయ్యునుఁ జతుర యగుట
దీనికి భయంబుఁ జూపినగాని తనకుఁ
బోషణము చేయదిది యని బుద్ధిఁ దలఁచి
యోర్చికొనియుండి యంతట నొక్కనాఁడు. 254

చ. జనకునిఁ జేరి యాతనికి సంతసమయ్యెడుమాటలాడి, సొం
పెనయగ నీవుగాక మరి యింకొకతండ్రి గలఁడు నాకుఁ బొ

మ్మని పలుక న్వినిశ్చలతరాద్భుతుఁడై మదిఁ జెందు సందియం
బునఁ దలపోసి యాసచివపుంగవు డెంతయు నాదరింపుచున్. 255

గీ. ఇంక నొకతండ్రిగల దంటి విందువదన
యతనిఁ జూపెదవే యన్న నవ్వధూటి
మంచి దీరేయి జూపెద నంచు బలికి
యవలి కరిగిన యమాట లాలకించి. 256

క. ఆలోలాంగన తనదగు
శీలం బిది యెఱిఁగి పలికిఁ జెప్పగఁ బూనెన్
బోలు నని తలచి మిక్కిలి
జాలింబడి కొంతఁ బిలిచి సత్ప్రియరీతిన్. 257

గీ. అనునయించిన నబ్బాల యైననేమి
నన్ను బోషించెదేని యంతయును మఱపుఁ
దాల్తునని పల్కె నింక నత్తరుణి జనక
భావసంశయ మెట్లు బాపంగవలయు. 258

క. అనిపలికి యూరకుండిన
కనుఁగొని యౌరవ్యజలజగంధయు ఘనచిం
తొనరించి తెలియఁజాలక
వినుపింపు మటన్న కీరవిభుఁ డిట్లనియెన్. 259

వ. అంత నిశీధినీసమయం బగుటయు, నమ్మేథానిధివిభావధీరత తమఃపుంజంబగు కేళిమందిరంబున లోలాసమేతుండై యుండి యబ్బాలికం బిలచి ద్వితీయజనకుం జూపుమనిన నాశాంత యత్యంతమౌగ్థ్యంబు దాల్చి తదీయచ్ఛాయ జూపిన నతండు నవ్విలోలం జూచి యేతద్బాలికాలాపంబులకు నీయందు సందియంబుఁ జెందితినని తద్వృత్తాంతం బంతయుం దెలిపి పతివ్రతాశిరోమణియగు నీ కిట్టిగుణంబులు పుట్టునే యని బహూకరించెం గావున నయ్యమాత్యకుమారికకుం గలయగణ్యనైపుణంబు గలిగినంగాని ధరణిభుజంగుని సంగతికిం జనగూడునే యనునంతలో నరుణోదయంబైన ప్రభావతీలలితాంగి శుద్ధాంతంబున కరిగి క్రమంబున దినావసానం బగుటయు. 260

చ. జలకములాడి జీని బురుసాజిగిచీరె ధరించి గుబ్బలన్
గలప మలంది కన్నుగవ కాటుకరేఖ యమర్చి కస్తురిన్
తిలకము దీర్చి భూషలును దేహమునందు నలంకరింపుచున్
కలవలరాజుఁబోలు నరనాథుని జేరగ నేఁగు నత్తరిన్. 261

క. చని నాఁటిరేయి నరపతి
నెనయన్ దద్గేహసీమ నేఁగెడుదానిన్
కనుగొని యనియెన్ గీరం
బును దనపల్కులను నమృతముఁ గులుకంగన్. 262

ముప్పదితొమ్మిదవకథ

క. కలహవిజృంభణబాహా
బలనిర్జితశత్రురాజబలుఁ డతిలోకో
జ్జ్వలచిత్రసేనుఁ డప్పురి
చెలువొందగ నేలు చిత్రసేనుం డనఁగన్. 263

గీ. అతఁడు నాతనిదేవేరి నతులదివ్య
లక్షణాకృతి సయ్యాదిలక్ష్మిఁ బోలి
వెలయు సుబలాంగనయు సముద్వేలలీల
నేకకంఠత నిద్ధాత్రి యేలుటయును. 264