శతావధానసారము/నెల్లూరు

వికీసోర్స్ నుండి

విజయసంవత్సర పుష్యమాసములో నెల్లూరులో జగిన యష్టావధానము లలోని కొన్ని పద్యములు.

సీసము – ప్రకృతసభ,

చెప్పినతో డ నే తప్పు లేక లిఖించుపండితు లొక వంకఁ బరిడవిల్ల! విధివిరా మము లేక. నేవేగ గంటలఁగొట్టు వారో క్క డ గుల్కుచుండ! సాటినీయ మునందు బహురమ్యముగ మాటలాడువా - రొక్కెడ నలరు చుండ! సరసమౌ రీతినిఁ జదరంగ మాడెడి బుద్ధిమంతులు నొక్క- పొంతదనర;

............................................................................................

ప్రకటన.

అయ్యలారా ! నెల్లూరు హిందూమహా జన సంఘము వారి వలన విజయసంవ్సర॥ పుష్య శు 15 ఆదిత్య నాసరమున పగలు మూడుయామములు మొదలు సాయంతనము దనుక నొకవిద్వత్సభ జరిగించఁబడెను.

అందు గోదావరీ మండలము నుండి విచ్చేసిన యిరువుకు బాలసరస్వతులు నాద గిన పిన్న వయసులో నుండి శ్రీ కింకవీంద్ర ఘటాపంచానన విద్వత్కవి బాలకలానిదులను బిరుదువడసిన బ్రహ్మశ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రులవారిచేతను చెళ్లపిళ్ల వేంకటేశ్వర శాస్త్రులవారిచేతను అష్టావధానము అతివిచిత్రముగఁ జేయింపఁబడెను. అందుఁ జేయఁ బడిన యపథానము లీక్రిందఁ బొందు పఱచ బడుచున్నది,

తేటగీ! నంబరపురాణకథయు వ్యస్తాక్షరి యును
లౌకికోక్తులు ఒక్కతలమునఁ జెలఁగఁ
దిరుపతియు వేంక టేశుండు సగ సరీతిఁ
జేసి రష్టావధానంబు జెడ్జి చూడ . శ్రీ శ్రీ శ్రీ ... 1

శ్రీ శ్రీ శ్రీ

ఈ పట్టణమందే జిల్లా రిజస్టార్ గుండు వాసు దేవశాస్త్రు లుగారు చేయించిన సభలోనికొన్ని పద్యములు.

(అర్జునుఁడు సుభద్రకరము పట్టుకొనుట. )

సీ కాషాయవస్త్రము గని పాఱిపోకుము నీకై నవేష మోనీరజాక్షి!
పెద్దగడ్డము చూచి బెదరిపోయెదవేల? నీకై న వేష మోనీరజాక్షి
రుద్రాక్షు పూసలు ఱొమొత్తునని పోకు నీకై న వేష మోనీరజూక్షి,
వెలిబూదె యంటునం చులికిపడెద వేల? నీకై నవేష మోనీరజాక్షి .
తే॥॥ యనుచుఁ దనకు మర్జునుఁడదిమి పట్ట
బెద్ద 'లేముందురో! యనుభీతిఁ జేసిఁ
వదలి పో లేక పో లేక వదలి పోవు
చున్న యటు లీ సుభద్ర తా నున్న దహహా1

...........................................................................................................

1. తొమ్మిది మందికి వారువారు కోరుకొనిన వర్ణనలు. వారు వారు కోరుకొనిన శ్లోక పద్యములలో వారు ఏర్పఱచిన నియమముల తోడను తెలుగు సంస్కృతంబునే వారు నిషేధించిన యక్షరములు రాకుండ నవలీలగ నొక్కొక్కయ క్షరమే చెప్పుమనిన వారికీ నొక్కొక్క నక్షరమువంతునను మూడేసి యక్షరములు గోరిన వారికి నట్లేయు ను నొక్కొక్క చరణము చొప్పునఁ గోరిన వారికి నట్లేయును మొదటి చరణము చెప్పు చుండ నంతట నిలిపి, రెండవ మూడవ చరణములలో నొక్కొక్క పదము నడిగిన ను " చెప్పుచును సందులో నడిగిన వారిచ్చిన 'నేదియో మూడక్షరముల పదమునుగూడ గల్పి "చెప్పుడనిన నట్లేయును నొనర్చుచుఁ గవిత్వము చెప్పబడినది.

2. సభికులలో నొకరు ఏదియో యొక జర్మనీ దేశ చారిత్రములోని యొక్క యితిహాసమును జదివి వినిపించిన నద్దానిని మనమందిడికొని తిరుపతి శాస్త్రుల వారు సంస్కృతమున శ్లోక రూపముగ నొక్క పురాణముగా విరచించి రాగయుక్తముగ విని పింపుచుండ వేంకటేశ్వర శాస్త్రులవారిచే నది శ్రావ్యమ్ముగ దానికంతయు రాగయు క్తంబుగ నే యర్థమ్ము పక్కాణింపుచు నా కాశపురాణము చెప్పఁబడెను,

తెలుఁగు, ఆరవము, ఇంగ్లీషు, మొదలగు 'నా నాభాషలలోని పదములు ఇరువది క్రమముతిప్పించి యొక్కొక్క పదమును. దానికి పరుసలో నివ్వబడిన సంఖ్య


(రిజస్ట్రాగుగా రిచ్చినయుంగరము పోవుట.)

(ఈపద్యము వెంకటగిరీ నుండి పంపఁబడ్డది.)

ఉ॥ నల్లని వ్రేల నుండఁ దగునా! యని యో వెలి బూ దేకవ్వకుం.
దల్లడమందియో మఱియెదన్ భయ మే మిఁక దాపరించెనో
వెళ్లిడినాఁటి ! ప్రొద్దుటను వీథినిఁ గాలువ కేగువేళఁ దా
మెల్లగజాఱె నుంగరము మీ కిది చెప్పఁగ లేక వ్రాసితి?2

సీసము — జెడ్డీ గారి విందును గూర్చి

,
ఏనాఁడు జెడ్జీ ల తో నేక పంక్తి గా భోజనములు సేయ బుధుల కబ్బె
నేనాఁడు జెడ్జీలతో నున్న తస్తలిఁ గూర్చుండఁ బండిత కోటి కబ్బె
నేనాఁడు జెడ్జీ లతో నేక తంబున మాటలాడగఁ గవిమణుల కబ్బె
నేనాఁడు జెడ్జీల చే సీయఁబడు పుష్పమాలికల్ కవి శిఖామణుల కబ్బె'

...................................................................................................................

సహితముగ నొక్క కాగితపు ముక్క మీదవ్రాసి మధ్యమధ్య నిచ్చుచుండ నవియన్ని యు వరుసగా మనస్సునన తుర్చికొని యవధానాంతమందుఁ దప్పకుండ, ప్రతిపదమును వినిపించుటయ నెడు వ్యస్తాక్షరియును జేయఁబడెను.

4. ఆ నేక మారులుగ వేఱు వేఱు సంఖ్య లుగ కనుజాటుగఁ గొట్టఁబడిన గం టల మొత్తము తప్పకుండ నెను బదియొక్కటియని చెప్పఁబడియె.

5. వ్యాకరణశాస్త్రములో నొక పండితునితో శాస్త్ర సమ్మతముగ, బండిత జ నాను మోదమ్ముగఁ బ్రసంగంబు చేయుఁబడెను,

5. రఘువంశమ్ములో నొక విద్యార్థికి నొక్కశ్లోకము క్రమముగా బాఠము చెప్పబడినది.

6. లోక విషయములు చమత్కారముగ సయుక్త కముగ మధ్యమధ్య సభా నురంజక మగ నడిగిన వారితోడ నెల్ల ముచ్చటిం పఁబడినవి.

7. చతురంగములో బాగుగ నాడఁగలము అని పేరు వడసిన యొక యిద్దరు గొప్పవారొక్క ప్రక్క నుండి యాడఁగ వారితో నాడి గొప్పగొప్ప మొహరాలను గూడ నోడించి యెత్తుల నడిగినని చ్చుచు నాడఁబడినది.'

8.ఈ యనధానము లన్నియు నేలోపము లేక సమాప్తి నొందిన పిదప సభనావరించి వచ్చిన విద్వజ్జనులలో బహ్మశ్రీ గాడేపల్లి వెంకట రామశాస్త్రు లవారును బ్రహ్మశ్రీ పు రుషిళ్ల ఆదినారాయణ శాస్తులవారును వేంకటగిరి నుండి వచ్చిన బ్రహ్మశ్రీ వేమూరి శ్రీ రామశాస్త్రులవారును, సంస్కృతాంధ్రములలో దమతమ సంతోషములఁ దెల్పు పుచు

తే.గీ॥ సింహపురమున సివిలు జెడ్జి పదమ్ము
సను జెలంగెడి రామచంద్రయ్య నాడు
గాక తిరుపతి వేంకటకవుల నాడు
గాక కలిగేని యితకులకాల మంచు3

సుపన్యాసము లిచ్చిరి. సభకు విచ్చేసిన మ. రా. రా, డిస్ట్రిక్టు మునసపు వారైన డబ్ల్యు గోపొలాచార్యులవారును .... ....... ......... సభనందఱిని రావించిన హైకోర్టువకీలు గారైన మ.రా.రా. , టి. వి. వేంకట రామ య్యర్ బి. యే., బియల్ ., గారును . . . మొద లైన గొప్పవారలందఱును అపరిమితానందము నందిరి. ప్రతియవథానమును గ్రము మ్ముగ నెఱ వేఱినతోడ నే మితి లేని యానంద సూచకము లైన కరతాళములు చెలఁగెను.

ఈ కిందిపద్యములొక బాలునిచేఁ జదివింపఁ బడినవి,

క: సుమహితమాయవధాన మ, సమానపొండిత్య విహిత సరసోక్తులచే,
నమరె నతి హృద్యముగ స, త్ప్రమోదలహరీ ని మగ్న పండితచయమై,

క || పండితజన హృదయాబ్జాప్తుండు విజయపుష్య శుద్ధ పూర్ణిమ తిది మా
ర్తండ సువాసరమునను, నుద్దండుఁడు వెంకటకవి యవదాన మొనర్చెన్ 2.

క. - - - ఉద్దండుడు తిరుపతికవి యవధాన మొనర్చెన్ 3

క|| పండిత సంభావ్యమగున, ఖండ సభన్ సభ్యు లెల్ల ఘనత నొసంగి రీ
మండిత తిరుపతి వేంకట, పండితులకు సరసవాక్య సౌరగు లగుటన్ 4

అంతట సభవారికి నెల్లూరునకును మంగళదాయకము లైన శ్లోకములతో సభవి రమించబడినది.

కుప్పచ్చి లక్ష్మయ్య పెన్ పండు వోవరు సీయరు (అనియున్నది.)

........................

Two Pandits named cehellapilla Venkateswara Sastri and : Tirupaty Sastri performed Ashtava daanaam at a pablic meeting held on the 25 of January 1894 in the Nellore Hindu High school. The development of their memory was such that they were able to pay their attention to many things simultaneously and their performance .


(సమస్య) సంధ్యా వందన మాచరింపవల దా! చౌశీతి బంధములన్,

వింధ్యాది ప్రభనొప్పు బల్ కుచములన్ నేపట్టి పెంపొందు కా
మాంధ్యం బార్పఁగ లేక వెర్రివలె నేల?! మంచిరాతిరిన్
వంధ్యన్ జేసెదు? కాము కేళియనఁగాఁ బాంత్యమా? లేక నీ
సంధ్యా వంచనమా: చరింపవలదా! చౌశీ బంధములన్ ,5

I was present and was very much pleased with what they did.

2nd Feb, 1894. NELLORE.

(Sd) C. RAMACHANDRAIAH.

At a literary entertainment given in the Nellore Hindu High School on the 25th January 1894 by the sanstrit pandits Brahmasree Challapilia Venkata Sastri Garu and Brahmasree Di- vakarla Tirupati Sastri Garu, the pandits exhibited very success- fully the extra-ordinary feats of memory in performing the Ashtavadhanm and the extra-ordinary talents at the speedy com. position of any story into beautiful sanscrit verses. They have also composed verses in different subjects in Telugu and Sanscrit in very difficult metres chosen by the member. The tact and the command of the language with which the pandits managed to compose verses in Sanscrit, leaving out the letter prohibited by the member in charge of Nishedhakshari at every step at & very critical stage, is only wonderful. They have also, to the highest satisfaction of the audience repeated the words in order and without fail given Vyestakubary, tbough the words are of several languages and of difficult pronunciation. They have successfully managed the other parts and the Ashtavadhanam, vit the count of the beats of the bell, the chess, the discussion in sapserit Grammar, the wordly dis. course and the imparting of instruction to a pupil reading sanscrit, The undersigned are glad to bear testimony to all the above.

T. Venkatrama Aiyar, G. Vasudeva Sastri N. Suryanarayana Row A. Venkaiah, A. K. Arunachela aiyar, K. Lakshmaiah,C. Ramarow, S Sabbarow, W. Gopalacharyola,S. Venkatesiah, K. Seetapati Row,C. Subba row