భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/షఫాతున్నీసా బీబీ

వికీసోర్స్ నుండి

బ్రిటీష్‌ పోలీసుల భయంకర దాష్టీకాన్ని ఎదుర్కొన్న

షఫాతున్నీసా బీబీ

(1896-1948)

స్వాతంత్య్రోద్యమంలో అష్టకష్టాలు భరించి, అహర్నిశలు శ్రమించి స్వరాజ్యం లభించాక తాము పుట్టి పెరిగిన గడ్డ ను వదాలి వెళ్ళాల్సి వస్తే అది అత్యంత దుర్భర అనుభవం అవుతుంది. అవిశ్రాంతంగా సాగిన స్వాతంత్య్రోద్య మం పుష్పించి, ఫలించి స్వరాజ్యం సిద్ధించాక మతం ఆసరాతో రాజకీయ నేతృత్వంలో పలు స్వార్థప్రయోజనాలు జమిలిగా ఆడిన వింతనాటకంలో విభజన ముంచుకు వచ్చింది. స్వలాభం ఏమాత్రం ఆశించక ఆనాడు పోరు బాట సాగిన కుటుంబాలు చేసిన అద్వితీయ త్యాగాలు మతం ముద్రావలన మరుగునపడి బలవంతంగా స్వంత గడ్డను విడిచిప్టాెెల్సి రావటం విషాదాకరం. అటువిం భయానక అనుభవాలను విభజన సంఘటన కొన్ని కుటుం బాలలో తెచ్చిపెట్టింది. ఆ భయంకర చేదు అనుభవాలను చవిచూసిన మహిళ షఫాతున్నీసా బీబీ.

1896లో పంజాబ్‌లోని లూధియానాలో షఫాతున్నీసా జన్మించారు. ఆమె తండ్రి మౌలానా అబ్దుల్‌ అజీజ్‌ నక్షా బంది. ఆయన ధార్మికపండితుడు. ఆయన చిన్న కుమార్తె షపాతున్నీసా బీబీ. చిన్ననాటనే ఆమె ధార్మిక విద్యతోపాటుగా లౌకిక విద్యను అభ్ సించారు.

1457

తండ్రి సాంప్రదాయక ధార్మికుడు కనుక ఆ మార్గంలోనే పెరిగినా లోకం పోకడను మాత్రం చిన్ననాట నుండి ఆసక్తిగా గమనించారు. 1914లో లూధియానాకు చెందిన ప్రముఖులు మౌలానా హఫీజుర్రెహమాన్‌ను వివాహమాడారు.

జాతీయోద్యమంలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న మౌలానా హబీబుర్రెహమాన్‌ జమాఅత్‌-ఏ-ఉలేమా-ఏ-హింద్‌, భారత జాతీయ కాంగ్రెస్‌లో క్రియాశీలక సభ్యులు.బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో ఆయన ఆత్యంత కీలక పాత్ర నిర్వహించారు. ఖిలాఫత్-సహాయ నిరాకరణ ఉద్యమనేతగా ఖిలాపత్‌ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. మంచి వక్తగా ఖ్యాతిగాంచిన మౌలానాకు మారువేషాలలో ప్రభుత్వ గూఢచారుల కన్నుగప్పి, పోలీసులకు చిక్కకుండా ముప్పు తిప్పలు పెట్టిన సాహస చరిత్ర ఉంది. ఆ కారణంగా పోలీసులు కక్షగట్టటంతో మొత్తం మీద మౌలానా 10 సంవత్సరాల ఆరు నెలలపాటు పలు జెళ్ళ ల్లో గడపారు. (Muslims In India, MK Jain,Manohar, New Delhi, 1979, Page.186)

అవిశ్రాంత ఉద్యమకారుని భార్యగా షఫాతున్నీ బీబీ కూడ జాతీయోద్యమంలో తనదైన సాహసోపేత పాత్రను నిర్వహించి చరిత్ర పుటలకెక్కారు. ఆ భార్యాభర్తలు అద్వితీయమైన దేశభక్తితో మహాత్మాగాంధీ. మౌలానా ఆజాద్‌, పండిట్ నెహ్రూలచే గౌరవాభిమానాలను అందుకునాflన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా విరామం లేకుండా భర్త పలుమార్లు సుదీర్ఘ… జైలు జీవితం గడిపినప్పటికీ ఏ మాత్రం అధైర్యపడకుండా లక్ష్యసాధనకు భర్తతోపాటు పలు కష్టాల కడగండ్లను ఎంతో సాహసంతో అనుభవించిన ఆమె సహనశీలి.

ఆమె భర్త మాత్రమే కాక కుమారులు కూడ స్వాతంత్య్రసంగ్రామంలో భాగస్వాములు. అజ్ఞాతం, అరెస్టులు, జైళ్ళలో గడపటం మూలంగా ఆ కుటుంబం దుర్భరమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంది. ఏరోజుకారోజు తిండితిప్పల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రోజు గడవటం కూడ కనాకష్టమైన దశలో షఫాతున్నీసా ఆ విచారకర విషయాలను జైళ్ళల్లో మగ్గుతున్న భర్త బిడ్డలకు తెలియ నివ్వకుండ గుట్టుగా గడుపుతూ ఆ యోధాులను ప్రోత్సహించారు. ఆర్థిక కడగండ్లనుఎదుర్కొంటున్నా, తనవద్దనున్న కొద్దిపాటి ఆర్థికవనరులతో జాతీయోద్యమంలోపాల్గొంటున్న ఇతర ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకున్నారు. ఉద్యమకారుల

146 కుటుంబాలు ఎటువంటి దుర్భర, దారుణ పరిస్థితులను అనుభవించాల్సి వస్తుందో అనుభవపూర్వకంగా తెలిసిన ఉద్యమకారిణి కనుక ఉన్నంతలో ఇతరులను ఆదుకుంటూ, మంచి రోజులు ముందున్నాయని ఆ ఉద్యామకారుల కుటుంబ స్త్రీలకు ధైర్యం చెప్పటం విశేషం. ఆ కార్యక్రమంలో భాగంగా ఆమె ముస్లిం మహిళలకు ఖురాన్‌ అధ్యాయనంలో శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు పాకిస్థాన్‌ ఏర్పడేంతవరకు పదివేల మంది ఆమె నుండి లబ్దిపొందినట్టు సమాచారం. (Encyclopaedia of Muslim Biography Vol. 4, NK Singh, APH Publishing Corporation, New Delhi,2001, Page. 233)

ఖద్దరు ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రజలలో ప్రదానంగా మహిళలలో ఖద్ధరు ధారణను ప్రోత్సహించారు. ఆమె కుటుంబ సభ్యులంతా ఖద్దరు ధరించారు. ఆమె భర్తతోపాటుగా జమాఅత్‌ ఉలేమా- యే-హింద్‌, (Jamaiatul Ulema-e-hindi.), భారత జాతీయ కాంగ్రెస్‌లో సభ్యత్వం స్వీకరించారు. ఆయా సంస్థల పిలుపు మేరకు జరిగిన పలు కార్యక్రమాలలో చురుకైన భాగస్వామ్యం అందించారు. 1922 నాటి సంఘ టన. జాతీయోద్యామ కారులైన షఫాతున్నీసా భర్త, బిడ్డలూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. న్యాయస్థానం భర్తకు ఒక సంవత్సరం జైలుశిక్షతోపాటుగా వెయ్యి రూపాయల జరిమానా విధించింది. ఆ జరిమానా చెల్లించేందుకు మౌలానా హబీబుర్రెహమాన్‌ నిరాకరించారు. ఆ సొమ్మును వసూలు చేయాలన్నసాకుతో ఆయన గృహాన్ని సోదా చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. ఆ సమయంలో షఫాతున్నీ సా లూధియానాలోని తన మట్టి ఇంటిలో చిన్న పిల్లలతో అతికష్టం మీదా కాలం గడుపుతున్నారు.

సోదా చేసేందుకు పోలీసులు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఆమె పర్దానషీ మహిళ అని కూడ చూడకుండ పోలీసులు తమ సహజ శెలిని ప్రదర్శించారు. ఏమాత్రం అధైర్యపడకుండ సోదాకు వీలు కల్పించి ఆమె పక్క కు తప్పుకున్నారు. పోలీసులు యధాప్రకారంగా విధ్వంసం సృష్టించారు. ఆహార పదార్ధాలను నిత్యావసర వస్తువులను నేలపాలు చేశారు. చివరకు చిన్న బిడ్డల చెవుల్లోని దుద్దులను కూడ లాక్కెళ్ళారు. అంత జరిగినా పోలీసులు వెళ్ళిపోయాక తన బిడ్డలను ఒడిన చేర్చుకుని ఏమీ జరగనట్లు ప్రశాంతంగా ఆమె తన కార్యక్రమాలలో నిమగ్నమై పోయారు. (Bharath Ke Swatantra Samgram me Muslim Mahilavonka Yogdaan, Dr. Abida Sameeuddin, IOS, New

147 Delhi 1997, page. 260-261.)

అజ్ఞాతం, ఆ తరువాత అరెస్టు, జైలు శిక్షల మూలంగా సుమారు మూడు సంవత్సరాల పాటు భర్త, బిడ్డ లు ఇంటలేరు. ఆమె ఉంటున్న మట్టిల్లు గోడలు కూలిపోయి ఆ కుటుంబంలోని మహిళలకు గోడచాటు కూడ కరువైంది. పర్దానషీ మహిళ లైనందున చాటుకు కనీసం మొండి గోడలు కూడ లేకపోవటంతో చినిగిన చీరలు, గోనెపట్టాలతో కొంత మేరకు చాటు ఏర్పాటు చేసుకుని, కుమార్తెలతో శిథిల గృహంలో గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ స్థితిలో కూడ ప్రభుత్వం, పోలీసుల వేధింపులకు ఏమాత్రం జంకకుండ, ఉద్యామకార్యక్రమాల పట్ల అపూర్వమైన నిబద్ధత, ధైర్యాన్ని ప్రదర్శించారు. భర్త బిడలు దేశ సేవకు అంకితం కావటం మహత్తర భాగ్యమని భావించిన షఫాతున్నీసా పోలీసుల వేధింపులను, విద్వంసాన్నిఓర్పుతో భరించారు.

1947 నాటికి స్వారాజ్యం సిద్ధించే రాజకీయ వాతావరణం ఏర్పడింది. అఖిల భారత ముస్లిం లీగ్ భారత విభజన కోరటంతో షఫాతున్నీసా దంపతులు సహించలేక పోయారు. మతం ఆధారంగా ప్రజల విభజన తగదన్నారు. పాకిస్తాన్‌ ఏర్పడినంత మాత్రాన ముస్లింలకు వొరిగేది ఏమీ ఉండదని హెచ్చరించారు. ఇస్లాం ప్రమాదాంలో పడిందాని సాగుతున్న ప్రచారాన్నిమøలానా చాలా తీవ్రంగా ఎదాుర్కొన్నారు. ఆ కారణంగా ముస్లిం లీగ్ నేతలకు, కార్యకర్తలకు ఆ దంపతులు శత్రువులయ్యారు. ఆ భయానక వాతావరణాన్ని భరిస్తూ మౌలానా దాంపతులు విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించారు. చివరకు విభజన తప్పలేదు. ఆకాంక్షలకు విరుద్దాంగా మాతృభూమి విభజనకు గురికావడం, మొన్నటిదాకా స్వదేశంగా ఉన్న ప్రాంతం ప్రసుతం పరాయి దేశం కావటం లాంటి అవాంఛనీయ వాతావరణం ఆ దాంపతులకు మింగుడు పడలేదు.

1947నాటి విభజన తుఫాను అందరిన్నీ చుట్టుముట్టి అందరి జీవితాల్లో కల్లోలం సృష్టించింది. ఆకల్లోలం తాకిడి షఫాతున్నీసా కుటుంబాన్ని కూడ తీవ్రంగా తాకింది. ఆ మతవిద్వేష పెనుతుఫానులో ఆమె కుటుంబం సర్వం కోల్పోయింది. తల దాచుకునేందుకు మొండిగోడల ఇల్లు కూడ లేకుండ పోయింది. నిలువనీడ లేకున్నా, తిండికరువైనా పర్వాలేదనుకున్నా చివరకు షఫాతున్నీసా కుటుంబీకుల ప్రాణాలకు ఉన్మాదుల నుండి ముప్పు ఏర్పడింది.

ఆ పరిస్థితులలో మిత్రుల, సన్నిహితుల బలవంతం మీద ఆ దంపతులు లూథియానా వదిలి వెళ్ళాల్సి వచ్చింది. ఏనాడు ఊహించనటువంటి దుస్థితి ఎదురు

148


కావటంతో షపాతున్నీసా తీవ్రంగా కలతచెందారు. ఆమెకు లూధియానాలోని తన ఇంటిని, పుట్టీ పెరిగిన గడ్డను వదలి వెళ్ళటం సుతరాము ఇష్టంలేదు. ప్రాణాలు పోయినాలూథియానా వదలి వచ్చేది లేదని ఆమె భీష్మించుకున్నారు. ఆమె తండ్రి ఇంటిని కూడఎవ్వరో స్వాధీనం చేసుకున్నారు. ఆ భయానక వాతావరణం నుండి తప్పించుకోడానికి సంబంధీకులు తలోదారయ్యారు. చివరకు మౌలానా హబీబుర్రెహమాన్‌ నచ్చ చెప్పా క స్వంత ఇల్లు వదలిన ఆ దంపతులు శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నారు.

శరణార్థ్ధుల శిబిరంలో ఉండటం ఆమెకు ఏమాత్రం ఇష్టంలేదు. ఈ విషయాన్నిపలుమార్లు భర్త వద్ద వ్యక్తం చేస్తూ, ఈ దుస్థితిని చూడడనికేనా? మనం అష్టకష్టాలనుభరించింది? మనం మన ఇంటికి వెళ్లి పోదాం, పదండి అంటూ భర్తను పట్టుకుని ఆక్రోశించారు. ఆమెను ఓదార్చటం మౌలానాకు చాలా కష్టమైపోయింది. ఈ ఆవేదనతోఅమె ఒక్కోసారి స్థిమితం కోల్పోయి ప్రవర్తించసాగారు. ఆ పరిస్థితికి బాధాతప్త హృదయంతో మౌలా నా విచలితులవ్వడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.

చివరకు లూధియానా శరణార్థుల శిబిరంనుండి ఆ దంపతులు ఢిల్లీ చేరారు.విభజన తరువాత పరిణామాల వలన ఖాళీగా ఉన్న ఒక గృహంలో తల దాచుకున్నారు.ఆ తరువాత కొద్దికాలానికే, ఆ ఇంటి యజమాని తిరిగి రావడంతో తాము తలదాచుకున్నఇంటిని యజమానికి అప్పగించి వారు బజారుపాలయ్యారు. నిలువ నీడలేని దుస్థితిలోమళ్ళీ శరణార్ధి శిబిరం చేరక తప్పలేదు. ఆ సమయంలో పాకిస్థాన్‌ వెళ్ళమని కొందరిచ్చి న సలహాను షఫాతున్నీసా దంపతులు తీవ్రంగా అసహ్యించుకున్నారు. ఏది ఏమైనా ఇక్కడే ఉండి పుట్టి న మట్టిలో కలసి పోవాల్సిందే తప్ప పుట్టిపెరిగిన గడ్డను వదలి వెళ్ళేప్రసక్తి లేదని, ఆమె స్పష్టం చేశారు.

ఆమె లూథియానాలోని తన స్వంత ఇంటికి వెళ్ళాలని చివరి దశవరకు ఎంతగానో పరితపించారు. ఇంటికి ఎప్పుడు వెడదామంటూ భర్తను పలుమార్లు ప్రశ్నించి ప్రశ్నించిఎంతగా అలసి పోయినా ఎటువంటి ప్రయోజ నం లేకుండా పోయింది. చివరకు లూథియానాలోని స్వంత ఇంటి గడప మళ్ళీ తొక్కకుండానే శ్రీమతి షఫాతున్నీసా బీబీ 1948 జూన్‌ 1న ఢిల్లీలో కన్నుమూశారు.

149