భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/షంషున్నీసా అన్సారి

వికీసోర్స్ నుండి

జాతీయోద్యమానికి సర్వం వొడ్డిన దానగుణశీలి

షంషున్నీసా అన్సారి

(-1938)

మాతృభూమిని బ్రిటిష్‌ దాస్యశృంఖలాలనుండి విముక్తం చేయడానికి సాగిన మహత్తర స్వాతంత్య్ర సంగ్రామంలో ఈ దేశపు స్త్రీ పురుషులు విభిన్న పాత్రలను నిర్వహించి లక్ష్యసాధనలో తోడ్పడ్డారు. ఈ మేరకు పోరుబాటన నడిచిన మహిళల్లో ఆత్మార్పణలతో కొందరైతే, అద్వితీయ త్యాగనిరతి, దాన,ధర్మ,దయాగుణాలతో మరికొందరు తమదైన క్రియాశీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఈ ద్వితీయ వర్గీకరణలోని మహిళలు తాము స్వయంగా ఉద్యమించకున్నా ఉద్యమకారులకు అన్నివిధాల తోడ్పాటు అందచేస్తూ ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకుంటూ పరోక్షంగా ఉద్యమానికి జవసత్వాలను అందించారు. ఈ కోవకు చెందిన దానగుణశీలి శ్రీమతి షంషున్నీసా అన్సారి.

భారత జాతీయ కాంగ్రెస్‌లో ప్రధాన భూమిక నిర్వహించిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు ఢిల్లీకి చెందిన డాకర్‌ ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి ఆమె భర్త. 1899లో

డాక్టర్‌ అన్సారిని ఆమె వివాహమాడారు. ఆమె సాంప్రదాయక మత విద్యను అభ్యసిం చటంతోపాటు పర్షియన్‌, ఉరూ, అరబ్బీ బాషలలో ప్రావీణ్యం సంపాదించారు. సాహిత్య, రాజకీయ,సామాజిక గ్రంథాల పఠనం పట్ల ఆమెకు ఆసక్తి ఎక్కువ. సమకాలీన సమాజ

125 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

స్వరూప స్వభావాలను, రాజకీయాలను అవగాహన చేసుకోవటం పట్ల అభిలాష. ఈ మేరకు సంతరించుకుబన్న పరిజ్ఞానం వలన ఆమె సమకాలీన రాజకీయాల గురించి భర్తతోపాటుగా మహాత్మాగాంధీ లాంటి మహానాయకులతో చర్చించటం జరిగింది. ప్రముఖ నాయకులతో అభిప్రాయాలను పంచుకుంటూ, తన వైఖరిని స్పష్టం చేయడానికి ఆమె ఏమాత్రం వెనుకాడ లేదు . జాతీయ,అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు

తెలుసుకుంటూ భర్త అభిప్రాయాలను కూడ ప్రభావితం చేసిన ప్రతిభావంతురాలు.

1921నాి ఖిలాఫత్‌ ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొనటం ద్వారా ఆమె జాతీయోద్యమ రంగప్రవేశం చేశారు. జాతీయోద్యమంలో బేగం షంషున్నీసా, డాక్టర్‌ అన్సారి బహుముఖ పాత్ర నిర్వహించారు. ఢిల్లీ ఖిలాఫత్‌ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఆమె సేవలందించారు. డాకర్‌ అన్సారి ప్రత్య క్ష కార్యకలాపాలలో పాల్గొంటే షంషున్నీసా బేగం పర్దానషీ మహిళ అయిఉండి కూడ బృహత్తరమైన బాధ్యతలను నిర్వహించి మహాత్మా గాంధీజీ నుండి ప్రేమాభిమానాలందుకున్నారు. ఆమె ముస్లిం మహిళలలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయాధులు, అలీ సోదరుల మాతృమూర్తి ఆబాది బానో బేగం ఢిల్లీ వచ్చిన సందర్భంగా మహిళలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి ఖిలాఫత్‌ ఉద్యమం కోసం రెండువేల రూపాయలకు పైగా విరాళాలను వసూలు చేసి ఆమెకు అందజేశారు.

భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలో ఆమె ప్రత్యేక ఆసక్తి చూపారు. అన్సారి తోపాటుగా ఆమె కూడ ప్రతి సమావేశానికి హాజరయ్యేవారని INSIDE INDIA గ్రంథాంలో రచయిత్రి HALIDE EDIB పేర్కొన్నారు. డాక్టర్‌ అన్సారి ప్రారంభించిన Anjuman-i-Khuddam-Kaaba కార్యకలాపాలలో ఆమె కీలకపాత్ర వహించారు. ఆధునిక విద్యావిధానాలు, సాంప్రదాయక విద్యాపద్ధతుల మధ్యన సమన్యయం ఏర్పరచడానికి, మక్కాలోని పవిత్రస్థలాలను పరిరక్షించి అభివృద్ధి పర్చేందుకు సాగిన కృషిలో తోడ్పాటునందించిన ఈ సంస్థకు ఆర్థిక వనరులు సమకూర్చడనికి షంషున్నీసా బేగం ఎంతగానో శ్రమించారు.

జాతీయ కాంగ్రెస్‌ ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమాలు ఏవీకూడ ఆమె భాగస్వామ్యం, సహకారం లేకుండా ఆరంభమయ్యేవి కావు. జాతీయ కాంగ్రెస్‌

126 భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు

సమావేశాలు ఏవి జరిగినా, అవి ఎన్ని రోజులు జరిగినా ఆ కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతి యోధుడికి డాక్టర్‌ అన్సారి ఇంట ఆతిధ్యం లభించేది. ఆ కారణంగా ఆయన గృహం Dar-Us-Salam జాతీయోద్యమకారులందరికి అతిధి గృహంగా ఉండేది. Dar-Us-Salam లో ఉద్యమకారులకు అన్ని సదుపాయాలు కల్పించటం జరిగేది. ఆ సందర్బంగా షంషున్నీసా బేగం సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ వారివారి అవసరాలకు తగ్గట్టుగా వసతి, భోజన ఏర్పాట్లు చేసేవారు. అతిధాులెవ్వరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండ ప్రణాళికాబధంగా ఆతిధ్యాన్ని, ఇతర సదుపాయాలను కల్పించటంలో ఆమె శ్రదవహించారు.

ఢిల్లీకి వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన స్వాతంత్య్రసమరయోధులకు వారివారి అవసరాలు, అలవాట్లను బట్టి ఏర్పాట్లు చేయటంలో ఆమె ప్రత్యేకత చూపారు. మాంసాహార, శాకాహార, యూరోపియన్‌ భోజనం ఇష్టపడే వారికి ప్రత్యేక శిబిరాలు ఉండేవి. అతిదుల కోసం శిబిరాల ఏర్పాటు ఎక్కడోకాకుండ Dar-Us-Salam లోని విశాలమెన ఆవరణలో ఏర్పాటు చేసి వారికి ఎటువంటి అసౌకర్యం జరగకుండా జాగ్రతలు తీసుకున్నారు. ఏ ఒక్కరి విశ్వాసాలకు, మనోభావాలకు భంగం కలుగకుండ చూసుకున్నారు. ఈ ఏర్పాట్లకు ఆమెకు తగినంత ధనం సమకూర్చటం డాక్టర్‌ అన్సారి వంతైతే, ఏర్పాట్ల నిర్వహణ, పర్యవేక్షణను బేగం అన్సారి తన భుజస్కంధాల మీద వేసు కుని శ్రమించారు. ప్రతినిధు ల శిబిరాల నిర్వహణాభారాన్నిఅతిధు లు ఆశ్చర్యపోయేలా సమర్థవంతగా నిర్వహించటం ఆమె ప్రత్యేకత.

షంషున్నీసా బేగం అంతి బృహత్తర కార్యక్రమాన్ని ఎంతో సమర్ధవంతంగా నిర్వహించటం ద్వారా మహాత్మాగాంధీని కూడ ఆశ్చర్యచకతుల్ని చేశారు. జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు జరిగినన్ని రోజులు వచ్చేవారు, పోయేవారితో Dar-Us-Salam ధర్మ శాలను తలపింపచేసేది. ఆ కారణంగా 1931మార్చి 29నాటి నవజీవన్‌ పత్రికలో అన్సారి ధార్మశాల శీర్షికతో డాక్టర్‌ అన్సారి ఇంట అతిథ్యం లంభించే తీరు తెన్నులను, ఆయా కార్యక్రమాల నిర్వహణలో బేగం షంషున్నీసా చూపిన శ్రద్ధను ప్రశంసిస్తు గాంధీజీ ప్రత్యేక వ్యాసం రాసారు.

ఈ వ్యాసంలో షంషున్నీసా దాయాగుణాన్ని, సహనశీలతను, కార్యనిర్వహణా దక్షతనేకాక, ఆమె ప్రగతిశీల భావాలను ఎంతగానో కొనియాడరు. ఆ వ్యాసం చివరిలో,


127 సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అన్సారి బేగం సమక్షాన శ్రద్ధభావనలతో నా శిరస్సు వంచాను (మైనే శ్రద్ధా భావ్‌సే అపనా శిర్‌ బేగం అన్సారి కే సమక్ష్ మే ఝు కా దియా) అని అన్నారు. మహాత్మా గాంధీ తన ఢిల్లీ పర్యటనలో డాక్టర్‌ అన్సారి ఇంట మాత్రమే బసచేసేవారు. ఆ సందర్భంగా బేగం అన్సారితో కుటుంబ విషయాలనే కాకుండ, జాతీయోద్యమ కార్యక్రమాల గురించి కూడ చర్చించేవారని HALDE EDIB రచనల ద్వారా తెలుస్తోంది. ఆ సన్నిహితత్వం నేపద్యంలో మహాత్ముడు ఆ మహనీయురాలి పట్ల అంయత అపూర్వగౌరవాన్ని ప్రకటించారు.

అద్వితీయ త్యాగమూర్తులైన డాక్టర్‌ అన్సారి, బేగం షంషున్నీసా దంపతులకు సంతానం లేదు. జాతీయోద్యామ కార్యక్రమాలలో తలమునకలై ఉన్నఆ దంపతులు సంతానం గురించి ఆలోచించలేదు. చాలా కాలం తరువాత జోహారా బేగం అను అమ్మాయిని, షౌకతుల్లా అను అబ్బాయిని పెంచుకున్నారు. ఈ ఇరువురు కూడ జోహరా బేగం అన్సారి, షౌకతుల్లా అన్సారి పేర్లతో ప్రసిద్ధులయ్యారు. బిడ్డలు జోహారా బేగం, షౌకతుల్లా అన్సారిలను స్వాతంత్రోద్యామంలో కియ్రాశీలక పాత్ర వహించే విధంగా బేగం అన్సారితీర్చి దిద్దారు.

1936లో డాక్టర్‌ ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి మరణించారు. భర్త మరణించినా ఆయన లేని లోటు కన్పించకుండ బేగం షంషున్నీసా చివరి శ్వాస వరకు స్వరాజ్య కాంక్షతో భారత జాతీయ కాంగ్రెస్‌కు, జాతీయోద్యమకారులకు తన ఇంట అసమానమైన సేవలందించారు. డాక్టర్‌ అన్సారి సమకూర్చిపెట్టిన సంపదను, తన అమూల్యమైన సమయాన్ని ఆమె పూర్తిగా జాతీయోద్యమానికి అంకితం చేశారు. డాక్టర్‌ అన్సారి ఏమి సాధించినా అదాంతా షంషున్నీసా సహకారంతో మాత్రవుే నని ఆమె ప్రముఖుల గౌరవాన్ని అందుకున్నారు. ఆమెతో పరిచయమున్న ప్రతి ఒక్కరిచే పవిత్రమైన.. దానశీల మహిళగా (Very pious, very charitable) ప్రశంసలందుకున్నారు.

ఈ మేరకు చివరివరకు స్వాతంత్య్రోద్యమానికి తోడ్పాటు అందిస్తూ,జాతీయోద్యమ కార్యకర్తల, ఉద్యమనాయకుల, ప్రజల గౌరవాభిమానాలను అందుకున్న స్వాతంత్య్ర సమరయోధురాలు శ్రీమతి షంషున్నీసా అన్సారి 1938లో కన్నుమూశారు.

128