భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు/రజియా బేగం

వికీసోర్స్ నుండి

తెలంగాణ ప్రజా పోరుకు తోడ్పడిన యోధురాలు

రజియా బేగం

పరాయి పాలకుల పెత్తనం నుండిస్వదేశీయులను విముక్తిగావించేందుకు నడుంకట్టి ముందుకు నడిచిన మహిళామ తల్లులు కొందరు ఆ లక్ష్యం సాధించగానే విశ్రాతంగా కూర్చోలేదు. స్వదేశీ సంస్థానాలు ఇండియన్‌ యూనియన్‌లో కలవడానికి ఇష్టపడని దశలో ఆయా సంస్థానాధీశుల అభిమతాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం మేరకు ఉద్యమించారు. అంతిటితో ఆగకుండ భూమికోసం-భుక్తికోసం-భూస్వాముల దాష్టీికాల నుండి విముక్తి కోసం సాగిన సాయుధపోరాటంలో కూడ తమదైన పాత్ర నిర్వహించారు. ఆ తరువాత ప్రజలను చైతన్యవంతుల్నిచేస్తూ, ప్రధానంగా మహిళల సమస్యల పరిష్కారం మీద దాృష్టిసారించి తామెవ్వరికీ ఏమాత్రం తీసిపోమంటూ నిరూపణకు నిఖార్సయిన నిజంగా నిలచి చరిత్ర సృషించిన మహిళా పోరాటయోధులలో రజియా బేగం ఒకరు.

1914 ప్రాంతంలో హైదారాబాదు సంస్థానంలో రజియా బేగం జన్మించారు. ఆమె తల్లి హెదారాబాదుకు చెందిన వారు కాగా తండ్రి ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందినవారు. నైజాం సంస్థానంలోని పలు ప్రాంతాలలో ఆయన న్యాయాధికారిగా పనిచేశారు. తల్లి తండ్రులు ఉదార స్వభావులు కావటంలో తమ సంతానానికి తగినంత స్వేచ్ఛ కల్పించారు. ఆ విధంగా తండ్రి నుంచి లభించిన స్వేచ్ఛ ఫలితంగా రజియా బేగంకు అన్నదమ్ముల 253 తోపాటుగా చిన్ననాటనే స్వతంత్రబావనలు అలవడ్డయి. సన్నిహిత బంధువరం మాత్రం సనాతన సంప్రదాయవాదులు కావటంతో రజియా బేగం, ఆమె అన్నదామ్ములు, ఆమెతో పాటు ఉద్యామాలలో పాల్గొన్న కుటుంబ సభ్యులు పలు ఇక్కట్ల పాలయ్యారు.

రజియా బేగం 12 సంవత్సరాల వయస్సులోనే తన అక్కయ్య జమాలున్నీసా బాజి ఇతర కుటుంబ సభ్యులతో కలసి ' నిగార్‌ ' పత్రికను చదవటం ఆరంభించారు. ఆనాడు నైజాం సంస్థానంలో నిగార్‌ పత్రిక మీదా నిషేధం ఉంది. లక్నోకు చెందిన నియాజ్‌ ఫతేపూరి సంపాదకత్వంలో నిగార్‌ పత్రిక వచ్చేది. ఆ పత్రిక ఛాందాసత్వానికి, మతమౌఢ్యనికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండ స్వాతంత్య్రం, సామ్రాజ్యవాద వ్యతిరేక లక్ష్యాన్ని ముందుకు తీసుక పోవడనికి కృషిచేసింది. అందువల్ల ఈ పత్రిక అత్యంత ప్రమాదకరమైనదాని నైజాం ప్రభుత్వం భావించి సంస్థానంలోకి దాని ప్రవేశాన్ని నిషేధించింది. (హైదారాబాదు సంస్థానంలో రాజకీయ చైతన్యం, విద్యార్థి-యువజనుల పాత్ర (1938-1956), ఎస్‌.ఎం.జవాద్‌ రజ్వీ, విశాలాంధ్రా పబ్లిషింగ్‌ హౌస్‌, విజయవాడ, 1985, పేజి.25)

ఈ నిగార్‌ ఉర్దూ పత్రిక చదవటం వలన మతపరమైన ఛాందసాలకు వ్యతిరేకంగా, బ్రటీషర్ల మిత్రుడిగా మారిన నిజాం మీద జమాలున్నీసా తనదెన స్వతంత్ర అభిప్రాయా లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ, నేను ఏడో తరగతిలో వున్నప్పటి నుండి ప్రార్ధనలు చేసేదాన్ని. ఖురాన్‌ చదవటం నేర్చుకున్నాను. నమాజ్‌ చేయటం, 'రోజా' అంటే రంజాన్‌ పండగప్పుడు ఉపవాసాలు చేయటం ఇవన్నీ చేసేది. కాలేజీ కొచ్చిన తర్వాత ఇవన్నీ మానేశాను. ఈ కర్మకాండలన్నీ మానేశాను. దేవుడు, కర్మకాండలు వేర్వేరనిపించింది. ' నిగార్‌ ' ప్రభావం ఉండేది, అని అమె స్వయంగా చెప్పుకున్నారు. ఆ అభిప్రాయాల స్థిరత్వానికి ఆమె కుటుంబ వాతావరణం కూడ బాగా తొడ్పడింది. ఆమె అన్నదమ్ములు, అక్కయ్య జమాలున్నీసా కూడ స్వతంత్ర అలోచనలు కలిగిన వ్యకులు. ప్రజల పక్షంగా పోరాటలతో పాల్గొన్న ఉద్యామకారులు. ఆనాడు నిజాం మీదా వ్యతిరేకతతోపాటుగా, మత సంబంధమై న కొన్ని ఆచార సంప్రదాయాల విషయంలో కూడ సమకాలీన సమాజానికి భిన్నంగా ప్రవర్తించటం వలన రజియా బేగం పలు ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఆ విషయాలను ప్రస్తావిస్తూ, మమ్మల్ని కాఫిర్లనేవాళ్ళు. మతద్రోహులమని పిలిచేవాళ్ళని ఆమె చెప్పుకున్నారు. (మనకు తెలియని మన చరిత్ర


254 (తెలంగాణా రైతాంగపోరాటంలో స్త్రీలు-ఒక సజీవ చరిత్ర), స్త్రీ శక్తి సంఘటన, హైదారాబాద్‌, 1986, పేజి.173)

తలితండ్రులు ఉదార స్వభావులెనప్పికి సన్నిహిత బంధువరం మాత్రం సనాతన సంప్రదాయవాదాులు కావటంతో రజియా బేగం, ఆమె అన్నదామ్ములు, ఆమెతో పాటు ఉద్యామాలలో పాల్గొన్న కుటుంబ సభ్యులు పలు ఇక్కట్ల పాలయ్యారు. ఆ ఇబ్బందులను ఏమాత్రం ఖాతరు చేయకుండ తాము నిర్దేశించుకున్న మార్గంలో రజియా బేగం, తన సోదరి జమాలున్నీసా బాజి అన్నదమ్ములు అన్వర్‌, అఖ్తరలతో కలసి ముందుకు సాగారు. ప్రజలను చెతన్యవంతుల్ని చేయ టం ప్రదానాశయంగా సాగిన ఆమె ఆ దిశగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు.

ఆ విషయాలను రజియా బేగం వివరిస్తూ, మా కుటుంబం చాలా సంకుచిత స్వభావం కలది. ఒక్క మా తండ్రిగారే ఉదార స్వభావం కలవాడు. మేము పల్లెటూళ్ళో ఉండేది. బాజీ పెళ్ళయ్యిన (జమాలున్నీసా బాజి) తరు వాత మాకు పట్నంలో ఒక చోటంటూ దొరికింది. మేము ఉరూ, పర్షియన్‌ నేర్చుకున్నాం. ఇంగ్లీషు వచ్చేదికాదు. ఒక గోడపత్రిక ' తమీర్‌ ' అని ప్రారంభించాం. అంతా చేత్తోనే రాసేవాళ్ళం. మేం చదివి ఇతరులను కూడ చదివించేవాళ్ళం. ఇంగ్లీషు నేర్చుకోవడం ప్రారంభించాను. రెండు డిక్షనరీలు ఉర్దూ-ఇంగ్లీషు-ఉర్దూ పెట్టుకుని నేర్చుకున్నాను. షేక్స్‌పియర్‌, వికర్‌ హ్యూగో చదివాను. అర్థమయినపుడు యెంతో ఆనందించాను. మెల్లిగా అనువాదాలు చేయడం ప్రారంభిం చాను. ' ఇవాన్‌ ' అనే పత్రిక చదవటం మొదాలుపెట్టాను. చిన్న చిన్న కథలు రాయటం, తర్వాత ఉస్మానియా జర్నల్‌లో ప్రచురిచటం మొదలు ప్టోను. ఒక నవల కూడ రాశాను, అని అన్నారు. (మనకు తెలియని మన చరిత్ర పేజి.173)

ఆ విధంగా స్వయం కృషితో విద్యార్జన వైపు దృష్టిసారించిన రజియా తనకు నచ్చని ఆచారాలను పద్దతులను ఎంతో ధైర్యంతో వ్యతిరేకించారు. ఆ ప్రయత్నంలో మిత్రులను సంఘిపర్చి సంఘం ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సాహిత్య కార్యక్రమాల పట్ల అత్యధిక శ్రద్దాచూపారు. ఆ కార్యక్రమాలలో, యూనుస్‌ సలీమ్‌, ముస్లిమ్‌ జియా, ఇంకా చాలమంది రచయితలు నియాజ్‌, జాకిర్‌, హుస్సేన్‌, సాహిర్‌, జిగర, సిదిఖీ లాంటి కవులు వచ్చేవాళు, కొంతమంది మా ఇంట్లోనే వుండేవాళ్ళు. సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలు చాలా జరిగేవి. మేమంతా మార్కిస్స్ట్‌ సాహిత్యం

255 చదవలేదు. కాని నిగార్‌లో కొన్ని వ్యాసాలు వచ్చేవి. ఉర్దూ పత్రికలు చాలా ఉండేవి. రాజకీయల సమస్యలు కూడ చాలా చర్చించేది. యుద్ధం , జర్మనీ, హిట్లర్‌, మొదలైనవి. ఉర్దూ, ఇంగ్లీషు పుస్తకాలు చాలా తెప్పించుకుని ఎన్నో నేర్చుకునే వాళ్ళం, అని రజియా వివరించారు.

చదువు మీద ఆసక్తిగల రజియా బేగం ఉన్నత చదువులు చదవాలనుకున్నారు. ప్రదానంగా ఆంగం నేర్చుకోవానుకున్నారు. అందుకు ఓ యువకుడ్ని నియమించుకున్నారు. అయితే ఆ ఏర్పాటును సంబంధీకులు వ్యతిరేకించారు. ఈ విషయాన్ని ఆమె సోదరి జమాలున్నీసా బాజి చెబుతూ, రజియాకు ఇంగ్లీషు చెప్పటానికి ఒక బ్రహ్మణ అబ్బాయి వచ్చేవాడు. మా కుటుంబం అభ్యతంతరం పెట్టింది. బంధువులంతా వెలివేశారు. చాలా కొద్దిమంది అమ్మాయిలు ఆ రోజుల్లో చదువుకునేవాళ్ళు. మా అమ్మ మమ్మలెప్పుడూ సపోర్టు చేసేది. ఒక స్నేహితురాలిలాగా, అని తల్లితండ్రుల ధోరణిని వివరించారు. ఈ విధంగా తల్లి-తండ్రి ప్రోత్సాహంలో రజియా బేగం యం.ఎ వరకు చదువుకున్నారు. ఆమె చదువు, విముక్తి పోరాటంలో భాగస్వామ్యం పెనవేసుకుని సాగాయి.

అక్క, అన్నదమ్ములతో కలసి ఆమె కూడ జాతీయోద్యంలో భాగస్వాములయ్యారు. ప్రముఖ స్వాతంత్య్రసమరయాధుడు మౌల్వీ హస్రత్‌ మోహాని రజియా బేగం కుటుంబానికి సన్నిహిత బంధాువు. ఆయన తరుచు హైదారాబాదుకు రావటమే కాకుండ ప్రపంచ యుద్ధం సమయంలో ఆయన హైదారాబాదులో చాలా కాలం ఉన్నారు. ఆయన ప్రభావం రజియా కుటుంబం మీద ఉండే ది . ఆ ప్ర భావం నుండి ర జి యాబేగం తప్పించుకోలేకపోయారు. స్వతహగాస్వేచ్ఛాయుత భావాలు గల ఆమె బ్రిటీ షు బానిసత్వం నుండి విముక్తిని కోరుకున్నారు.ఆ కృషిలో భాగంగా ఆమె స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నారు. జాతీయోద్యమ కార్యక్రమాల నిర్వహణకు అవసరమగు నిధులను నాయకులకు అందచేయటంలో చిన్నతనం నుండే బాధ్యతలు నిర్వహించారు. ఈ దిశగా చురుకుగా పనిచేస్తూ కూడ మొదటినించి జాతీయోద్యామంలో వుండేవాళ్ళం. మేమేం చేయడంలేదని ఎప్పుడూ అన్పించేది, అని రజియా సోదరీమణులు చెప్పుకున్నారు.

ఆ క్రమంలో సాగుతున్న రజియా కుటుంబానికి కమ్యూనిజం పరిచయం కావటంతో ప్రజల పక్షాన నిలచి పోరాడే స్వభావం గల రజియా అక్కచెళ్ళల్లు కమ్యూనిస్టు పార్టీ వైపుకు మొగుచూపారు. ఆ పరిచయంమరింత ముందుకు వెళ్ళింది. ఆ విషయాన్ని


256 వివరిస్తూ, 1941లో అభ్యుదాయ రచయితల సంఘం అని ఒకటి వుండేది. మఖ్దూం, నజర్‌ హైదారాబాద్‌ ఎప్పుడూ వస్తూండేవారు. మేం నలుగురు అక్కచెల్లెళ్ళం. ఈ మీటింగులకి బహిరంగంగా వెళ్ళేవాళ్ళం. అమ్మకూడ వచ్చేది. కొంతమంది చిల్‌మన్ల (చాటున) వెనుక కూర్చునేవాళ్ళు...సజ్దాద్‌ జహీర్‌, ఓంకార్‌, పర్షాద్‌ లాంటి వాళ్ళు చాలా మంది అండర్‌ గౌండ్‌లో వున్నప్పుడు మా యింట్లో వుండేవాళ్ళు, అని పేర్కొన్నారు.

ఆ పరిచయాల కారణంగా ఏర్పడిన నూతన అభిప్రాయాల వలన రజియా బేగం కుటుంబం 1942 నాటికే ఇండియా ఉద్యమంలో పాల్గొన లేదు. అయితే క్విట్ ఇండియా ఉద్యమం పట్ల సానుభూతి ఉండేదని ఆమెస్వయంగా వెల్లడించారు. 1942 ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ మీదా నిషేదం విధించిన సందర్భంగా కూడ రజియా బేగం రహాస్యంగా కమ్యూనిస్టుల కార్యకలాపాలకు తొడ్పటు అందించారు. నిజాం సంస్థానంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులే పలు ఇక్కట్లు పడుతుండగా, నిషేదిత కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరులుగా మరిన్ని కష్టాలు పడాల్సిన భయానక వాతావరణంలో కూడ రజియా బేగం కుటుంబం కమ్యూనిస్టు ఉద్యామకారులకు చేయూత నిచ్చారు.

ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూనే 1944లో రజియా బేగం యం.ఎ పూర్తి చేశారు. చదువుకుంటూనే ఆమె తన సోదరి జమాలున్నీ బాజిలో కలసి జాతీయోద్యమ కార్యక్రమాలు, కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలలో రహస్యంగా పాల్గొటూ వచ్చారు. చివరకు భారతీయులు స్వరాజ్యాన్ని సాధించుకున్నక వెనువెంటనే ఆరంభమైన ఇండియన్‌ యూనియన్‌లో నైజాం విలీనం కోసం సాగిన పోరాటంలో తనదైన పాత్ర వహించారు. ఆ పోరాటం అంతిమ దశకు చేరు తున్న సందార్బంగా అంకురించిన తెలంగాణ పోరాటంలో రజియా బేగం కుటుంబం యావత్తు పాల్గొంది. ఆమె సోదరి జమాలున్నీసా బాజి, ఉద్యామకారులైన తన అన్నదమ్ములు అన్వర్‌, అఖ్తర్‌ ఇతర సన్నిహిత బంధువులు కూడ తెలంగాణ పోరాటంలో ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ పాత్రధారులయ్యారు.

ఈ సందర్భంగా రజియాబేగం పోలీసుల దాష్టీకాలను ఎదుర్కొన్నారు.పలు మార్లు అరెస్టులకు గురయ్యారు. జైలులో కూడ గడపారు. ఈ విషయాన్నిఆమె ప్రస్తావిస్తూ ఆ రోజుల్లో చాలా మంది కామ్రెడ్లుతో పోరాటం గురించి మాట్లడేదాన్ని, జైల్లోవున్నప్పుడు, ఒక స్త్రీ కామ్రోడ్‌తో మాట్లాడేదాన్ని. ఒక డైరీ కూడ రాసేదాన్ని. ఆది దొరికితే ఇంకా 257 చాలా వివరాలు తెలుస్తాయి. నాకొక గది ఉండేది, అని ఆమె అన్నారు. ఆనాడు తెలంగాణ పోరాటయోధులు రావి నారాయణ రడ్డి నాయకత్వంతో రజియా తన సోదరి- సోదరులతో నాయకుల ఆదేశాలను తప్పక పాటిస్తూ ఆడ మగ భేదం లేకుండ ఎటువంటి ప్రమాదకర పని అప్పగించినా, ఏమి తెలియని ప్రదశానికి వెళ్ళిరమ్మని పంపినా ఏమాత్రం అధైర్యపడకుండ ఎంతో సాహసంతో ఆ బాధ్యాతలు రజియా బేగం నిర్వర్తించారు.

ఉద్యమకార్యక్రమాలలో భాగంగా పోరాట యోధులకు ఆశ్రయం కల్పిచటం, ఆయుధలను దాచి పెట్టటం, ద్యాకారులకు అందచేయటం, ఉద్యమకారులకు సమాచారాన్ని చేరవేయటం తదితర పనులను తమ ఇంటిని, ఆ పరిసర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని రజియా బేగం నిర్వహించారు. ప్రముఖ కమ్యూనిస్టు నేతలు డాక్టర్‌ మహేంద్రా, రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మొహిద్దీన్‌, రాజ్‌ బహుద్దాూర్‌ గౌడ్‌, జవ్వాద్‌ రజ్వీ తదితరులకు ఆమె ఇంటిలో ఆతిధ్యం, ఆశ్రయం లభించింది. ఆ ఆశ్రయం నుండి నాయకులను మరింత సురక్షిత ప్రాంతాలకు చేరవేయటం లాంటి కార్యక్రమాలను పోలీసుల నిరంతర నిఘా నీడల్లో కూడ రజియా సమర్థవంతంగా నిర్వహించారు.

1951 ప్రాంతంలో తెలంగాణ సాయుధా పోరాటాన్ని విరమించాలా? కోనసాగించాలా? అను అంశం చర్చనీయాశంమెంది. ఆ సమయంలో, అఖ్తర, గోపాలన్‌ ( ఎ.కె. గోపాలన్‌), జ్యోతిబసు, ముజఫర్‌ అహమ్మద్‌తో ఏర్పడిన డెలిగేషన్‌ కి వచ్చి- 1951లో సాయుధ పోరాటం కొనసాగించాలా? విరమించాలా? అనే విషయం చర్చించడనికి వచ్చారు... ఆ విషయం గురించి చాలా రాత్రి వరకు మీటింగులు, చర్చలు జరిగేవి అని ఆమె వివరించారు. ఈ విషయంలో తన తండ్రి ఎంతో సహకరించారని వచ్చిన నాయకులకు రజియా కుటుంబం తమ ఇంటి ముందుగల గృహంలో బస ఏర్పాట్లు చేశారని ఆమె వెల్లడించారు.

తెలంగాణ పోరాటం ముగిశాక పార్టీలో కొంత మేరకు స్తబ్దత ఏర్పడింది. ఆ తరువాత ఎన్నికలు రావటంతో రజియా ఆ కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. సోదరి జమాలున్నీసా బాజితో కలసి ఆమె ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. చదువు మీద, మహిళా అభ్యున్నతి కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి సారించారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు వివిధ వృతులలో శిక్షణ, మహిళలలో చైతన్యం కలిగించేందుకు

258 రాత్రి బడులు, గ్రంథాలయాలు ఏర్పాటు, ప్రగతిశీల సాహిత్యం చదివించటం, ఆయాఅంశాల మీదా చర్చలు జరపటం ఈ కేంద్రాలలో జరిగేది. ఈ కేంద్రాలకు ప్రమీలా తాయి లాంటి ప్రముఖులు విచ్చేశారు. ప్రముఖ కమ్యూనిస్టు నేతలు రజియా బేగం కుటుంబంలోని మహిళలు పలు మహిళా కేంద్రాలను ప్రారంభింప చేసి ఆ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఆ కార్యక్రమాలలో భాగంగా కలకత్తా, ఢిల్లీ లాంటి ప్రాంతాలతో జరుగు అఖిల భారత మహిళా సంఘాల సమావేశాలలో ఆమె పాల్గొంటూ మహిళా ఉద్యామాలకు చేయూతనిచ్చారు.

చినన్నప్పటి నుండి రచనా వ్యాసాంగం మీదా అధిక ఆసక్తి చూపిన రజియా బేగం 1944 ఎం.ఏ చేసి వుమెన్స్‌ కాలేజిలో లెక్చరర్‌ అయ్యారు. ఆ తరువాత 1966లో యూర్సిటి ఆర్ట్స్ కాలేజిలో చేరారు. పర్షియ న్‌లో పి.హెచ్‌.డి ఇరాన్‌లో చేశారు. సరోజిని నాయుడు కుమార్తె లీలామణి నాయుడుతో కలసి కాలేజీలో సాహిత్య గోష్టులు జరుపుతూ ఔత్సాహిక కవులకు-రచయితలకు తోడ్పటు అందించారు. తెలంగాణ సాయుధా పోరాట కార్యక్రమాల తరువాత రజియాకు రాజకీయాల పట్ల అసక్తి తగ్గుముఖం ప్టింది. ఆసమయంలో ఆమె తండ్రి రిటైర్‌ కావడంవల్ల, మిగతా వాళ్ళంతా పార్టీలో పని చేస్తుండటం వల్ల ఆమె కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. ఆర్థికంగా స్థిరపడి కుటుంబ భారాన్ని మోసున్నప్పటి పురుషులతో సమానమన్పించకపోవటంతో ఆమె ఆవేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని మరింత విస్తారంగా వివరించారు.

ఇంట్లో అంతా తోడ్పడేవాళ్ళు. పురుషులు కూడ కొంత పనిచేసేవాళ్ళు. పిల్లలుకూడ కొంత చేసేవాళ్ళు. అయినప్పికీ కొంత మన బాధ్యా తే అన్పిసుంది. కొన్ని కారణాలుపరిశీలించాలి. స్త్రీగా వుండటమనేది ఒకటి. యుగాల నుంచి వస్తున్న సాంఫిుక వ్యవస్థఆమెను తక్కువ స్థాయిలో వుంచింది. ఆర్థిక స్వాతంత్య్రం వున్నప్పటికీ, స్త్రీ పురుషుని కంటే తక్కువగానే భావిస్తుంది. అతని మీదే ఆధారపడుతుంది. స్త్రీ ఒంటరిగా ఉండటంమనేటటువంటి భయం ఘోరమైంది, ప్రపంచమంతా వుంది. ఆమె తను ఒంటరిగా బయటకెళ్ళడనికి భయపడతారు, పురుషులెతే ఒంటరిగా వెళతాడు, ఎవరూ బాధించరు . పురుషుడికి స్వేచ్ఛవుంది. స్త్రీలను ఏ విధాంగా చూస్తారనే దాని గురించి పుస్తకాలు రాస్తున్నారు. ఈ బంధాలెలా తెంచుకుంటామనేది చూడలి. సిండరెల్లా అనే చక్కని పుస్తకంలో, స్రీకి ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నప్పటికి ఇంకా విముక్తి పొందకుండ వుండటమనే


259 సమస్య గురించి చర్చించారు. ఆ రోజుల్లో ఆర్థిక స్వాతంత్య్రమే ముఖ్యమైన సమస్య అనుకునేవాళ్ళం. నేను చదువుకుని, సంపాదించి ఎవరి మీదా ఆధారపడకుండా వుంటానని నిర్ణయించుకున్నాను. నాన్నకు చెప్పాను, ఆయన ఏమీ అభ్యంతరం పెట్టలేదు, కాని బంధువులు విమర్శించారు. తర్వాత కూడా పెళ్ళి గురించి ఆలోచించలేదు. నాపనిలో నిమగ్నురాలినై, దాని గురించి ఆలోచించలేదు. బహుశ సరియైున సమయంలో ఎవరూ కనిపించలేదేమో! అన్నిసంబంధాలు కూడ వరకట్నం, బేరాలతో నియమించబడేవి. అవంటే అసహ్యం వచ్చి, ఎవరితోటి ఆ విషయం గురించి మాట్లాడకపోయేది. నాన్న కూడ వాటిని వ్యతిరేకించేది. మా కుటుంబంలో చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు.

ఈ వాక్యాలు ఆమెలోని విప్లవాత్మక భావాలకు అద్దం పడతాయి. ఆ ఆభిప్రాయా లతో స్నేహం చేసిన రజియా బేగం చివరి వరకు వివాహం చేసుకోలేదు. చిన్న వయస్సు లోనే జాతీయోద్యమం, ఆ తరువాత కమ్యూనిస్టు ఉద్యమం, ఆ క్రమంలో ఇండియన్‌ యూనియన్‌లో నైజాం విలీనోద్యమం, అటు తరువాత తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నయోధురాలు రజియా బేగం ఉద్యమాల చరిత్రలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

(ఈ వ్యాసం ప్రదానంగా 1986లో స్త్రీ శక్తి సంఘ టన (హెదారాబాద్‌) ప్రచురించిన ' మనకు తెలియని మన చరిత్ర (తెలంగాణా రైతాంగపోరాటంలో స్త్రీలు-ఒక సజీవ చరిత్ర) ' గ్రంథంలోని రజియా బేగం ఆమె సోదరి జమాలున్నీసా బాజి తమ ఇంటర్యూలో చెప్పిన సమాచారం ఆధారంగా రూపొందించటం జరిగింది. ఆ గ్రంథం సంపాదకులు, ప్రచురణకర్తలకు నా ధాన్యవాదాలు. - రచయిత)

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

ఆ మహిళ (ఆకుపచ్చ దుస్తుల) యోధురాలు)అద్వితీయ ధైర్య శాలి. ఆమెకు మృత్యుభయ ఏ మాత్రం లేదు. ఫిరంగులు గర్జిస్తున్నా, తుపాకులు గుండ్లను వర్షిస్తున్నాఅత్యంత ధైర్యశాలి అయిన సైనికుడి మల్లే ఆమె తుపాకి గుండ్ల వర్షంలో నింపాదిగా నడిచి వెళ్ళేది. ఆమెను కొన్నిసార్లు నడిచి వస్తుంటే చూశాం. మరికొన్నిసార్లు గుర్రం మీద స్వారి చేస్తూ చూశాం. ఖడ్గవిన్యాసంలో, గురి తప్పకుండా తుపాకి పేల్చటంలో ఆమె మంచి నేర్పరి. ఆమె ధైర్య సాహసాలను చూసి ప్రజలలో ఉత్సాహం ద్విగుణీకృతమయ్యేది. - ప్రత్యక్ష సాక్షుల కథనం

260