పుట:Yogasanamulu.djvu/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

39


అష్టాంగ యోగము సాధన చేయు వారు నియమములను పాటించి సాధన చేయ వలయును. భగవద్గీత యందు ఈ విధముగా చెప్పబడినది.

శ్లో: శుచే దేశే ప్రతిష్టాప్మ స్థిరమానస యత్మానః
నాత్యుచ్చ్రితం నాతి నీచం చేలా జిన కుశోత్తరం: భ.గీ. అ.అ.. శ్లోకము

తా: పవిత్రమైన స్థలమందు మిట్ట పల్లములు లేకుండా చూచి అందు దర్భ గట్టితో చేసిన చాపను దానిపై జింక చర్మమును దానిపై గుడ్డను పరచి యోగస్థాన చేయవలయును.

ఈ విషయమునే శ్వాతాశ్వతరోపఇషత్తు అందు ఇట్లు చెప్పబడెను.

సమే, శుచౌ శర్కరా వహ్ని తాలుకా
వివర్జతే శబ్ధ జలాశ్రయాధి భి
మనోఽ నుకూలేనతు చక్షు పీడనే
మాహా నివాతా స్రయణే ప్రయోజయేతే: ..... శ్వాతాస్వతరోపనిషత్తు: 2..20

తా: సమతలముగా ఉండు పతిత్ర స్థలమున రాళ్ళు రప్పలు లేనిదియు దగ్గరలో నిప్పుగాని, జలాశ్రయములు గాని, శభ్ధ కాలుష్యము పొందనట్టియు ఎక్కువ గాలి వీచ నట్టి స్థలమును ఎన్నుకొనవలయును.