పుట:Yogasanamulu.djvu/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

190

లంక సూర్యనారయణ


లయము చేయును. శరీరము లాఘవముగను కాంతి మంతేముగను వుండును. క్రొవ్వు తగ్గి పోవును. శ్రీరము శక్తి వంతముగను మనస్సు ఉత్సాహవంతముగ నుండును. తొందరపాటు లేక దినమునకు నాల్గు పర్యాయముల చొప్పునచేసిన ఉష్ణము (యోగాగ్ని) ఉత్పత్తి యగును. ఆ ఉష్ణమునకు నిద్రించుచున్న కుండలిని మేల్కాంచి చుట్ట చుట్టలుగా చుట్టుకొనిన తన దేహమును నిడివిగా చాచుకొనును. తన ముఖము సుషుమ్నా నాడి యొక్క ద్వారముననే వున్నది. కనుక ఇది సాగి నపుడు సుషుమ్నలో ప్రవేశించును. చెరకు గడలో కణుపుల వలె. సుషుమ్నలో ఆరు చక్రములు మూడు గ్రంధులు యున్నవి (1. మూలాధార, 2. స్వాదిష్టాన, 3. మణి పూరక, 4. అనాయిత, 5. విశుద్ధ, 6. అజ్ఞా చక్రములు (ఏడవది సహస్రారము) అను చక్రములు. బ్రహ్మ గ్రంది విష్ణు గ్రంధి. రుద్ర గ్రంధులు మూడును గ్రంధి త్రయము లనబడినవి. ఈ నాడీ కూడలులు కఠినముగా వుండుట వలన అయా చక్ర గ్రంధి భేదనము జరిగి కాని కుండలిని ముందునకు సాగలేదు. అవి భేదింప బడగా మహా మాతయైన శక్తి సహస్త్రారమున పరమేశ్వరుని చేరును. అపుడు యోగి నిర్వికల్ప సమాధి నందగా ఆస్థితిని చెప్పుటకు మాటలు లేవు. ఆయానందము అనిర్వచనీయము. శరీరమున వున్న అత్మ పరమాత్మను పొందును. కుండలిని సుషుమ్న యందు ప్రవేశింపగా యోగి అణిమాది అష్ట సిద్ధులను పొందును. సిద్దులను తిరస్కరించి పరమావధి యగు సమాధి నభిలషించి సాధనను కొన సాగించ వలయును. ఈ సాధన నిర్వికల్ప సమాధిని పొందు వరకు