ద్వితీయాధ్యాయము
25
(దాతలులేనిచో కన్య తగినవరుని స్వయంవరము చేసికొనవలెను.)
మనువుకూడ వసిష్ఠునివలెనే మూడు సంవత్సరములు చూచి స్వయంవరము చేసికొనవలెనని చెప్పినాడు.
త్రీణివర్షాణ్యుదీక్షేత కుమార్యృతుమతీసతీ
ఊర్థ్వంతుకాలాదేత స్మాద్వింజేత సదృశంపతిం
- (మను 9-88)
(కన్య ఋతుమతియై మూడు సంవత్సరములు వేచియుండి పిమ్మట తగిన వరుని పొందవలెను.)
ఇట్లు సకాలములో తండ్రిచేత నీయబడనిదై స్వయముగ వివాహమాడిన స్త్రీగాని యామెభర్తగాని యెంత మాత్రము దోషమును పొందరని మనుస్మృతి చెప్పుచున్నది.
అదీయమానాభర్తా రమధిగచ్చేద్యదిస్వయం
నైనః కించిదవాప్నోతినచయంసాధి గచ్ఛతి
- (మను 9-91)
రజస్వలయైనపిమ్మట మూడేండ్లు కన్య వేచియుండవలెనని మనువు చెప్పుటచే రజస్వల కాకుండనే కన్యను దానము చేయుట తండ్రి కర్తవ్యమని యాతని యభిప్రాయమైనట్లు తేలుచున్నది. అయినను తండ్రి నేరముచే కూతురు దోషవంతురాలు కాదని యాతడు భావించుచున్నట్లుకూడ పైశ్లోకమువలన తెలియుచున్నది. అంతేకాక మొత్తముపైన మనువు