పుట:VrukshaSastramu.djvu/450

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

446 వర్షము కురిసినచో బండ్లు పండవు. మరియు నీ చెట్లకు ఉష్ణమెక్కువగా నుండవలెను.

ఖర్జూరపు చెట్టు ఈత చెట్ల వలెనే యుండును. కాని వీని ఆకులు చివరల ముండ్లు వలె నుండవు. వీనిలోను పోతు చెట్లు ఆడు చెట్లు గలవు. ఇవి నూరు, నూట యిరువది అడుగు లెత్తు పెరుగుతు. అరటి మొక్కల మొదట పిలకలు మొలచినట్లు ఆరేండ్లు మొదలు పదునారేండ్లు వచ్చు వరకు నీ చెట్ల మొదట కూడ చిన్న చిన్నమొక్కలు మొలచును. ఈ చిన్న మొక్కలను దీసి పాతియే ఖర్జూరపు చెట్లను పెంచెదరు. గింజలనుండి కూడ మొక్కలు మొలచును గాని, అవి మొలచి పెద్దవగునంత కాలము ఓపికతో వేసి యున్నను, ఆమొక్కలు పోతుచెట్ల యినచోప్రయోజనమేమియు లేదు. అది గాక, ఆడ చెట్ల యినను గింజల నుండి మొలచిన చెట్ల కంటె చిన్న పిలకలనుండి పెరిగిన చెట్లు ఎక్కువ కాయును. ఈ చిన్నమొక్కలను జాగ్రతగా దీసి 25 అడుగుల దూర దూరమున మూడేసి అడుగుల గోయి దీసి వానిలో తెలక పిండిని యితర ఎరువులు వేసి పాతెదరు. పాతిన మొదటి నెల ప్రతి దినమును, రెండవ నెల వారమునకు రెండు సారులును తరువాత నెలకొక మారును నీరు పోయు చుండ వలెను. అవి పాతిన మొదటిసంవత్సరములో వర్షాకాలము నం