నలువది యొకటవ ప్రకరణము
303
జలపూరితములాయెను. కాని అతఁ డంత స్తంభన మాచ
రించెను.
అయ్యా ! మీరు చెప్పకయున్న నే నాగఁజాలను. . కరుణింపుడు.' అనెను.
ఆ యోగి మెల్లగా నిట్లనెను.
మీరిపురెవరికొఱకు నిరీక్షించుచున్నారో అతఁడే యితఁడు
బుద్ధి సాగరులా మీరు ? ”
'అవును ” అనెను.
ఆ ముదుసలి చక్రవర్తి కండ్ల నీరు గ్రమ్మెను. ఆనం దముదుఃఖము — పశ్చాత్తాపము అతని ముఖమున వ్యక్త ము లగుచుండెను. అతఁడేడ్చెను. “ నన్ను క్షమింపుడు ' అని యొక నమస్కారముం జేసెను. వలదని బుద్ధిసాగరుఁడు వారిం చెను. "కొని యతడు వినలేదు. ఇట్ల నెను.
“అయ్యా ! విశ్వాస ద్రోహిని. పాపాత్ముఁడను. నేను
సుప్రసిద్ధ మగు విజయనగర సామ్రాజ్యమును నా చేతిలోఁ బాడు
చేసితిని. మీ వంటి విశ్వాస పాత్రులగు మంత్రివరుని మాటలను
జెవింబెట్టసయితిని.
నాయుత్కృష్ట సామ్రాజ్యముం జూచుకొని గర్వించితిని. ఆదిల్ శాహాను సమ్మతిని.._చక్రధరుని నమ్మితిని- తత్సమునెల్ల ననుభవించితిని.