304
విజయనగర సామ్రాజ్యము
నాఁడు సభా భవనమున మీరు చెప్పిన వాక్యరత్నము లెల్ల వేదాక్షరములు. అవి జరిగితీరినవి. గతించిన వెన్క జింతించిన నేమి ప్రయోజనము !
విజయ నగరమువంటి విస్తీర్ణితం గాంచిన సుప్రసిద్ధ
సామ్రాజ్యమును ధ్వంసము చేసినందులకు నన్నెంతగా భవిష్య
దాంద్రులును, భారతీయులును దూషింతురోగదా?
నిశ్చయముగా — నే నందులకుం బాత్రుఁడను.
ఏ నాఁడు నిసుమంత కష్టములను సనుభవించి యెఱుం
గని నా సామ్రాజ్య ప్రజలే నె కష్టముల నందుదురో కదా !
దైవమా ! ఎంతటి విపత్తులం దెచ్చి బెట్టితివి ? తురు
ష్కుల పేరునే విసని నా సామ్రాజ్య ప్రజ లింక నేమగుదురో !
అయ్యో ! విజయనగర పట్టణము "నేగతి "నేమగునో ?
ఆ మహా నగరము నాశమందవలసిన దేనా ?
చీ ! ఈ తుచ్ఛ ప్రాణమును విడిచెదను. పోయివచ్చె దన'. నాతప్పులను మన్నించి నను రక్షింపుము.' అని కడసారి బుద్ధిసాగరుం బ్రార్థించెను.
“దేవా ! ఏ చింతించెదరు! . నన్నేల స్తుతించెదరు?
నావిధిని నేను నెరవేర్చితిని. కాని ఎక్కువ నేనేమియుం జేసి
యుండలేదు. సామ్రాజ్యములు సంచుట వృద్ధి చెందుట
ఈశ్వర సంకల్పము ననుసరించియుండును. అది మన వశము
కాదు అని చెప్పుచుండెను. కానీ రామరాజ చక్రవర్తి యింక వినం