ఈ పుట అచ్చుదిద్దబడ్డది
102
విజయనగర సామ్రాజ్యము
పక్షుల రొదయై యుండునని తీర్మానించుకొనిరి. నిశ్శంకగాఁ
దమతమ త్రోవలంబట్టిరి. జగమెల్ల నాయర్ధ రాత్రమునఁ గాఱు
చీకట్లు క్రమ్మెను. కాని యాచీకట్లలోఁ జక్రధరుని మొగము
కళకళలాడఁజొచ్చెను. దానికిప్పుడు నూత్న వికాసము .కలినది.
ఆ వికాస మతనికిఁ క్రొత్తయందముంగల్గించెను. అది నన విక
సీత పద్మమువలె శోభించుచుండెను. ఆ సోయగము నాకటిక
చీకటిలోఁ దారానాధుఁడు కాని యాదిల్శాహాకాని, చూడ
లేదు. కాని యతఁడు తనలో.. దానిట్లనుకొనెను.
- ఆహా ! నేటి కాలమునకు బుద్ధిసాగరుని జంపు నుపా
యముం గాంచితిని."