పుట:Venoba-Bhudanavudyamamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13

(1) వ్యవసాయ కూలీలకు ధాన్యరూపములో కూలియివ్వబడవలెను.

(2) వ్యక్తికి 16 గజముల బట్ట అవసరమై వుండ, మిల్లులు 11 గజముల కన్న అధికముగా వుత్పత్తిచేయలేవుగాన, ప్రభుత్వము ఖాదీ పరిశ్రమను స్వయముగా నిర్వహించవలెను.

మూడవ దినము ఆర్థిక సమానత గురించి మాట్లాడిరి. ప్రాచీనకాలము నుండి భారతదేశము తన విశిష్టగుణమైన "దయ"ను పెంపొందించుకొనుచున్నదని, మనకర్తవ్యము 'దయ' అని మన ఆశయం 'సమానత' అని. మనదేశ చరిత్ర మనకు నేర్పించినదని అన్నారు. వాస్తవమైన 'దయ' స్వచ్ఛమైన సమానతలోనే వుందని గ్రహించాలి. ఈమానతను సర్వ సమానంగా పెంపొందించుటలో వివేకము, దూరదృష్టి అవసరమని, యిది ఒకేదినములో సమకూడే విషయం కాదని క్రమక్రమంగా దీనిని సాధించాలని తెల్పినారు. సూర్యనారాయణుని వుదహరించుచు, వారివలె కార్యకర్తలు స్వయముగా వుత్తమోత్తమమైన అధర్మమును పాటించుచు, సమానత పీఠమునకు ఆత్మార్పణ మొనర్చినకాని సామాన్య ప్రజలకు నిజమైన సమానతచూపలేరని అన్నారు.

ఆఖరి దినము నిర్మాణకార్యకర్తలు రాజకీయములలో ఎంతవరకు పొల్గొనవచ్చుననే విషయముపై తీవ్రమైన చర్చలు జరిగెను, వినోబాజీ, తమ అభిప్రాయమును తామే పాటించుచు, యితరులపై దానిని బలవంతముగ రుద్ద కుండుటకే పరమేశ్వరుని తాము ప్రార్థించుచున్నామని అన్నారు తనకర్తవ్యము ప్రజలకు భోదించువరకేనని, కార్యాచరణలోవారికి పూర్తి స్వాతంత్యముకలదని తెల్పిరి. తామునూచించిన పంచసూత్రములను, అంతఃశుద్ది, బహిర్శుద్ది. శాంతిసమర్పణం, శ్రమ, అనుమాటలలో యిమిడ్చిరి. త్రికరణ శుద్దిగా వీనిని ఆచరించవలెనని కార్యకర్తలను కోరిరి.

వార్ధాకు చేరుటకు పూర్వము కమ్యునిష్టులు నడపిన వుద్యమప్రదేశం ఆంధకారములో మునిగి ప్రజలు అంశాతిలోనున్న తెలంగాణాలో పర్యటించుటకు నిశ్చయించుకొనినట్లు వినోబాజీ తెల్పిరి. వారి హృదయాంతరళములోనున్నది, భవిష్యత్తు తెలియకపోయినపుటికి, ఆచ్చటచేరిన వారెల్లరు వినోబాజీ ముఖములో దివ్యతేజస్సును దర్శించగల్గిరి.

3

హిందూదేశములోని జనసామాన్యములోనున్న ఘోరమైన, విచార