71
మనోహర్ లాల్ పూరీగారును) ఒక నిందితుని పట్టుకొనుటకై
గృహశోధన చేయుటకై మైసరమునకు వెళ్ళితిమి. నిందితుడు దొరకక
పోయెను. కాని వాని యింటి శోధన మొదలు పెట్టితిమి ఆసమయములో
(మైసరము పల్లములోని) సీపాయీలు ఏదోవిధముగా మాకు యిబ్బందులు
కల్పింప మొదలిడిరి. మా పని పూర్తి కాకముందే మాకు నిందితుని
జాడలు తెలిపిన వాడు మావద్దకు వచ్చెను. వానిని సిపాయీలు చుట్టి
వేసి తిరుగుబాటునకు సంసిద్ధు లైరి, ఆసమయమున మొహతెమోంగారు
సిపాయీల ఆఫీసర్లను పిలిచిరి. మరియు జాడలు తెలిపిన వాని చుట్టును
పోలీసు వారిని నిలబెట్టిరి. సీపాయీలకు బుద్ది చెప్పుటకు మొదలు పెట్టిరి.
ఒక అర్దగంట సేపీ ప్రకారము వారిని సమధాన పెట్టి వానిని రక్షించుకొని
బయటకు తీసికొని వచ్చిరి. వేంకట రామా రెడ్డిగారు ఆనాడు ధైర్యముతో,
ఆలోచనతో గండము తప్పించిరి. ఆనాడు యెన్ని యోప్రాణములు
నాశనమై యుండెడివి...
.
. వేంకట రామా రెడ్డి గారు జిల్లా మొహతీమీంగా నుండిన కాలమం దే జర్మనీ యువ రాజుగారు హైదరాబాదు నగరమునకు వచ్చిరి. వారు వేటకై వెళ్లినప్పుడు రెడ్డిగారు వారి వెంటనుండి ఏర్పాటులలో సాయపడినారు.