124
నిని మంచి స్థితిలోకి దెచ్చిరి. ఇప్పుడది ఒక పాలక వర్గముచే పరిపా లింప బడుచున్నది.
(17) శ్రీ ప్రభువుగారి బంధువర్గములో చేసినట్టి పూర్వ నిజాముల సంతతివారు చాలమంది అప్పులపాలైరి. వారి అప్పులను తీర్చుచేయుటకై సాహెబ్జాదాల అప్పుల విచారణ సంఘమునొక దానిని శ్రీ ప్రభువు గారుఏర్పాటు చేసిరి.
దానికి అధ్యక్షులుగా శ్రీ రాజా మేకటరామారెడ్డి గారు నియమింపబడిరి. ప్రభు బంధువుల అప్పులను సుమారు నాలుగు లక్ష లవరకు పరిష్కరించి గొప్ప సహాయముచేసిరి.
(18). అవసరము కొలది ప్రత్యేకమగు కొన్ని కేసులను . విచారించుటకు రెడ్డిగారు పలుమారు స్పెషల్ కమిషనులలో నియుక్తులై పనిచేసిరి.
(19) మూడు నాలు గేండ్ల క్రిందట మద్యపాన నిషేధ సంఘమును ప్రభుత్వము వా రేర్పాటు చేసిరి. ఈ సంఘమునకు సవాబు మిర్జాయార్జంగు బహద్దరుగారు అధ్యక్షులు. ఈ సంఘములో శ్రీ రెడ్డిగారు ముఖ్యసభ్యులు.
(20) వ్యవసాయాభివృద్ధి సంఘములో సభ్యులై మంచికోళ్ళు పెంచిన వారికిని, మంచి ఫలముల పండించిన పొరికిని బహుమతు లిప్పించుటలో శ్రద్ధవహించినారు.