పుట:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

91


తోమాట్లాడి విషయములు తెలిపి ఆజ్ఞలుపొందు చుండిరి. ఇట్లు రాత్రిం బగళ్లును కష్టపడిన అధికారి మొత్తము నిజాం రాష్ట్రమంతటను వీరొక్కరే కానవచ్చుచున్నారు.


వీరి కాలములోనే లార్డు రీడింగుగారు హైద్రాబాదునకు వచ్చిరి. వీరు తమ కచ్చేరీలో “వైస్రాయశాఖ" అను నదొకటి' ప్రత్యేకముగా వైస్రాయిగారు వచ్చుటకు మూడు నాలుగు మాసములకు ముందే ఏర్పాటు చేసి, తగు కట్టుదిట్టములు చేసినారు. వైసాయిగారికి గాని, ప్రజలకుగాని ఏయిబ్బందులును కలుగకుండునట్లుగా ఏర్పాటు చేయుటలో వీరి చాకచక్యము, దూదృష్టి, నేర్పరితనము, సువ్యక్తమగు చున్నది. సాధారణముగా వైస్రాయిగారి వంటివారు నగరమునకు వచ్చిన ప్రజల కిబ్బంది కలుగును. గంటలకొలది వైస్రాయి గారు పోఫు వీధులలో పోలీసువారు నిలిచి ఆబాటలలో, జనులు కాని, బండ్లు, మోటారులు గాని పోకుండునట్లుగా నిరోధించుట వాడుకయై యుండెను. అట్లు చేయుటచేత ప్రజలకును, వ్యాపారస్థులకును, వ్యవహారస్థులకును నష్ట కష్టములు సంభవిం చెడివి. అట్టి వేవియు సంభవింపకుండు నటల కొత్వాలుగారు ఏర్పాట్లు చేసినారు. వైస్రాయిగారు వచ్చిరి. అన్నియు సవ్యముగా జరిగినవి. వారు సురక్షితముగా వెళ్లిపోయిరి.