92
ఇదే కాలములో వేల్సు యువ రాజు గారుము 5 వ జార్జిచక్రవర్తి గారి పెద్ద కుమారులును అగు యెడ్వర్డు యువ రాజు గారు హిందూస్థానమునకు విచ్చేసిరి. హిందూస్తానములో సహాయ నిరాకరణోద్యమము ప్రచండముగా జరుగుచుండి సందున యున రాజు గారు వచ్చుట కిది సమయము కాదని కూడ గాంధీ గారు తెలిపియుండిరి. అట్లు తెలిపినను వారు రానే వచ్చిరి. పెద్ద పెద్ద నగరాలలో హార్తాలులు జరిగెను. వీధులు నిర్మానుష్యమయ్యెను. ఇండ్లపై సల్ల జండా లెగురుచుండెను. కొన్ని తావులందు వీధులలో కలహములు జరిగెను. కొంత ప్రాణనష్టముకూడ కలిగెను. యువరాజు గారి కార్య క్రమములో 'హైదరాబాదునకు వచ్చుటయు మఖ్య మైనదిగా నుండెను.
యువరాజు గారు ఇంకొక సంవత్సరమునకు హిందూ స్థానమునకు రానున్న వారని వేంకట రామారెడ్డి గారికి తెలియగా వారు తప్పకుండ 'హైద్రాబాదు నగరానికి రాగల రనియు, వారితో మాట్లాడు నవసర మేర్పడుననియు ఊహించుకున్నారు. ఊహ సరియైనదిగానే యుండెను. వారు వెంటనే తమ అరువద వయేట ఆరేండ్ల బాలునివలె ఇంగ్లీషు విద్యా భ్యాసమును 'మొదలు పెట్టిరి. తాము ఉద్యోగములో ప్రవేశించిన కొలది కాలము తర్వాత - అనగా తమ యిరువదవయేట