పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/849

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాహిత్యంలో చంద్రుడు

"వెండిగిన్నెల్లోన వెన్న పెట్టుకొని, పమిడి గిన్నెల్లో పాలు పోసుకొనీ, తేరుమీదా రానె తేనెపట్టూ తేనె, కొండమీదా రావె కోటిగిన్నె తేవే, చందమామా రావె జాబిల్లి రావె - "

అని తన కోసమూ, తమ్ముడి కోసమూ, ఆకాశవీధిలో నిత్యయాత్ర చేసే చంద్రుణ్ణి తెలుగు ఆడబిడ్డ అనాదినుంచీ ఆహ్వానిస్తూనే ఉన్నది. అయితే చందమామ తెలుగు బిడ్డలకు ఏ నాటి మామ? ఎలా మామ? - జగదేకమాత లక్ష్మీదేవితోబాటు క్షీరసముద్ర గర్భాన జన్మించటం వల్లనేనా అతడు మామ?

"స్త్రీలకు నేనంటే ప్రీతి. జానపద పదాలు పాడుకుంటూ నా వెన్నెట్లో వాళ్ళు రాటం త్రిప్పి నూలు వడుకుతుంటారు”; “నేను వెలుతురు నీకివ్వకపోతే నీకు బ్రతుకే లేదు" అని సూర్యచంద్రులిద్దరూ ఒకరినొకరు ఎద్దేవా చేసుకుంటారు. సూర్యుడు చంద్రముఖాన ఇసుక చల్లుతాడు. ఆమె ముఖాన మచ్చలు ఏర్పడతవి. కొంతకాలానికి సంధి కుదిరి ఇద్దరూ పెళ్ళి చేసుకుంటే సంతానం కలిగింది. మళ్ళీ మనఃస్పర్ధలు. చంద్ర సూర్యుడికి విడాకులిచ్చి ఇంట్లో నుంచి లేచిపోయి బిడ్డలను ముక్కలు ముక్కలుగా చేసి పైకి విసురుతుంది. ఆకాశంలోకి వెళ్ళినవన్నీ నక్షత్రాలూ, నేలమీద పడ్డవి జలచరాలూ, జంతువులూ అయినవి. - ఇవి ఫిలిప్పైన్ జాతివారి సూర్యచంద్ర కథనంలో ముఖ్యాంశాలు.

నీగ్రోజాతి పుక్కిటి పురాణాల్లో సూర్యచంద్ర లిద్దరూ స్త్రీ మూర్తులు. అన్యోన్యం వారి సంతానాన్ని చంపుకొని తినటానికి సంధి చేసుకున్నారు. దానికి విరుద్ధంగా చంద్ర సంతానాన్ని సూర్య కంటికి కనబడకుండా పగలు దాచిపెట్టి, రాత్రిళ్ళు బయటకు తీసుకోవస్తుంది. వాళ్ళే నక్షత్రాలు.

ఆదియుగంలో సూర్యుడు భూమి మీదనే నివాసం చేస్తుంటే 'టిట్రరే' అనే రేచుక్క వెంబడించి అతణ్ణి మింగేస్తుంది. అతని ఎముక ఒకటి ఆకాశంలోకి ఎగిరి “కొడవలి”