పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిద్రావైచిత్రి



అది యాముక్తమాల్యద పాఠము. నాకు వెళ్ళి నిదుర వచ్చుచున్నది. సర్వావయవము లనెడి సంకెలలనుండి జారుచు నే నెటకుఁ బోవుచున్నాఁడనో నాకె యెఱుక లేకుండెను. 98[1]శ్రీకుప్పయాచార్యులవారు పాఠమునాపి కుదురైన గొంతుకతో 'నిద్రాదేవత నిన్నుఁ బూనెఁ గదరా నిర్భాగ్యదామోదరా!' అను పద్యపాదమును ఘనజటవైచి చదువుచుండ మిత్రుడు నన్నుఁ దట్టి మేల్కొల్పినాఁడు. మఱియొక సహాధ్యాయి నేఁ దెప్పరిలి స్వస్థితికి వచ్చునంతలో నాచార్యులవారిని "ఆర్యా! నిద్రకును నొక దేవత యున్నదా?” యని వినయముతోఁ బ్రశ్నించినాఁడు. ఆ దొడ్డపండితుఁడు "ఔను. జ్యేష్ఠాదేవి అలక్ష్మి... జగదేక మాతకు జ్యేష్ఠభగిని" యని సమాధానము చెప్పినారు. నిదుర మబ్బులు నన్నుఁ బూర్తిగ విడిపోయినవి.

సహపాఠి మఱల నాచార్యులవారిని జ్యేష్ఠాదేవి రూపాదికమును గూర్చి ప్రశ్నింప వారు 'అలక్ష్మీం స్వం కురూపాసి కుత్సిత స్థానవాసినీ... అలక్ష్మీం కృష్ణవర్ణాం, ద్విభుజాం కృష్ణ వస్త్రవరిధానం లౌహాభరణ భూషితాం శర్కరా చందన చర్చితాం గృహసమ్మార్జనీహస్తాం, గర్దభారూఢాం, కలహ ప్రియాం' అని యేమేమో పఠించుచు నాపై దృష్టి నిల్పుచు మందస్మిత మొనర్చినారు.

"ఏమీ దామోదరా! తామీలోకమునకుఁ దిరిగి వచ్చినట్లేనా?” అను వారి ప్రశ్న కవనత శిరస్కుఁడనుగాక ప్రౌఢముగ బ్రతిస్మిత మొనర్చి 'ఇట దామోదర శబ్దాచిత్య మేమియో సెలవిం’ డని వారిని వేడుకొంటిని. వారొక చిరునవ్వుతో నా చిలిపితనమును గమనించి ‘ఉదరే దామ యస్యేతి దామోదరః' యశోద మృద్భక్షణ మొనర్చిన బాలకృష్ణుని నడుమున బలుపుతోఁ గట్టినది కనుక దామోదరుఁడైనాఁడు. మన్నుఁ దీనినట్లు నిద్రనోవు మిమ్ము నిద్రాదేవత పాశబద్ధులఁ గావించుటచే మీరును దామోదరులే!” అని సెలవిచ్చినారు. ఆ నాఁడు భారతీయులు నిద్రకు నొక దేవతను సృష్టించుకొని నారని నాకుఁ దెలిసినది.

ప్రాచీన కాలమున బాబిలోనియను జాతివారు నిద్రపట్టకున్న 'లోహర్' అను

నిద్రాదేవతను బూజింతు రనియు, నేఁటి 99[2]ఫిన్నిష్' జాతివారికి 'ఉని' యను నిద్రా
  1. 98.శ్రీ కుప్పయాచార్యులవారు - పూర్వము ఆంధ్ర క్రైస్తవ కళాశాలా సంస్కృతాంధ్ర భాషా పండితులు,
  2. 99. ఫిన్నిష్ జాతి - యూరప్ నందలి ఫిన్లాండు దేశవాసులు

____________________________________________________________________________________________________

58

వావిలాల సోమయాజులు సాహిత్యం-4