పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అన్న పదం వలన అర్థమౌతున్నది. ఈ నాగులు మందేహరాక్షసులనీ, బ్రాహ్మణుల మంత్రజలాలవల్ల వారు తొలగిపోతారని ప్రమాణాలు కనిపిస్తున్నవి.

సమస్త జగదాధారభూతుడైన ఆదిత్యుణ్ణి భారతీయులు 'జోక్య సూర్యం దృశే బుద్ధితో పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం నందామ శరదశ్శతం మోదామ శరదశ్శతం, భవామ శరదశ్శతం, శ్రుణునామ శరదశ్శతం ప్రబ్రవామ శరదశ్శతం మజీతాస్స్యామ శరదశ్శతం మణభావాలకు ప్రబ్రవామ శరదశ్శత మజీతాస్స్యామ శరదశ్శతం' అని అర్థిస్తుంటారు. ఆయన్నే పరమాత్మ స్వరూపుణ్ణిగా ధ్యానిస్తారు. 'ఉద్యన్త మస్తంయన్త మాదిత్య మభిధ్యాయన్ కుర్వ నాహ్మణో విద్వాన్ సకలం భద్ర మశ్నుతే' (ఉదయాస్తమయాలు కలిగి స్వయం ప్రకాశం గల సూర్యుని ధ్యానం చేస్తూ, ప్రదక్షిణం చేస్తూ ఈ సూర్యుడే భగవంతునిగా ఎరిగిన జ్ఞాని సకల శుభాలనూ పొందుతాడు.) అన్న శ్రుతి ప్రమాణాన్ని శిరసా వహిస్తారు.

అడుగో - ఆదికవి; ద్రష్ట - ‘చిరుసాన బట్టించి చికిలి వేయించిన గండ్రగొడ్డలి నిశాగహనలతకు, గార్కొన్న నిబిడాంధకారధారాచ్ఛటా సత్రవాటికి వీతిహోత్రజిహ్వ, నక్షత్రకుముదకాననము గిల్లెడు బోటి ప్రాచీ నెత్తిన హస్తపల్లవాగ్ర, మరసి మింటికి మంటికైక్య సందేహంబు బరిహరింపంగ బాల్పడ్డ యవధి, సీ. తే.గీ. సృష్టి కట్టఱ్ఱ తొలుసంజ చెలిమికాడు, కుంటు వినతామహాదేవి కొడుకుగుఱ్ఱ, సవితృసారథి కట్టెర్రచాయ దెలుప నరుణుడుదయించె ప్రాగ్దిశాభ్యంతరమున. ' 354 - ఆంధ్రపతిక్ర - 1949 జనవరి 12 వావిలాల సోమయాజులు సాహిత్యం-4