పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'చిక్క దేవరాయ విలాస'మనే గేయ ప్రబంధాన్నీ వ్రాసినట్లు తెలుస్తున్నది. (తంజావూరు తాళపత్ర గ్రంథావళి నం. 520 Madras Oriental Manuscripts - Catalogue iii)

క్రీ.శ. 1676 తరువాత తంజావూరును పాలించిన మహారాష్ట్ర నాయకులు ఆంధ్రనాయకుల అడుగుజాడల్లో నడిచి యక్షగాన రచన చేశారు. కవితను పోషించారు. వారిలో 'షాజీ' ప్రముఖుడు. ఆస్థానకవులలో 'గిరి రాజకవి' ముఖ్యుడు. తంజావూరు మహారాష్ట్రులలో ప్రతాప సింహుని కాలంలో ముద్దు పళని సంగీత సాహిత్యనిధి తాతాచార్య శిష్య. ఆమె గోదాదేవి వ్రాసిన తిరుప్పావును 10 సప్తపదులుగా తెలుగులోకి పరివర్తన చేసింది. క్రీ.శ. 1793-1832లలో తంజావూరును పాలించిన శరభోజి కాలంలో త్యాగబ్రహ్మ జన్మించి 'నాదధేనువు'ను పిండి నవనీత మొలికించాడు. తెలుగుభాషను దాక్షిణాత్య సంగీత ప్రపంచానికి ఏకైక భాషగా తీర్చిదిద్దిన మహానుభావుడు త్యాగరాజస్వామి. కర్ణాటక సంగీత ప్రపంచంలో 'రసత్రయ'మని ప్రసిద్ధి వహించిన ముగ్గురిలో త్యాగయ్య. శ్యామశాస్త్రులిద్దరూ ఆంధ్రులే. శ్యామశాస్త్రి కుమారుడు సుబ్బరామదీక్షితులు, శిష్యులు పట్నం సుబ్రహ్మణ్యం, ముత్తు స్వామి దీక్షితులు, చిన్న స్వామి దీక్షితులు మొదలైన విద్వాంసులు ములికినాటి ఆంధ్రులు. ఈ సందర్భంలో సావేరిరాగాన్ని 8 గంటలు ఆలాపన చేసిన పల్లవి శేషయ్యను పేర్కొనుట సమంజసము.

కృష్ణరాయల కాలంలో నామమాత్రంగా వినబడుతున్న కొరవంజికి విశేష గౌరవమిచ్చి మహారాష్ట్రులు ప్రచారం చేశారు. జనసామాన్యానికి ఆధ్యాత్మిక విద్య 'జీవనాటకము' వంటి యక్షగానాల ద్వారా నేర్పటానికి యత్నించినట్లు వ్యక్తమగుచున్నది. ఈ కాలంలో పుట్టిన 'త్యాగరాజవినోద చిత్ర ప్రబంధనాటకం' అతిచిత్రమైనది. పాత్రోచితమైన భాష విచిత్రంగా సంస్కృతము, అరవము, మహారాష్ట్రము, తెలుగు కన్నడములలో ఉండేదిట. స్వర సాహిత్యము, జతులు, కీర్తనలు, జావళులు, యక్షగానాలూ ఈ కాలంలో లెక్కకు మిక్కిలిగా పుట్టినవి'

విజయనగర పతనానంతరం దక్షిణ దేశానికి వలసపోని కవులనూ, గాయకులనూ, నటకులనూ, వెంకటగిరి, విజయనగరము, పిఠాపురము మొదలైన సంస్థానాధిపతులు పోషించారు. కూచిపూడి వారు భరతశాస్త్రానికి పెట్టినది పేరై నేటివరకూ మధ్యాంధ్రంలో ఖ్యాతి గడించారు. వేములపల్లెవారు, ధర్మవరంవారు ఒక్కొక్క ప్రత్యేకతతో యక్షగానరచన చేశారు.

సంస్కృతి 329