పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

వాసిష్ఠరామాయణము

మొదలైన సంపదల్-ముందుగా సౌఖ్య
మిది యనిపించి దా-హెచ్చి, పిమ్మటను
మదమును బుట్టించి-మాయాబ్ది ముంచు;
నదిగాక దేహేంద్రి-యాదిభోగములు
ఆదియం దమృతమ-ట్లానంద మిచ్చి,
యాదట గరళమై-యతిఖేద మిచ్చు;
ఘసవిరాగము తొల్తఁ-గష్టమై తోఁచి,
యనుపమానానంద-మై యుండుఁ దుదను;
ఇది సుఖమో? లేక-యింద్రియభోగ
మది సుఖమో? దెల్పుఁ డరమర మాని,220
నావావిధంబుల-నాకుఁ జూచినను
జ్ఞాన వైరాగ్య భా-స్వరచింతనమున
నిఖిల భోగములను-నిరసించు సరణి
సుఖమిచ్చునంచుఁ దోఁ-చుచు నున్నదిప్పుడు
తక్కిన యాశాస్ప-దంబు లన్నియును
గ్రక్కున లేని దుః-ఖము నిచ్చు నెట్ల
నన్నను విత్తంబు-నాశచేఁ గూర్చి
యున్నవాఁ డేవేళ-నులుకు నేలనిన230
ధరను తా దాఁచిన-ద్రవ్యమెందున్న
బొరినిఁ జోరకులును,-భూమీశ్వరులును,
మొదలైన పగతు లి-మ్ముగఁ [1]బొంచి మించి
పొదివి యెక్కడఁ గొని-పోదురో? యనుచు


  1. బొంచి పాంచి వా.