ఈ పుట ఆమోదించబడ్డది
ఆదిప్రకరణము
11
నట్టి చందము మాని-యార్తిఁ బొందితివి;
ఇట్టి మనోవ్యథ-యేల జనించె?'
నని పెక్కువిధముల-నమ్మునీశ్వరుఁడు
నెనరుతో నడుగగా, - నృపనందనుండు200
మరల నంజలిఁ జేసి - మౌని నీక్షించి
కరఁగుచు గద్గద-కంఠుఁడై పలికె:
రాముని నిర్వేదము
'మునినాథ! యీ లోకమున మర్త్య వితతి
జనియించుటెల్లను - చచ్చుట కొఱకె,
చచ్చు టెల్లను మళ్లి-జనియించుకొఱకె,
హెచ్చుగా నిలుచుట- [1]కిర వెందు లేదు.
అన్ని యస్థిరములై-నట్టి చందంబు
మున్నుగాఁ దెలిసియు-మూర్ఖత్వ మెసఁగ
మది రాజ్యసుఖమందు-మల్లాడఁబోవు,
నదిమి నిల్పిన నిల్వ, -దాశతోఁ గూడి210
యొక్కచోటను నిల్వ - కుఱుకుచునుండుఁ,
జిక్కఁబట్టినఁ గాని - చెనఁటియై జరుగు,
నిట్టి మదిని నిల్పు-టె? ట్లని చింత
పుట్టిన, దిదిగాక - భూరి రాజ్యంబు
- ↑ స్థిరమెందు లేదు. వా