పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/331

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

298

వాసిష్ఠరామాయణము

విని యమరగురుండు - వేడ్క ని ట్లనియె:
'అనఘ! యహంకార - మాకాశమందుఁ

బుట్టు తోయదమట్లు - పొడము, నణంగు,
నట్టి మిథ్యారూప-మగు నహంకృతిని

నజ్ఞులు నిజముగా - ననుసరింపుదురు;
ప్రాజ్ఞుల కది వట్టి - భ్రాంతిగాఁ దోఁచి 100

విడిచిన, మాయ తా - విరిసి నశించు.
నడరఁగా నీవు, నే - నను ద్వైతబుద్ధి

మెఱసి, పిమ్మట నదే - మిథ్యయై పోవు.
నఱిముఱి స్వప్నంబు - లన్ని నశ్యములు:

కావున దిగ్దేశ. - కాల, కర్మములు
పోవఁగా నంతట • పూర్ణమై, పైన

మిగిలిన సద్రూప - మేనె యటంచు
జగదతీతంబై ప్ర-శాంతినిఁ బొందు

మపుడు సర్వత్యాగ-మగు నీ' కటంచు
సుపదేశ మిచ్చిన, - నూహించి కచుఁడు 110

సర్వశాంతినిఁ బొంది, - సచ్చిదానంద
నిర్వాణపద మందె - నిలిచె' నటంచుఁ

బావనంబగు కచో-పాఖ్యాన సరణి
నావసిష్ఠమునీంద్రుఁ - డా రాఘవువకు

వినిపించి, కల్పిత - విశ్వచిత్రంబు
మనమున భావించి - మరల ని ట్లనియె:
'
రామ! విచారింప - రమణీయ మగుచు
నామహానీయ చి-దానంద మొదవుఁ,