పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థ ప్రకరణము

293

తన శిష్యుఁడగు భర-ద్వాజ సంయమికి
వినిపించెఁ దత్కథ విశదంబుగాను.

ప్రకరణాంతద్విపడ



ఇది సోమనాథ వి-శ్వేశ్వరస్వామి
పదపద్మ భక్త సు-బ్రహ్మణ్య యోగి

చరణాంబుజాత ష-ట్చరణాయమాన
పరిపూర్ణ నిత్యస -ద్భావ నిమగ్న

మానసాంబుజ వెంగ-మాంబికా రచిత
మై, నిత్యమై, సత్య-మై ధన్యమైన 2140

సామార్థ సార సు-జ్ఞాన వాసిష్ఠ
రామాయణం బను - రమ్యసద్ద్విపద

యందు నెన్నఁ జతుర్థ-మగు ప్రకరణము.
అందమై విమల మో-క్షాకరం బగుచు

శ్రీ తరిగొండ నృ-సింహుంనంగ
ఖ్యాతిగా వెలయు వేం-కటరాయ ! నీదు

పదయుగళకి సమ-ర్పణమయ్యె, దీని
సదమలులై వ్రాసి - చదివిన, వినిన

నరులు తాపత్రయా-ర్ణవము తరించి,
పరమైన నిర్వాణ-పదము నొందుదురు;- 2150

భూచక్రమున నిది - పురుషార్ధ మగుచు
నాచంద్ర తారార్క -మై యుండుఁ గాత!

చతుర్ధప్రకరణము సమాప్తము