294
వాసిష్ఠరామాయణము
పంచమప్రకరణము
శ్రీ తారకోల్లాస - శేషాద్రివాస!
శ్రీ తరిగొండ సృ-సింహ! ధూతాంహ!
విన్నవించెద నది - వినుము వాల్మీకి
క్రన్నన చూడాల - కథ తెల్పఁగాను
తగవిని, యాభర - ద్వాజుండు మరల
నగణిత భక్తి ని -ట్లనె 'గురుస్వామి!
సురుచిరాత్ముఁడు వసి-ష్ణుఁడు రాఘవునకుఁ
జిరకృపన్ మఱి యేమి చెప్పె' నటంచు
నడుగ భరద్వాజు - నమ్ముని చూచి
యడరిన కరుణ ని-ట్లని చెప్పఁదొడఁగె 10
'ఆ వసిష్ఠుండు రా-మావనీశ్వరుని
భావించి క్రమ్మఱఁ - బలికె ని ట్లనుచు
'ధరణీశ! వినుము చి-త్త త్యాగ సరణి
వెఱిఁగి సేయందగు - నీ యర్థమందు
ఫలితార్ధమగు కచో-పాఖ్యానమొకటి
కలదు, చెప్పెద రామ! - క్రమముగా వినుము!
కచోపాఖ్యానము
అనిమిష దేశికుం-డైనట్టి గురుని
తనయుండు కచుఁ డాత్మ-తత్త్వంబుఁ దెలియు
కొఱకు దండ్రికి మ్రొక్కి - కొంక కి ట్లనియె:
'నరులకు సంసృతి - నశియించు విధముఁ 20
దెలుపు' మన్నను సుర - దేశికుం డనియె:
'వలనుగా వినుము స-ర్వ వివర్జనంబు