286
వాసిష్ఠరామాయణము
'సద్గురువర్య! మీ - సత్కటాక్షమున
జిద్గగనానంద - సీమలోఁ జేరి,
సారవిహీననం-సారాంతమైన
భూరివిశ్రాంతినిఁ - బొందితి' ననిన
విని కుంభుఁ డనియె 'సం-విత్సుఖం బిచట
ననుభవింపుచు నుండు' - మని యొప్పఁ జెప్పి,
చాల సంతోషించి, - చని నిజభూమి
లీల దీపింపఁ బా-లింపుచు నుండె 1980
నన విని రాముఁ డి-ట్లనె ' నో మునీంద్ర!
ఘనశాంతిఁ బొంది య-ఖండాత్మ నిష్ఠ
నొంది యున్నట్టి యా - యుర్వీశుబుద్ధిఁ
జెంది. సత్త్వగుణంబు - శేషించి నిలిచి
యుండెనే?' యని వేడ్క - నొప్పుగా నడుగ.
నిండిన దయ నాము-ని ప్రభుం డనియె:
'విను రఘురామ! యా-వృత్తాంత మెల్ల
నెనయు ప్రబోధకు - హేతువై, యవని
మనము సత్త్యైక నిమ-గ్నమై యుండు,
ననువొంద నట్టి మ-హాత్ముని తనువు' 1990
సమయకుండఁగ శివాం -శంబై ధరిత్రి
నమలమై జీవించు' - నని చెప్పి, మరలఁ
బలికె నిట్లని ' రామ-భద్ర! చూడాల
విలసిత చరితమే - విను మ దె టనినఁ