పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్థ ప్రకరణము

287

బతిని వీడ్కొని నిజ - పట్టణమందు
హితమొప్ప రాజ్యంబు - నేలుచునుండి,

మఱి కొన్నినాళ్ళ కా-మనుజేంద్రుఁ జూడ
ముఱిసి కుంభుని రూప-మునఁ బోయి, ఖిన్న

వదనంబుతోఁ దల-వాంచి ఖేదంబు
మదిలోఁ బెనంగొను - మాడ్కిఁ గన్నీరు 2000

వెడలుచునుండఁగా, • వేఁడి నిట్టూర్పు
వెడలఁగా నమ్మహీ-విభుచెంత నిలిచె,

నా రీతి నిలిచి యు-న్నటువంటి బ్రహ్మ
చారినిఁ జూచి యా-జననాథుఁడనియె:

'సదమలచరిత! యో , సద్గురుస్వామి!
ఇదియేమి? యీ క్లేశ - మెందుకు వచ్చె?'

ననినఁ గుంభుం డిట్టు-లనె జననాథ!
నినుఁ జూడ నిచటికి-నేఁ బ్రేమచేత

వచ్చుమార్గమున దు-ర్వాసుండు నాకు
హెచ్చు కోపంబుతో - నెదురేఁగు దెంచి, 2010

తరమిడి 'నిర్నిమి-త్తంబుగాఁ బగలు
పురుషుఁడవై న-టింపుచునుండు! రాత్రి

పొలఁతివై నీ వుండు - పొమ్ము! పొమ్మనుచు
ఛలముతో నిటు ఘోర - శాపంబు నిచ్చెఁ ,

గావున మదికి దుఃఖము పుట్టె' ననిన
భూవిభుఁ డనియె ' నో , పుణ్యాత్మ! నీవు