చతుర్థ ప్రకరణము
271
చలపత్వ మణఁగదు-శాంతి లభింప,
దపరిమితానంద-మబ్బదు గాన,
గురుని సంపాదించు-కొని కొల్చి, యతని
కరుణకుఁ బాత్రుఁడై-కడ తేరవలయు;
నటు సేయలేక దే-హాభిమానమునఁ
గుటిలాత్ముఁడగువాఁడు కొన కెక్కలేఁడు,
ఎలమి శాస్త్రజ్ఞాన-మెంతైన గురుఁడు
కలుగకున్నందునఁ -గడముట్ట కణఁగు'.
అని వసిష్ఠుడు మ-హాకృప మీఱ
మనుకులోత్తముఁ జూచి మరల ని ట్లనియె: 1630
అలకుంభరూపిణి-యైన చూడాల
వలనొప్పఁగా శిఖి-ధ్వజుని వీక్షించి,
'మొనసి సర్వత్యాగ-మును జేయు 'మనిన
జననాథఁ డా బ్రహ్మ-చారికి మ్రొక్కి,
యడర ని ట్లనె 'నో మ-హా గురుస్వామి!
పుడమి రాజ్యము, గృహం-బులు, భోగములను
విడిచి, యిల్లాలిని -విడిచి నేవచ్చి
యడవిలోఁ దప మిప్పు-డాచరించెదను,
ఇనకోటినిభతేజ! యిపుడింతకన్న
నెనయు సర్వత్యాగ-మెటువంటి?' దనినఁ 1640
గుంభుఁ డి ట్లనియె మ-క్కువ నీ తపంబు
దంభమే కాని, త-త్త్వజ్ఞాన మగువె?
ఒనర నన్నియు వీఁడి- యొంటిగా వచ్చి
వనవాసి వగుట స-ర్వత్యాగ మగునె?