270
వాసిష్ఠరామాయణము
వరరాజ్యమును వీడి - వచ్చు నీతోడ
వెఱవ కజ్ఞానంబు - వెంటనే వచ్చి,
జవనాథ ! కర్మవా-సన యనుఖాత
మున నిన్నుఁ బడఁ ద్రోసె-మోసంబు చేసి, 1600
పరఁగ నోదంబుపైఁ బఱచిన లతలు
దొరకను నీ తపో-దుఃఖంబు లగును,
అల కరిపరివార-మనుమానములును
వెలసిన నీమనో-వృత్తులే, మఱియుఁ
గరి కూలఁగాఁ బైనఁ గప్పిన దుమ్ము
నరయ నీకర్మ మో-హాంధకారంబు,
చలచిత్త! నీవిట్టి-సామజేంద్రంబు
చెలువున నూరకే- చెడితి వటంచు
నాగజోపాఖ్యాన-మా శిఖిధ్వజున
కా గుణశాలియై-నట్టి చూడాల 1610
పురుషాభిమానియౌ- భూపాలకునకుఁ
దరుణియై తాఁదెల్పు - తత్త్వార్థమందు
గుఱిని నిల్వఁ డటంచుఁ -గుంభాభిధాన
పురుషుఁడై జ్ఞాన మొ-ప్పఁగఁ జెప్పెననుచు
ముని రామునకుఁ జెప్పి-మోహం బడంచి,
మనము రంజిల్లఁగా - మరల ని ట్లనియె:
'వినురామ! యెంతటి-విద్వాంసుఁడైనఁ
దనియఁ దనంతనే- తత్త్వశాస్త్రములు
చదివి తపం బెంత-సల్పినఁగాని,
మది సంశయంబులు-మానవు, చిత్త 1620