పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

272

వాసిష్ఠరామాయణము

బడలినఁగాని త-పంబుపై నాశ
విడువలే వనుచు భూ-విభుని చెంగటనె

తా నుండి, యతని దు-స్తరతపశ్చరణ
మూని చూచుచునుండి - యొకకొన్ని నాళ్ళు

జరిగిన వెనుకఁ దాఁ-జాలిని బొంది,
యరమర లేక యి ట్లనియెఁ గుంభుండు: 1650

'ఓ మహారాజ! యీ-యుగ్రతపంబు
నీ మాడ్కిఁజేసి నీ వెంత[1] పెంచినను

నరయ సర్వత్యాగ-మబ్బదు నీకు
మఱియెట్టు లనిన నీ-మానసగ్రంథిఁ

దెగఁద్రెంచివైచి ము-క్తినిఁ బొందవలయుఁ;
దగు జగంబులకుఁ జి-త్తము బంధకంబు,

గాన దానిని ముందు-గా ద్రుంచితేని
దాన సర్వత్యాగ-ధన్యత నీకుఁ

గలుగు'నన్నను మహీ-కాంతుఁ డా కుంభు
నలర వీక్షించి యి-ట్లనియెఁ 'జిత్తంబు 1660

ఎట్టిది? దాని నే-నెటు తుంపవచ్చు?
నట్టి చందముఁ దెల్పుఁ' - డనినఁ గుంభుండు

పలికె నిట్లనుచు. 'నో-పార్థివాధీశ
యల వేదనాత్మ కా-హంకృతి చిత్త

బీజంబులోపల- బెరసిన రూప
బీజం బనఁగ నొప్పుఁ, - బెమపొంద దాని

  1. చచ్చినను-వేం.