ఈ పుట ఆమోదించబడ్డది
272
వాసిష్ఠరామాయణము
బడలినఁగాని త-పంబుపై నాశ
విడువలే వనుచు భూ-విభుని చెంగటనె
తా నుండి, యతని దు-స్తరతపశ్చరణ
మూని చూచుచునుండి - యొకకొన్ని నాళ్ళు
జరిగిన వెనుకఁ దాఁ-జాలిని బొంది,
యరమర లేక యి ట్లనియెఁ గుంభుండు: 1650
'ఓ మహారాజ! యీ-యుగ్రతపంబు
నీ మాడ్కిఁజేసి నీ వెంత[1] పెంచినను
నరయ సర్వత్యాగ-మబ్బదు నీకు
మఱియెట్టు లనిన నీ-మానసగ్రంథిఁ
దెగఁద్రెంచివైచి ము-క్తినిఁ బొందవలయుఁ;
దగు జగంబులకుఁ జి-త్తము బంధకంబు,
గాన దానిని ముందు-గా ద్రుంచితేని
దాన సర్వత్యాగ-ధన్యత నీకుఁ
గలుగు'నన్నను మహీ-కాంతుఁ డా కుంభు
నలర వీక్షించి యి-ట్లనియెఁ 'జిత్తంబు 1660
ఎట్టిది? దాని నే-నెటు తుంపవచ్చు?
నట్టి చందముఁ దెల్పుఁ' - డనినఁ గుంభుండు
పలికె నిట్లనుచు. 'నో-పార్థివాధీశ
యల వేదనాత్మ కా-హంకృతి చిత్త
బీజంబులోపల- బెరసిన రూప
బీజం బనఁగ నొప్పుఁ, - బెమపొంద దాని
- ↑ చచ్చినను-వేం.