చతుర్ధప్రకరణము
243
దిరుగుచుండఁగఁ, దన దేశంబు మున్ను
పరిపాలనము సేయు - ప్రభువు నశించి
పోవఁగా, నప్పుడు త-ద్భూమికి రాజు
కావలె నని మంత్రి - గణములు గూడి 950
చని, యా భగీరథు - జగతి పై వెదకి,
కని మ్రొక్కి ప్రార్థించి, - క్రమ్మఱ నతనిఁ
దొడుక వచ్చి, పొందుగ రాజ్యపదము
నడరఁ బాలించుట - కపుడు పట్టంబు
గట్టఁగాఁ, బూర్వ ప్ర-కార మారాజు
నెట్టన నందుండి - నిస్పృహుండగుచు,
మొనసి సప్తసముద్ర - ముద్రిత ధరణి
నొనరంగఁ బాలింపు చుండి శమంబు,
దమమును, పరమశాంత-ము, శత్రుమిత్ర
సమదర్శనత గల్గి - శాంతినిఁ బొంది, 960
యరయ జీవన్ముక్తు-డై యుండె' ననుచుఁ
బరఁగ భగీరథో-పాఖ్యాన మమరఁ
బట్టుగా బోధించి, - ప్రతిబంధకములు
నెట్టనఁ బాయక - నే యెవరికైన
నిలువ దాత్మజ్ఞాన - నిష్ఠ యెన్నటికి,
నెలమి నీ యర్థమం-దిల శిఖిధ్వజుని
చరితంబు చెప్పెద - సావధానముగ
నరలేక విను మంచు - నావసిష్ఠుండు
సచ్చరిత్రుండైన - జానకీపతికి
మచ్చికతోఁ జెప్పి, - మరల ని ట్లనియె: 970