పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధప్రకరణము

243

దిరుగుచుండఁగఁ, దన దేశంబు మున్ను
పరిపాలనము సేయు - ప్రభువు నశించి

పోవఁగా, నప్పుడు త-ద్భూమికి రాజు
కావలె నని మంత్రి - గణములు గూడి 950

చని, యా భగీరథు - జగతి పై వెదకి,
కని మ్రొక్కి ప్రార్థించి, - క్రమ్మఱ నతనిఁ

దొడుక వచ్చి, పొందుగ రాజ్యపదము
నడరఁ బాలించుట - కపుడు పట్టంబు

గట్టఁగాఁ, బూర్వ ప్ర-కార మారాజు
నెట్టన నందుండి - నిస్పృహుండగుచు,

మొనసి సప్తసముద్ర - ముద్రిత ధరణి
నొనరంగఁ బాలింపు చుండి శమంబు,

దమమును, పరమశాంత-ము, శత్రుమిత్ర
సమదర్శనత గల్గి - శాంతినిఁ బొంది, 960

యరయ జీవన్ముక్తు-డై యుండె' ననుచుఁ
బరఁగ భగీరథో-పాఖ్యాన మమరఁ

బట్టుగా బోధించి, - ప్రతిబంధకములు
నెట్టనఁ బాయక - నే యెవరికైన

నిలువ దాత్మజ్ఞాన - నిష్ఠ యెన్నటికి,
నెలమి నీ యర్థమం-దిల శిఖిధ్వజుని

చరితంబు చెప్పెద - సావధానముగ
నరలేక విను మంచు - నావసిష్ఠుండు

సచ్చరిత్రుండైన - జానకీపతికి
మచ్చికతోఁ జెప్పి, - మరల ని ట్లనియె: 970