242
వాసిష్ఠరామాయణము
సరసుఁడై కొన్ని వ-త్సరములు ధరను
జరియించి, మార్గవ శంబుగాఁ దనదు
పురిఁ జేర వచ్చిన, - పురవాసు లతని
నరుదుగాఁ జూచి, ని-జాలయంబునకుఁ
దాము దోడ్కొని పోయి - తగఁ బూజఁ జేసి,
ప్రేమాతిశయమున - భిక్షలు పెట్టి,
యాదరింప్పుచునుండి; - రతని రాజ్యంబు
ప్రోదిగాఁ బాలించు - పుణ్యాత్మకుండు
రయమున నాభగీ-రథు చెంతఁ జేరి,
భయభక్తు లెసఁగఁగాఁ - బ్రణమిల్లి పలికె: 930
'ఓ మహాయోగీంద్ర! - యో కృపాసాంద్ర!
నామీఁద దయయుంచి, - నాఁటి చందమున
నిలను జరింపఁగా - నేల? యిచ్చోట
నిలువవే నన్ను మన్నించి' యటంచు
నతఁడు ప్రార్థింపఁగా - నా భగీరథుఁడు
హిత మొప్ప దద్రాజ్య - మేల నొల్లకను,
మఱి యందు నిల్వ కు-న్మత్తుని పగిది
సరగునఁ జని భూమిఁ - జరియింపుచుండి, 940
మార్గవశంబుగా - మఱియొక్క చోట
భర్గుఁడో యన నొప్పు - వరమదేశికుని
కడ కేఁగి మ్రొక్కి, య-ఖండాత్మబోధ
విడువక తా ననుభ వించిన రీతి
వినిపించి, త్రితలుని - వీడ్కొని వేగఁ
జని, భగీరథుఁడు భూ-చక్రంబునందుఁ