పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242

వాసిష్ఠరామాయణము

సరసుఁడై కొన్ని వ-త్సరములు ధరను
జరియించి, మార్గవ శంబుగాఁ దనదు

పురిఁ జేర వచ్చిన, - పురవాసు లతని
నరుదుగాఁ జూచి, ని-జాలయంబునకుఁ

దాము దోడ్కొని పోయి - తగఁ బూజఁ జేసి,
ప్రేమాతిశయమున - భిక్షలు పెట్టి,

యాదరింప్పుచునుండి; - రతని రాజ్యంబు
ప్రోదిగాఁ బాలించు - పుణ్యాత్మకుండు

రయమున నాభగీ-రథు చెంతఁ జేరి,
భయభక్తు లెసఁగఁగాఁ - బ్రణమిల్లి పలికె: 930

'ఓ మహాయోగీంద్ర! - యో కృపాసాంద్ర!
నామీఁద దయయుంచి, - నాఁటి చందమున

నిలను జరింపఁగా - నేల? యిచ్చోట
నిలువవే నన్ను మన్నించి' యటంచు

నతఁడు ప్రార్థింపఁగా - నా భగీరథుఁడు
హిత మొప్ప దద్రాజ్య - మేల నొల్లకను,

మఱి యందు నిల్వ కు-న్మత్తుని పగిది
సరగునఁ జని భూమిఁ - జరియింపుచుండి, 940

మార్గవశంబుగా - మఱియొక్క చోట
భర్గుఁడో యన నొప్పు - వరమదేశికుని

కడ కేఁగి మ్రొక్కి, య-ఖండాత్మబోధ
విడువక తా ననుభ వించిన రీతి

వినిపించి, త్రితలుని - వీడ్కొని వేగఁ
జని, భగీరథుఁడు భూ-చక్రంబునందుఁ