238
వాసిష్ఠరామాయణము
మొగి నలభ్యము, సూక్ష్మ-మును, విమలంబు
నగుపరమాత్మరూ-పణు వగు నదియె
అగణిత శక్తి న-నంత ప్రకాశ
మగుటను గనకాచ-లాదులై యొప్పుఁ 830
బరువడిగా దీని పరమాణు వితతు
బరయఁగా మేరు సూ-ర్యాదులు నయ్యెఁ,
బర్వి యొప్పుచు నుండు-పరమాణు వితతి
సర్వపూరక మహా - శైలమై వెలసె .
అది మహాజ్ఞప్తి మ-యంబై మనమును
గదియఁగా దాని మ-గ్నం బయ్యె జగము,
తనియు విజ్ఞాన మాత్రం బీప్రపంచ'
మని యా నృపాలుఁ డి-ట్లనుభవసరణి
గా తగన్ వినిపింపఁ - గాను మోదించి
భేతాళుఁ డతని సం--ప్రీతితో మెచ్చి, 840
యతని వీడ్కొని చని-యాహార ముడిగి,
మతిమంతుఁడై చిత్స-మాధియం దుండెఁ
దనమందిరమున కా-ధరణీంద్రుఁ డరిగె?
ననుచు భేతాళ వృత్తాంతంబు రామ
భూపాలునకుఁ జెప్పి, బుద్ధి విశ్రాంతి
నీపగిదిని బొందు-టిల దుర్లభంబు,
అతిసులభంబుగా-నవని నింకొకఁడు
హితమొప్ప సాధించు-నిట్టి విశ్రాంతి
మురునొప్పు నీయర్థ-మున నితిహావ
మెఱిఁగింతు' నని యమ్ము-నీంద్రుఁ డిట్లనియె 850