పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధప్రకరణము

237

అని ఝంకరించి యి-ట్లడుగఁగా నగుచు,
విని యానృపాలుండు-వెఱవ కిట్లనియె

బేతాళ! నీవు సం-ప్రీతితో వినుము!
భూతాదియై పరి పూర్ణుఁడై నట్టి

యతఁడు సంవిత్సూర్యుఁ - డఖిలరూపముల
క్షితిమీఁద వెలిఁగించుఁ - జిత్ప్రభయందుఁ

ద్రన రేణువులు జగ-త్రయమునై యెపుడు
రసయుక్త విజ్ఞాన-రవిచే వెలుంగు; 820

ఆకారపత్త, య-నాకారసత్త,
ప్రాకటంబుగఁ బరి-స్పందసత్తయును

ఖ్యాతిగా నొప్పు చి-దానందశుద్ధ
చైతన్యసత్తయీ-సర్వంబు నొక్క

పరమాత్మ యనుచుఁ జె-ప్పందగుచుండు
మెఱయు తస్మాయా స-మీరకంపమున

జగము లనెడి మహా-స్వప్న జాలమున
నగణిత స్వప్నంబు-లరుదుగాఁ గాంచు,

నది పరబ్రహ్మమౌ,- నా బ్రహ్మ మెపుడు
పదిలమౌ శాంతి సం-పన్నమైనట్టి 830

పరమనిజస్వరూ-పము. వీడకుండు
నరఁటికంబము చుట్టు-నాకులుఁ, బొరలు

బుట్టుచు లయమునుం-బొందుచునుండు
నట్టిచందంబుగా-నా బ్రహ్మమందుఁ

బొరలు, వృత్తము, పఱ-పును గల్గి, విశ్వ
మరుదుగాఁ గల్గుచు-నణఁగుచునుండు