పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయప్రకరణము

149

అట హూణ దేశంబు - నందుండి మాలఁ
డట కొక్కఁ డరుదెంచి - యా దొరం గాంచి, 530

తొలఁగక పూర్వ బం-ధుత్వంబు నందుఁ
దెలుపఁగా నెఱిఁగి, మం-త్రి పురోహితాది

మనుజులు దెలిసి, 'యా - మాలనిఁ దెచ్చి
ఘనముగాఁ బట్టంబుఁ గట్టినకతనఁ

బాప మందఱికినిఁ - బ్రాపించెఁ గనుక,
నీ పాపమును నీఁగ - నిందఱ మగ్ని

యందుఁ బ్రవేశింత' - మని నిశ్చయించి,
యందఱు గుమిగూడి - యగ్నిలోఁ బడిరి.

అదిచూచి చండాలు - డైన యా ప్రభువు
'కొదికి యందఱు తన-కొఱ కగ్నిలోనఁ 540

బొలిసి పోయిరి, తాము - భూమిలో నుండ
వలయునే' యనుచుఁ బా-వకునితో వాఁడు

తానును దుమికి య-త్తఱిఁ దెలివొంది,
యానీట నున్న దే-హంబుతో లేచి.

'కటకట! యిటువంటి - కష్ట దుర్దశల
కిటువలె లోనైన - దేమొకో? నాల్గు

గడియలలో నింత - కర్మదుఃఖములఁ
బొడఁగంటి, నిట్టి య-ద్భుత మేమి చెలఁగె!

గహనంబులందు వ్యా-ఘ్రము నిజేచ్ఛలను
విహరింపుచుండెడి - విధమున సకల 550

మానవుల నశక్తి - మాయలోఁ ద్రోసి,
యూని తా భ్రమ పెట్టు-చుండుఁ జిత్తంబు'