తృతీయప్రకరణము
149
అట హూణ దేశంబు - నందుండి మాలఁ
డట కొక్కఁ డరుదెంచి - యా దొరం గాంచి, 530
తొలఁగక పూర్వ బం-ధుత్వంబు నందుఁ
దెలుపఁగా నెఱిఁగి, మం-త్రి పురోహితాది
మనుజులు దెలిసి, 'యా - మాలనిఁ దెచ్చి
ఘనముగాఁ బట్టంబుఁ గట్టినకతనఁ
బాప మందఱికినిఁ - బ్రాపించెఁ గనుక,
నీ పాపమును నీఁగ - నిందఱ మగ్ని
యందుఁ బ్రవేశింత' - మని నిశ్చయించి,
యందఱు గుమిగూడి - యగ్నిలోఁ బడిరి.
అదిచూచి చండాలు - డైన యా ప్రభువు
'కొదికి యందఱు తన-కొఱ కగ్నిలోనఁ 540
బొలిసి పోయిరి, తాము - భూమిలో నుండ
వలయునే' యనుచుఁ బా-వకునితో వాఁడు
తానును దుమికి య-త్తఱిఁ దెలివొంది,
యానీట నున్న దే-హంబుతో లేచి.
'కటకట! యిటువంటి - కష్ట దుర్దశల
కిటువలె లోనైన - దేమొకో? నాల్గు
గడియలలో నింత - కర్మదుఃఖములఁ
బొడఁగంటి, నిట్టి య-ద్భుత మేమి చెలఁగె!
గహనంబులందు వ్యా-ఘ్రము నిజేచ్ఛలను
విహరింపుచుండెడి - విధమున సకల 550
మానవుల నశక్తి - మాయలోఁ ద్రోసి,
యూని తా భ్రమ పెట్టు-చుండుఁ జిత్తంబు'