పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

వాసిష్ఠరామాయణము

చనినట్టి జాలిచే - సైరింపలేక
కనలుచు, నవల న-క్కడనుండ కరిగి

పోయి, తెప్పునఁ గీర-పురిఁ జేరియుండె;
నా యవనీశ్వరుఁ - డచట దేహంబు

పడవైచి చనఁగ, న-ప్పార్థి వేంద్రునకుఁ
గొడుకు లేకున్నఁ. ద-త్కుల మేలుటకును 510

దగిన వాఁ డెవఁడని - తాము చింతించి,
తెగువ నారాజు మం-త్రి జనంబుఁ గూడి

మొనసి పట్టపుగజ-మును నలంకార
మొనరఁ గావించి, పువ్వులదండఁ దొండ

మున నుంచి విడిచి, రి-మ్ముగ నదిపోయి
తనముందరికి వచ్చు - ధరణీసురులను,

పరరాజకులజుల, - వైశ్యశూద్రులను
దఱుముచుఁ జనిచని - తా నొక్క చోట

నాలుబిడ్డలఁ బాసి - యడలు చున్నట్టి
మాలని మెడఁ బుష్ప-మాలిక నుంచె 520

నపుడు మంత్రులు మొద-లైనట్టి వారు
కపటంబుఁ దెలియక - గజముపై వాని

నెక్కించుకొని చని - యిలఁబ్రోవ నతని
నక్కడ తాము ప-ట్టార్హునిఁ జేసి
కొలిచి యుండఁగ, వాఁడు - కొంకింత లేక
చలితాత్ముఁడై రాజ - సతులను గూడి,

పనిఁ బూని వేడ్క నేఁ బది యేండ్లు రాజ్య
మొనరంగఁ బాలింపు-చుండె నొప్పుగను.