148
వాసిష్ఠరామాయణము
చనినట్టి జాలిచే - సైరింపలేక
కనలుచు, నవల న-క్కడనుండ కరిగి
పోయి, తెప్పునఁ గీర-పురిఁ జేరియుండె;
నా యవనీశ్వరుఁ - డచట దేహంబు
పడవైచి చనఁగ, న-ప్పార్థి వేంద్రునకుఁ
గొడుకు లేకున్నఁ. ద-త్కుల మేలుటకును 510
దగిన వాఁ డెవఁడని - తాము చింతించి,
తెగువ నారాజు మం-త్రి జనంబుఁ గూడి
మొనసి పట్టపుగజ-మును నలంకార
మొనరఁ గావించి, పువ్వులదండఁ దొండ
మున నుంచి విడిచి, రి-మ్ముగ నదిపోయి
తనముందరికి వచ్చు - ధరణీసురులను,
పరరాజకులజుల, - వైశ్యశూద్రులను
దఱుముచుఁ జనిచని - తా నొక్క చోట
నాలుబిడ్డలఁ బాసి - యడలు చున్నట్టి
మాలని మెడఁ బుష్ప-మాలిక నుంచె 520
నపుడు మంత్రులు మొద-లైనట్టి వారు
కపటంబుఁ దెలియక - గజముపై వాని
నెక్కించుకొని చని - యిలఁబ్రోవ నతని
నక్కడ తాము ప-ట్టార్హునిఁ జేసి
కొలిచి యుండఁగ, వాఁడు - కొంకింత లేక
చలితాత్ముఁడై రాజ - సతులను గూడి,
పనిఁ బూని వేడ్క నేఁ బది యేండ్లు రాజ్య
మొనరంగఁ బాలింపు-చుండె నొప్పుగను.