పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ మ దు త్త ర రా మా య ణ ము

74

     ననుఁ గొల్వన్ బుర మేను మీవలెనె కొన్నాళ్లేలఁ గాంక్షించితిన్. 237

మ. అని మీకూరిమితమ్ము డాడు మనినాఁ డామాట యట్లుండే యో
     జనయున్ దెల్పెదఁ బంక్తి కంధరుఁడు భాషానాథ దీవ్యద్వరం
     బునఁ దేజంబున మేటి నెయ్యమె తగున్ మూర్ఖుల్ విరోధంబు సే
     యన యున్నా రమితంబుగా నచట నయ్యా నీదుచి త్తం బనన్. 238

శా. ఆయక్షేశుఁడు పంక్తికంధరునమాత్యగ్రామణిన్ జూచి యే
     మో యం చుండితి నింతమాత్రమునకోహో యింతసంకోచ మే
     లా యీ ప్రో లొకఁ డెంత నాధనము నాయెశ్వర్యమున్ బోవఁ దా
     నే యర్హుం డగు టేమీ మీ రెఱుఁగరే యి మ్మేది భేదోక్తికిన్. 239

క. నేనై చేయఁగ వలసిన, దాని నెఱింగించె మేలు తమ్ముుడు నెమ్మిం
    దా నిప్పట్టణ మేలుట, నే నేలుటకంటె వేడ్క యిబ్బడి గాదే? 240

వ. అని కలయం బలికి, 241

క. కాపురము సేయ కిఁక లఁ, కాపుర మెడఁ బాయ వలసెఁ గా యనుబలు వౌ
    తాపము దోఁపఁగ నిక ప్ర, తాపము గలయనుజుఁ దలఁచి ధనదుడు మరలన్ .

క. రమ్మను మా తమ్మునిఁ దన, సొ మ్మనుమా లంక రాక్షసులతో మేల్ గై
    కొమ్మనుమా వల దనుమా, న మ్మనుమా యనుచు దండనాథునిఁ బని చెన్ . 243

వ. ఇవ్విధంబున మనుష్యధర్ముండు దుర్మదుం డగుదశకంధరుసకుఁ బ్రత్యుత్తరంబు వచియింప దూతన్ బంచి
    తత్క్షణంబ, 244

§§§ విశ్రవునిర్దేశంబువలన ధనేశుండు కై లాసంబు సేరుట §§§

మ. నవరత్నోజ్వలదివ్యపుష్పక విమానం బెక్కి వేవేగ
     విశ్రవసున్ జేరి నమస్కరించి యనుజప్రారంభ మాద్యంతమున్
     సవిశేషంబుగఁ దెల్పి యెయ్యది నివాసం బెందు వర్తింతు మీఁ
     దివిచారం బిఁక నేమి తండ్రి కృప నిర్దేశింపవే నావుడున్ 245

మ. ధనదున్ గన్గొని దండ్రి, యిట్లనియెఁ బుత్త్రా నేఁడు గా దద్దురా
     త్ముని దౌసప్పని యల్లనాఁడె విని యీదుర్బుద్ధి యేమూర్టు దె
     ల్పె నయో యగ్రజుప్రోలు గావలెనె బల్మిన్ గైకొనన్ జోటు లే
     దె నయం బేల పరిత్యజించె దని సూక్న్తి నీతి నేఁ జెప్పినన్. 246

శ. చిలువకు బదనికఁ జూపిన, చెలువున నాపలుకు వాఁడు సేకొన కలుకన్
     బలుకక మొగముల జేగుఱు, లొలుకఁగ వడి లేచి యిచట నుండక చనియెన్ .

ఉ. వాడు మదాంధుఁ డార్యు లగువారలు వల్కినవాక్యపద్ధతిన్
    రాఁడు పయోజగర్భునివరంబున లోకవిభుండుఁ దాన యై
    నాఁడు దురాత్ము లైనదితినందనులన్ బలుమందిఁ గూడుకొ
    న్నాఁడు శపించినన్ గినిసినన్ బని సేయదు వానిపై నికన్ . 248