పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/97

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

73

ఉ. అన్నను ద్రోచి యెంత చెడు గైన దదీయగృహంబుఁ జేరునే
     యన్నది వింటి మీవలన నారయఁ గశ్యపునాండ్రు దైత్యులన్
     గన్న నెలంత వేలుపులఁ గన్న నెలంతయుఁ దత్సుత వ్రజం
     బున్న తెఱంగు వారల సహోదర మైత్రి జగం బెఱుంగదే. 229

ఉ. ఎక్కువ లాడఁగా వెఱతు నింద్రుఁడు భ్రాత లటంచుఁ గాచెనే
     యెక్కడనై న దైత్యుల మహోద్ధతి గల్గిన నొంచుఁ దక్కినన్
     దిక్కయి కావు మంచు హరిఁ దెచ్చి వధింపగఁ బంపుఁ జూడమే
     యెక్కడి యన్న లేటి తగ వేటి విచారము శూరకోటికిన్ . 230

మ. దయయున్ ధర్మము సత్య మార్జవము శాంతం బెప్పుడుం బూని స
     త్ర్కియలన్ సౌఖ్యము లొందువేలుపులె దైతేయచ్ఛటన్ ద్రుంపఁగా
     భయ మేలా మనవంటివారలకుఁ దద్భంగిన్ బ్రవర్తింప నె
     ట్లయినన్ మేలగు దాయ గెల్వు మసురేంద్రా యంచు బోధించినన్. 231

                §§§ దశగ్రీవుఁడు లంకఁ దన కిమ్మని ధనేశునితోఁ జెప్పఁ బ్రహస్తునిఁ బంపుట §§§
శా. ఆకర్ణించి యతండు రెండు గడియల్ ధ్యానించి మీభాషితం
    బేకర్తవ్య మటంచుఁ దాతవదనం బీక్షించుచుఁన్ లేచి బా
    హాకాయకు లై యమాత్యులు ప్రహస్తాదుల్ భటుల్ గొల్వ లం
    కాకాంక్షన్ జని నిల్చె దండధర దిగ్రాజత్త్రికూటంబునన్ . 232

వ. నిలిచి యచ్చట. 233

చ. అతులవచఃప్రశ స్తునిఁ బ్రహస్తునిఁ జూచి దశాస్యుఁ డీ విఁకన్
    బితృసము నస్త దగ్రజుఁ గుబేరుని శీఘ్రమ చేరి నాయభీ
    ప్సితమును లంక ము న్నసుర శేఖరు లేచిన కార్యభంగియున్
    జతురతఁ జెప్పి యప్పుర మొసఁగఁగ వే చని యాడి రమ్మనన్ 234

చ. అతఁడు హసా దటం చతిరయంబున లంకకు బోయి కిన్నరీ
    శతమణికంకణక్వణనచారుకరోదరచామరానిల
    ప్రతిహతకుంతలుం డయి సభాస్థలి నోలగ మున్న దేవతా
    పతినిభునిన్ ధనప్రభుని భక్తిఁ గనుగొని మ్రొక్కి యిట్లనున్ . 235

ఉ. దానదయాదిసద్గుణనిధాన పరాకు భవత్ప్రియానుజుం
    డైన దశాననుండు వినయంబున మీ దగుసేమ మారయం
    గా ననుఁ బంచె మీపదయుగంబునకు?నతు లాచరించి మీ
    తో నొక మాటఁ దెల్పు మనె దోరపు వేడ్క వినుండు తెల్పెదన్ , 236

 మ. మనమాతామహు లాది కాలమున నిర్మాణంబు సేయించి యుం
      డిన గేహాంబఁట లంక యెవ్వరచటన్ లేకుండిన్ మీరు గై
      కొని పాలించితి రిప్పు డద్దడనుజముఖ్యుల్ వచ్చినా రందఱున్