ఈ పుటను అచ్చుదిద్దలేదు
అని ఆమెచే చెప్పించి, శ్రీనాథమూర్తి తన మరదలికి శిల్పచిత్రలేఖనవిద్య ప్రారంభించాడు. ఆ రోజుననే ఆంధ్రమహిళాసభలో సభ్యురాలై గౌరవ ఉపాధ్యాయినిగా చేరింది హేమ. హేమను వారందరూ కలిసి వారంరోజులలో సహాయకార్యదర్సినిగా ఎన్నుకొన్నారు. హేమ ప్రసిద్ద చిత్రకారిణి, ఉత్తమ గాయకురాలు; ఫిడేలుపై మధుర గాంధర్వము ప్రవహింపచేయు శ్రీమతి కమలాదేవిగారితో స్నేహం ప్రారంభించింది.
కమల: కళోపానసకన్న ఉత్తమజీవితం ఏముంటుంది హేమసుందరీదేవీ !
హేమ : లోకం మాడిపోతూ ఉంటే, కళ అని కూర్చుంటే ఏమి ప్రయోజనం ? రోము తగులబడిపోతూ ఉంటే, నీరో చెక్రవర్తిలై రువీణపై ప్రళయాగ్ని తాండవగీతం వాయించడం ప్రారంభించాడట.
కమ: లోకంలో బాధలు లేకుండా ఎప్పుడుంటాయి! లోకం జీవించి ఉన్నది. కాబట్టి, క్షణక్షణం మార్పు పొందుతూ ఉంటుంది. ఆ మార్పులో ఆవేదన మిళితమై ఉంటుంది. ఆవేదన కళకు ఉద్దీపన కావాలి కాని, కళా జీవితాన్ని చంపేసేటట్లయితే, లోకంలో కళలు ఉద్భవించకుండా ఉందును కాదటమ్మా?
హేమ: అది కాదమ్మా అక్కా! మనుష్యులందరూ ఉత్తమ జీవితాన్ని ఆశిస్తారు. కళాజీవితమే ఉత్తమమయితే, అందరూ ఆ కళాజీవితాన్ని ఆశిస్తారుగదా! అప్పుడు మానవజీవితం ఏమైపోవాలి?
కమ: అందరూ కళాజీవితాన్ని ఆశించేమాట నిజం, కాని అది అందరికీ లభ్యంకాదు. పూర్వజన్మ సుకృతంవల్ల ఆ కళాశక్తి కొంతమందికే లభిస్తుంది. నేనెన్ని తంటాలైనా పడుతున్నాను. నాకా కళాశక్తి దూర దూరాన్నే ఉంటూ ఉంది.
హేమ: మీ నమ్రత అలా ఉంచండి, మీరు గానంలోను, చిత్రలేఖనంలోను నిపుణులు. కాని పూర్వజన్మ సుకృతం ఏమిటి? పూర్వజన్మం ఉందనీ, అక్కడి సుకృత దుష్కృతాలు ఈ జన్మకీ వస్తూ వుంటాయనీ ఎలా నమ్మడం? ఈ నమ్మకానికి శాస్త్రాధారం ఏది?
కమ: ఈలోకంలో మనం నమ్మే అనేక విషయాలకు శాస్త్రాధారం ఏది? అయినా వానిని సత్యాలుగా మనం నమ్ముతున్నాము, ఆచరిస్తున్నాము.
హేమ: ఏవని?
కమ: ఇప్పుడు మీకూ నాకూ స్నేహం కలిసింది. ఆ స్నేహానికి శాస్త్రాధారం ఉందా?
హేమ: నేను మీ సంఘంలో చేరానుకనుక మీకూ, నాకూ స్నేహం అయింది.
కమ: చేరితే ఏమి? నాబోటి సభ్యురాండ్రు యాభై మంది ఉన్నారు. వారందరితో కూడా ఎందుకు స్నేహం కాలేదు?
హేమ: మీరు కళామూర్తులు కాబట్టి, మీకూ నాకూ స్నేహం కుదిరింది.