ఈ పుటను అచ్చుదిద్దలేదు
15
నేను మాషాద్ పట్టణాన్నుంచి ఇంకో పారసీక మహాకవి పుట్టి నివసించిన ప్రదేశం చూద్దామని టస్ నగరం చేరుకున్నాను. టస్ నగరం ' అవెష్టా ' పారశీక మతగ్రంథమంత పురాతనం. ఆ పవిత్ర గ్రంథములో ఉన్న తుపా మహానాయకుడు. అతడు తురాన్ దేశవిజేత. ఆయనే ఈ నగరం దర్శించాడు. మంగోలులీ నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. కాని నేడు ఎంత శిధిలమైవున్నా, పిరదౌసీ మహాకవి ఈ నగరంలో జన్మించిన కారణాన ఈనాటికీ ఈ ప్రదేశం లోకానికంతకూ పవిత్రం. అయింది.
ఒమారు ఖయ్యాం మహాకవి అని పారశీక ప్రజలకు తెలియకపోవచ్చును గాని పిరదౌసీని యెరుగని పారశీకుడొక్కడైనా లేడు. నన్నయ్య, తిక్కన్న, పోతరాజులను ఎలా సర్వాంధ్రులు పూజిస్తారో అలాగే పిరదౌసీని ఇరానీయులు పూజిస్తారు. పిరదౌసీ క్రీ/శ 935సంవత్సరంలో టస్ నగరంలో జన్మించాడు. 1025లో అక్కడే చనిపోయాడు. బ్రతికివున్న 90సంవత్సరాలలో అనేక సుఖాలు, కష్టాలు, జీవిత విజయాలూ, దుర్గతులూ అనుభవించాడు. గౌరవమూ, అగౌరవమూ పొందాడు. ఆ మహాకవి ప్రపంచోత్తమ గ్రంథాలలో షానామా అనే ఉత్కృష్ట కావ్యాన్ని రచించాడు.
పిరదౌసీ అంటే 'స్వర్గధామం' అని అర్థం. ఈతడు అత్యంత పురాతనమైన ఇరానియన్ వంశాలవాడు. అరబ్ సంస్కృతిని టస్ నగరమూ, ఇరానూ భరించలేక పోయింది. దేశం అంతా తిరుగుబాటు చేసింది. ఆ తిరుగుబాటు యొక్క దీప్తకంఠమే పిరదౌసీ. ప్రాచీన వీరుల ధీరోదాత్తత, మా దేశం గొడ్డుపోలేదన్న దేశభక్తి అకుంఠితమై, మహాగంభీరమై అతని వాణిలో ప్రవహించింది. ఈ ధీరగాథాలాపనంలో ఈతని పూర్వీకుడు డకీకి కవి. కాని టుర్కోమాన్ హంతకుడొక డాతని ప్రాణం దొంగబాకుకుగురి చేశాడు. ఆ డకీకి కవి స్వప్నంలోవచ్చి తాను ప్రారంభించిన పని పిరదౌసీని సంపూర్ణం చేయమని కోరినట్లు పిరదౌసీ చెప్పుకున్నాడు
జరాతృష్టుని గూర్చి వేల పద్యాలలో పాడిన డకీకి కవిత్వం తన 'షానామా' లో పిరదౌసీ చేర్చుకున్నాడు. ఈ గ్రంథం ప్రారంభించేసరికి పిరదౌసీకి 40ఏళ్ళున్నాయి. ఒక్క కొడుకూ పోయాడు. ఆ విచారగానమూ ఈ ఉత్కృష్ట కావ్యంలో శోకరాగాలు పాడుతుంది. ఒక్క కూతురు అతని జీవితాంతంవరకూ పరిచర్యచేస్తూ బ్రతికివుంది. ఈ మహాకావ్యం తలపెట్టి పిరదౌసీ గజనీ మొహమ్మదు రాజసభకుపోయి అక్కడ సభారత్నమై అరవై వేల ద్విపదలుగా షానామా రచించాడు. ఆ