పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తిరిగాను. మా చెల్లెలుకూడా ఒకసారి భారతదేశం తిరగాలనుకొంటోందిఅన్నారామె అన్నగారు.

   నేను :  వారు తప్పకుండా  వచ్చి  మా దేశం అంతా తిరగాలని  నేనూ కోరుతున్నాను. మాలో ఉత్తమ కవి  ఇక్బాల్ గారూ, ఉత్తమశిల్పి చాగతాయి గారూ ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. నాకు  మీ  అరబ్బీయ సంస్కృతంలో ఏదో  పరమ  మధురమైన  మార్దవము కనపడుతుంది. నిజంగా  ఆలోచిస్తే, ఒక సంస్కృతి  ఇంకో  సంస్కృతికి  వ్యతిరేకంగా ఉండగలదా అనుకుంటాను.
   అజరా : అక్కడ  మా  ముస్లిం కవులు  మీ దేశభాషలలో కవిత్వం  ఏమన్నా వ్రాశారా?
   నేను  : ఎంతోమంది వ్రాశారమ్మా! బంగాలీలో నజురుల్  ఇస్లాం గారూ, గుజరాతీలో  షయదాగారూ , తెలుగులో  ఉమర్-ఆ-లీ-షా గారు కవిత్వాలు వ్రాశారు.
   వారిదగ్గర శలవు పుచ్చుకొని  అజరాకన్య అందమునకు మనస్సులో జోహారులర్పిస్తూ  నా బసకు  వచ్చేశాను.
   
                                                                                                          14
   పుణ్య  ప్రదేశాలలో  మహామధురకవి  ఒమారుఖయ్యాం   జీవించిన  పవిత్ర ప్రదేశాలు ప్రత్యక్షం అవుతాయి అన్న  ఏదో  పులకరింపు, ఏదో మహానుభూతి నాకు వివశత్వం కలిగించినవి. ఎవరో కొద్దిమంది ఒమారు పేరు  ఎరుగుదురు. ఆ  మధురకవి పేరు  వారి కవసరములేదు. ఆయన వేదాంతమూ  వారి మతానికి  దూరం. ఆయన సున్నీ, వారు షియాలు. అతని పేరు ఒమారు. పరిషియాకు విరోధి అయిన  ఖాలిఫ్ ఒమారును జ్ఞాపకం  చేస్తుంది  ఆ  అమృతకవి పేరు.                                                                                                                           
           
               

నేను నిషావూరు వెళ్ళాను. నిజంగా ఈనాడు ఆ నగరంలో వెనకటి సౌందర్య నిషాలేదు. నేడది నిశాపురం. ఈనాడు అక్కడ ఒమారు చెప్పినట్లు చక్కని కుండసామాను చేస్తారు. ఒమారు వర్ణించిన అందమైన బజారులు ఈ రోజున ఏవి? అతను చదివిన మదస్రా ఏది? అతడు వర్ణించిన మైదానం ఎక్కడ? ఒమారు గోరీ చూచాను. అక్కడ ప్రసిద్ధుడైన ఫరీద్-అద్-దీన్ గోరీని చూచాను. ఆయన గోరీ పక్కనే ఇమామ్జడాహ-మహరుఖ్ మసీదూ చూచాను. చక్కని నీల గుంబాజ్ తో ఆ మసీదు సుందరమైన శిల్పరూపం. ఆ మసీదు ఆవరణలో తోటలో ఒమారు గోరీ, ఉన్నది. అతడు తన భవిష్యత్తు చెప్పుకొన్నట్లు అతని గోరీ పూవుల వర్షం కురిసేచోటనే ఉన్నది. నాకు కన్నీరు తిరిగింది.

   నిషాపూరు అత్యంత పురాతన నగరం. క్రీస్తుశకం మూడవ  శతాబ్దంలో