ఈ పుటను అచ్చుదిద్దలేదు
నేనాతనికి కళలంటే ఏమిటో బాగా నేర్చుకొమ్మనీ, ఆమె కానందం సమకూర్చడమేఅతని కర్తవ్యమనీ బోధించాను. ఒక వారం రోజులు వారి ఆతిథ్యం స్వీకరించి ఓడ ఎక్కి సయామూ, ఫ్రెంచి ఇండోచీనా యాత్రకు బయలుదేరాను.
12
నేను, బోరోబదూరు మొదలైన జావా శిల్పక్షేత్రాలను దర్శించగానే డిజాంగ్ గారితోనూ, విల్హె ల్మినాతోను బలిద్వీపం చూచాను. బలిద్వీపంలో జావా ద్వీపంలోకన్నా ఎక్కువ భారతీయాంధ్ర చిహ్నాలున్నాయి. అక్కడి మనుష్యులలో, వారి ఆచారాలలో, ఎక్కువ ఆంధ్రత్వం ఉంది. బలిద్వీప వాసులు పూర్తిగా హిందువులు. వారి శిల్పంలో గాంధారరీతి కనిపిస్తుంది. హిందూ దేవతలనే వారు పూజిస్తారు. వారి నాట్యాలన్నీ కూచిపూడి సంప్రదాయానికి మాకృత అయిన ఆంధ్ర సంప్రదాయానికి ఉద్భవించినవే. ఈ ద్వీపాలలో భారత, రామాయణ వీధి నాటకాలు ఎంతో ఉత్తమ స్థితిలో వున్నాయి. ఈ నాటకాలకి వాంగు ప్రదర్శనము అని పేరు.
జావా రాజులు మహమ్మదీయులైనా వారి ఆచారాలు హిందూ ఆచారాలే. వారిని రాజులంటారు. వారి కోటలో ఈ రామాయణ భారత నాటకాలు అచ్చంగా మన కూచిపూడి విధానంలో ప్రదర్శింపబడుతాయి. అర్జునుడు, రాముడు వారికి ఉత్తమ నాయకులు.
జావాలో ఆంధ్రదేశపు తోలు బొమ్మల వంటి తోలుబొమ్మల కళ కూడా ప్రదర్శిస్తారు. ఆంథ్రదేశంలోవలెనే జావాలోను రామాయణం, భారత గాథలు ప్రదర్శిస్తారు. మన తోలుబొమ్మల ప్రదర్శనంలోవలెనే హనుమంతుడు రామాయణంలోనూ, అర్జునుడు భారత కథలోనూ ప్రాముఖ్యత వహిస్తారు. తోలుతో బొమ్మలుచేసి, రంగులువేసి, అలంకరించి, తెల్లని తెరపై కెక్కించి, వెనుక దీపాలుంచి, ఒక్కొక్కరే సంగీతాలు పాడుతూ, ఒక్కొక్క పాత్ర నాడిస్తూ ఈ ప్రదర్శనం జరుపుతారు. బొమ్మలలో కొంచెం మంగోలియనుతనం వచ్చింది. అయిన డిజాంగుగారితో, విల్హె ల్మినాతో ఈ ప్రదర్శనాలకు వెళ్ళినప్పుడు వారికి భారతదేశానికీ, యవద్వీపాదులకూ ఉండే సంబంధం అంతా ఆ తోలుబొమ్మలాట. వాంగ్ నాట్య విధానమూ, సవిమర్శనంగా వ్యాఖ్యానించి చెప్పాను. విల్హె ల్మినా ఆశ్చర్యం పొందింది.
భూషణ్! మీ దేశం నేను యాత్రలో తిరిగినప్పుడు ఈ అద్భుతాలు చూపించినవారు లేకపోయారు. ఎన్ని నిధులున్నాయో మీ నాగరికతలో! అన్నది.
అవునమ్మా! భారతదేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, అసలు భారతదేశం చూడాలి. అది ఇంకా తొల్లింటి ఉత్తమరూపంలో కాకపోయినా, ఆ రూపాన్ని సర్వవిధాలా దృశ్యం చేయగలిగే రూపంలో పల్లెటూళ్ళలో ప్రత్యక్షం అవుతుంది.